NEELAS BLOG

Some Quotes

"I will not say I failed 1000 imes,I will say that I discovered there are 1000 ways that can cause failure.......... Thomas Edison" "Believing everybody is dangerous;Believing nobody is very dangerous.......Lincon" "If you start judging people you will be having no time to love them....MOTHER TERESA"

Wednesday, November 3, 2010

War against Which Terror, Mr Obama ?  

WITH the arrival of President Obama of the USA in India in early November, we can expect the ‘War on Terror’ to be highlighted in even more strident terms than ever before. It is logical that the government of India is concerned with the issue. It is at the receiving end of both cross-border and home-bred terrorism. But it seems that its “strategic ally,” the USA, is less concerned about the reality of the ‘War on Terror’ than its theatrical value.

DUBIOUS US ROLE
This is evident from the manner in which Pakistan, the major strategic ally of the USA in our region, has pussy-footed in its efforts to deal with the Lashkar-e-Toiba, which its ally the USA publicly says is a threat second only to Al Qaeda. So much so that its leaders hide under other umbrellas and get away on the basis of legal loopholes. The David Headley affair is even more surprising, if one follows up on how it happened.

Headley, an American citizen of Pakistani origin, who had been arrested on charges of drug peddling, was not only released but had been frequently touring Pakistan and India with impunity. We must know whether he was recruited as an undercover agent in jail. Later, he was rearrested in the USA when India’s search for the masterminds of the Mumbai blasts became hot enough to probably blow his cover. Yet, cover or not, it is evident that the US authorities did not give their Indian counterparts even the basic information they had on the impending attacks on Indian soil. They even covered up for him --- if his wives’ information is anything to go by.

Once arrested, he was, on the basis of legal loopholes, not allowed to meet Indian detectives. Later, after he had been allegedly tutored, they were allowed to meet him in the USA. Even so, he appears to have let on that the whole Mumbai bombings were masterminded in Pakistan by the ISI. But that confession does not appear to have hardened the leaders of the global ‘war on terror’ enough to punish Pakistan’s ISI for its misdeeds. On the contrary, India is being pressured to soften its position on bilateral talks with it. Worse, not only has the ISI been given a clean chit by the USA; Pakistan has been granted 2 billion dollars in arms aid. It is also alleged that the mass murder of Sikhs in Anantnag district of Kashmir was planned by the ISI, but a man no less than President Clinton provided the cover-up by refusing to state who had done it.

This appears to be a strange way of dealing with a terrorist state. But it is not so strange if one looks at how the USA has turned blind eye to numerous acts of terrorism by another of its allies, Israel, which has been committing such acts over decades. In fact, its role in destabilising West Asia seems parallel to that of Pakistan in Central and South Asia. The parallel extends to the manner in which both states became clandestine nuclear powers and consistently practise international terrorism, as is evident from Israel’s murderous attacks on individuals in other states, as in Dubai recently, the destruction of Iraq’s nuclear facility and many other such actions all over West Asia and Africa. Pakistan’s use not only of militant bases in its occupied territory in Kashmir, but even its Karachi and Punjab based operations involving both Nepal and Bangladesh, remind one of how close the parallel is between the actions of these two states.

What is even more shocking is how the man who blew the whistle on Israel’s secret nuclear weapons programme, Mordechai Vanunu, is still in jail for well over a decade in Israel for having exposed that state’s illegal and criminal activity in the field of nuclear arms production.

SAVAGE SENTENCES AGAINST CUBAN FIVE
One may not be too surprised if a rogue state like Israel does such a thing. But what if it happens in the “Land of the Free,” like the USA? This is exactly what happened to five patriotic Cubans now in jail in the USA for over twelve years. Their sole crime is that they set up a fact-finding team to expose Cuban exile terrorists: Luis Posada Cariles and Orlando Boseh Avila. These men are wanted for a series of terrorist crimes including the blowing up of a Cuban passenger plane with 73 people on board in 1976. In all, 3,478 Cubans have been killed in terrorist attacks and 2,099 have been maimed. So it is not surprising that young and intelligent Cubans have been forced to try to stop such activity by nipping it in the bud.

What is the crime of the five patriots in jail in Cuba? They exposed these criminals. And who are they? Unlike the drug-running criminals who are the terrorists, they are well educated young men who have lost the most productive years of their lives in US prisons, suffering every sort of privation and torture to ensure that their countrymen can live lives free of terrorism.

There is Gerardo Hernandez Nordelo, born in 1965, a graduate in international political relations and a well-known cartoonist who has published a book of his drawings in 2002. He has been sentenced to two life terms and 15 years. Ramon Labanino Salazar, born in 1963, graduated with the best performance in economics. He was sentenced to a life term in prison and 18 years. Rene Gonzales Sehweret, born in 1956 in Chicago, is a pilot and flight instructor; he has been sentenced to 15 years. Fernando Gonzales Llort, born in 1963, graduated with high marks in international political relations. He has been sentenced to 19 years. Antonio Guerrero Rodriguez, born in 1958 in Miami, is an airfield construction engineer trained in Kiev in the Ukraine, a poet and artist. He has been sentenced to life imprisonment and 10 years.

It is amazing that such savage sentences have been passed against those who have committed no act of violence, by violating judicial procedures  in the USA, by suppressing evidence and rejecting the right to appeal given to them by the court. On the other hand, Orlando Bosch and Lusada Cariles are both free in the USA with presidential support by George Bush senior and junior. President Obama had won on the slogan of change. But throughout this period he has done nothing to give justice to the Cuban Five. Let it be clear that the people of India will find his call for ‘War on Terrorism’ less than credible if justice is not done.

We who are at the receiving end of both state-sponsored and individual terrorism from across our borders cannot see sense in allying with such an unreliable and double-faced entity in a matter of life and death for our people. We are aware that imperialism offers many blandishments, but it has only its interests to serve and no friendship to offer. We demand the immediate release of the Cuban patriots and will continue our struggle against those who have illegally imprisoned them, until they are released.

*Article published in www.cpim.org written by Suneet Chopra
Posted by Srinivas NEELA at 3:04 AM No comments:
Labels: Mr Obama?, War against Which Terror

Wednesday, October 20, 2010

ప్రపంచవ్యాప్తంగా కరెన్సీ యుద్ధం


అగ్రగామి పెట్టుబడిదారీ దేశంగా ఉన్న అమెరికా ప్రస్తుత పరిస్థితిలో నాయకత్వం వహించగలిగిన స్ధితిలో లేదు. ఎందుకంటే అది ఏమాత్రం విస్తరణ కార్యక్రమాలు చేపట్టినా దాని కరెంటు ఖాతా లోటు పెరిగి పోతుంది. ప్రపంచానికి నేతృత్వం వహించే స్ధాయికి చైనావంటి దేశాలు ఇంకా ఎదగలేదు. నానాటికీ పెరుగుతున్న ప్రపంచ డిమాండు అవసరాలను తీర్చటానికిగాను పలు దేశాలు కలసి సమన్వయంతో వ్యవహరించటానికి అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిదారులు సుముఖంగా లేరు. ప్రభుత్వ జోక్యాన్ని వీరెంతమాత్రం సహించలేకపోతున్నారు.కనుకనే పక్కవాడి నెత్తిన చేతులు పెట్టే సిద్ధాంతాన్ని వీరు చేపడుతున్నారు. సంక్షోభం నుంచి బయటపడేందుకే ఈనాడు కరెన్సీ యుద్ధాలు సాగుతున్నాయి.


ఈనాడు ప్రతి ఒక్కరూ కరెన్సీ యుద్ధం గురించి మాట్లాడుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్దవైన ఆర్థిక వ్యవస్థల మధ్య ఈ యుద్ధం సాగుతున్నది. ఇతర దేశాలతో పోల్చినపుడు తన కరెన్సీ విలువ తక్కువ ఉండేలా ప్రతి దేశమూ చర్యలను చేపడుతున్నది. ఏ దేశమైనా తన కరెన్సీ విలువను తగ్గించినట్లయితే, ఆ కారణంగా, ఆ దేశపు ఎగుమతులు పెరిగి దిగుమతులు తగ్గుతాయి. కరెన్సీ విలువ తగ్గింపు వలన ఆ దేశానికి చెందిన సరకుల ధరలు ఇతర దేశాల సరకులతో పోల్చినపుడు చౌకగా ఉండటమే ఇందుకు కారణం. క్లుప్తంగా చెప్పాలంటే, కరెన్సీ విలువ తగ్గింపు ఆ దేశపు నికర ఎగుమతులను పెంచుతుంది. అంటే, ఇతర దేశాల మార్కెట్‌లను ఫణంగా పెట్టి తన మార్కెట్‌లను పెంచుకుంటుంది. అదేవిధంగా, ఆ దేశం తన ఉత్పత్తినీ, ఉపాధినీ పెంచుకుంటుంది. దీనివల్ల కూడా ఇతర దేశాలు దెబ్బతింటాయి. కనుకనే కరెన్సీ విలువ తగ్గింపు ద్వారా దేశీయంగా ఉపాధిని పెంచుకోవటాన్ని తరచుగా ''పక్కవాడి నెత్తిన చేతులు పెట్టటంగా'' చెప్తుంటారు.


ప్రపంచవ్యాప్తంగా డిమాండు పెరుగుదల ఉన్నపుడు కరెన్సీ విలువ తగ్గింపు గురించి పెద్ద పట్టింపు ఉండదు. ఎందుకంటే కరెన్సీ విలువను తగ్గించనప్పటికీ ప్రతి దేశంలోనూ ఎంతో కొంతమేరకు ఉపాధి పెరుగుదల ఉంటుంది. పోటీలుపడి కరెన్సీ విలువలను తగ్గించటమంటే, ఒకరి మార్కెట్‌ను మరొకరు గుంజుకునే ప్రయత్నం చేయటమన్న మాట. ప్రపంచ డిమాండులో పెరుగుదల లేదంటే దానర్థమేమంటే, ప్రపంచం, సంక్షోభంలో చిక్కుకున్నదన్నమాట. ఇప్పటికీ, కరెన్సీ యుద్ధంలో మునిగివున్న వారే, ప్రపంచంలో సంక్షోభం సమసి పోయిందంటూ నమ్మబలుకుతున్నారు! నిజానికి ప్రస్తుత ఆర్థిక సంక్షోభం తీవ్రతరమవుతున్నది. కరెన్సీ యుద్ధం ఈ విషయాన్నే తెలియచేస్తున్నది. సమీప భవిష్యత్‌లో ఆశారేఖలు కనిపించక పోవటంతో పొరుగు దేశాన్ని దెబ్బతీసి తన పరిస్థితిని మెరుగుపరచు కోవటానికే ప్రతి దేశమూ ప్రయత్నిస్తున్నది.


సంక్షోభాన్నిపెంచే కరెన్సీ యుద్ధం


అయితే, కరెన్సీ యుద్ధం అనేది సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. రానున్న కాలానికి సంబంధించి మారకపు రేట్ల గురించిన అంచనాలు అనిశ్చితంగా ఉన్నట్లయితే, అదేవిధంగా రానున్న కాలంలో పరాయి దేశం మార్కెట్‌ గురించిన అవగాహన అస్థిరంగా ఉన్నట్లయితే ఆప్పుడా పరిస్థితి ప్రతిచోటా ప్రైవేటు పెట్టుబడులకు ఏమాత్రం ప్రోత్సాహంగా ఉండదు. ఇది, మాంద్యం పెరుగుదలకు దారితీస్తుంది. సాపేక్ష కరెన్సీ విలువలో అనిశ్చితి నెలకొన్నట్లయితే, సంపన్నులు బంగారం వైపుకు లేదా చమురు వైపు, ఇతర సరకుల ఫ్యూచర్స్‌ మార్కెట్‌ వైపుకు మొగ్గు చూపుతారు. ఇది, ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, కరెన్సీ యుద్ధాలు, ప్రస్తుత సంక్షోభాన్ని ప్రతిబింబిస్తూ, ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి.


'నూతనావిష్కృత ఆర్థికవ్యవస్థలు' ప్రత్యేకించి చైనా, తదితర ఆసియా దేశాలే (భారత్‌తోసహా) కరెన్సీ యుద్ధాలకు మూలమని పాశ్చాత్య దేశాలకు, ముఖ్యంగా అమెరికాకు చెందిన వ్యాఖ్యాతలు చెప్పుకొస్తున్నారు. వారి వాదన ఇలా సాగుతుంది: అమెరికా కరెంటు ఖాతా లోటు భారీగా వుండి, ఇదేసమయంలో ముఖ్యంగా చైనాతోపాటు ఇతర నూతనావిష్కృత ఆర్థికవ్యవస్ధల కరెంటు ఖాతాలు మిగులుగా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన అసమానతలు నెలకొన్నాయి. ఈ అసమానత్వం కారణంగా, సంక్షోభంలో చిక్కుకున్న అమెరికా నుండి చైనా తదితర నూతనావిష్కృత ఆర్థికవ్యవస్ధలకు సట్టా వ్యాపార పెట్టుబడులు తరలుతున్నాయి. చైనా తదితర దేశాల కరెన్సీ విలువ పెరిగినట్లయితే అమెరికా తదితర అభివృద్ధి చెందిన దేశాలు చాలావరకు స్ధిరంగా ఉండేవి. కాని చైనా తదితర దేశాలు తమ కరెన్సీ విలువను పెంచలేదు. పైగా అత్యున్నతమైన విదేశీ మారక నిల్వల రూపంలో ఉన్న డాలర్ల ప్రవాహాన్ని అది ఏమాత్రం అడ్డుకోలేదు. ఇది డాలర్‌ విలువపై ఒత్తిడిని తీసుకు వస్తున్నది. కనుక, చైనా తన కరెన్సీ విలువను తగ్గించటం ''ఆదిమ పాపం''తో సమానమని, దీనినుంచే కరెన్సీ యుద్ధం పుట్టుకు వచ్చిందని పాశ్చాత్య వ్యాఖ్యాతలు చెపుతున్నారు. చైనా దిగుమతులపై ఆంక్షల విధింపునకు అమెరికా ప్రతినిధుల సభ ఇటీవలనే ప్రభుత్వానికి అనుమతిని ఇచ్చింది.


ఇలా వాదించేవారు ఒక అంశాన్ని విస్మరిస్తున్నారు. ఒకవేళ చైనా తన కరెన్సీ విలువను పెంచిందనుకుందాము. ప్రాయికంగా చూస్తే దీనర్థమేమంటే, చైనా సరకులు అంతకుముందంత చౌకగా ఉండవు. ఇంకా దీనర్థమేమిటంటే, చైనా నికర ఎగుమతులు తగ్గుతాయి. దీనివల్ల ప్రపంచ ఆర్థికవ్యవస్థలో మార్పు వస్తుంది. అంటే, కరెంటు ఖాతాలోని అసమానతలు తగ్గుతాయి. మిగిలినవన్నీ యథాతథంగానే ఉంటాయి. కాగా చైనా ఉత్పత్తిలోనూ, ఉపాధి రంగాలలోనూ తగ్గుదల ఉంటుంది. కరెన్సీ విలువ పెంపు కారణంగా ఉత్పత్తి, ఉపాధి రంగాలలో తగ్గుదలను నివారించేటందుకుగాను చైనా ముందున్న ఒకేఒకే మార్గం ఏమిటంటే, ప్రజల వినియోగం పెరిగేలా ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం, లేదా ప్రజలకు బదలాయింపు అయ్యే ప్రభుత్వ మొత్తాలను పెంచటం. ఆవిధంగానే చైనా చేసినట్లయితే, కరెన్సీ విలువ పెంపు కారణంగా నికర ఎగుమతుల్లో సంభవించిన తగ్గుదలను ప్రభుత్వ వ్యయాన్ని పెంచటం ద్వారా భర్తీ చేసుకుంటుంది. తత్ఫలితంగా మొత్తం దాని డిమాండులో ఎలాంటి మార్పూ ఉండదు. అదేవిధంగా ఉపాధి, ఉత్పత్తి రంగాలలో కూడా ఎలాంటి మార్పూ ఉండదు. చైనా ఈవిధంగా చేసిందనుకుంటే, అంటే, డిమాండును పెంచటానికిగాను నికర ఎగుమతుల నుంచి ప్రభుత్వ వ్యయం పెంపుదలకు మారిందనుకున్నట్లయితే, అటువంటపుడు, కరెన్సీ విలువను పెంచవలసిన అవసరమే చైనాకు ఉండదు. చైనా విధానమైన 'కరెన్సీ విలువ పెంపుదలతోపాటు ప్రభుత్వ వ్యయం పెంపుదల' కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఖాతాల అసమానతలు తగ్గి, డిమాండు ఉద్దీప్తమయ్యేటట్లయితే, ఆ ఫలితాన్ని ఒక్క ప్రభుత్వ వ్యయం పెంపుదల ద్వారానే సాధించవచ్చు.


కొట్టొచ్చినట్లు కనిపించే మరో విషయమేమంటే, చైనా కరెన్సీ విలువ తగ్గింపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పైన పేర్కొన్న వ్యాఖ్యాతలే, పైన పేర్కొన్న అమెరికన్‌ కాంగ్రెసు సభ్యులే, ద్రవ్య సంస్థల ప్రతినిధులే ప్రభుత్వ వ్యయంలో పెరుగుదల ఎక్కడవున్నా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధ్యక్షుడు ఒబామా ప్రకటించిన నామమాత్రపు ఉద్దీపన పథకాలను సైతం ఉపసంహరించు కోవాలని వీరు చెపుతున్నారు. నిరుద్యోగం తొలగింపునకు ప్రభుత్వ వ్యయంలో పెంపుదల ప్రతి చోటా దుష్ఫలితాలను ఇస్తుందని, చైనాలో మాత్రం కాదని, చైనా (ఇతరంగా ఉన్న అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్ధలు) కరెన్సీ విలువను పెంచాలని సలహా ఇచ్చేవారు చెప్పజాలరు. నిరుద్యోగం తొలగింపు నిమిత్తం దేశీయ డిమాండును పెంచేసాధనంగా శ్రామికుల వేతనాలలో పెరుగుదల చైనాలో సత్ఫలితాలను ఇస్తుందని చెప్పేవారు, అమెరికాలో శ్రామికుల వేతనాలలో కోత విధింపు ద్వారానే నిరుద్యోగ పరిస్థితిని ఎదుర్కొన వచ్చునని చెప్పజాలరు. నిరుద్యోగ సమస్యను అధిగమించేటందుకై అమెరికాలో ఏ ఆయుధాల ప్రయోగాన్నైతే వ్యతిరేకిస్తున్నారో, ఆ ఆయుధాలనే చైనాలో ఉపయోగించమని చెప్పజాలరు. మరో విషయాన్ని కూడా ఇక్కడ చెప్పుకోవాలి. చైనా కరెన్సీ విలువను పెంచాలని సలహా ఇచ్చేవారు, ఇలా విలువను పెంచటం చైనాలో నిరుద్యోగానికి దారితీయబోదని విశ్వసించాలి, అలా చేయటమంటే అది పూర్తిగా తప్పవుతుంది. లేదా చైనాలో నిరుద్యోగం పెద్ద సమస్య కాదని భావించేటట్లయితే అది దురహంకారమే అవుతుంది. ఇందులో ఏది సరైనది? నిజానికి, దురహంకార పూరితమైన వాదనను పూర్తిగా దోషపూరితమైన సిద్ధాంతం ద్వారా ముందుకు తీసుకు వచ్చారు. అదేలానో చూద్దాము. తప్పుడు సిద్ధాంతం


పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో స్వేచ్ఛయైన, నిరాటంకమైన మార్కెట్‌ కార్యకలాపాలు సహజంగానే ''పూర్తిస్ధాయి ఉపాధి''ని కల్పిస్తాయన్న ద్రవ్య పెట్టుబడుల తప్పుడు సిద్ధాంతం పలువురు ఆర్థికవేత్తల ద్వారా, వ్యాఖ్యాతల ద్వారా ప్రచారంలోకి వస్తున్నది. 1930ల నాటి పెను మాంద్యం సమయంలో సైతం ఈ వైఖరిని వారు విడనాడలేదు. సంక్షోభ ప్రారంభంలో దీనికి కాస్త ఎదురుదెబ్బ తగిలినప్పటికీ మరలా పుంజుకుని తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. ద్రవ్య పెట్టుబడిదారుల ప్రచారమే ఇందుకు కారణం. అమెరికాలో నిరుద్యోగం రేటు 10 శాతంగా ఉన్నప్పటికీ ఒబామా ప్రకటించిన నామమాత్రపు ఉద్దీపన పథకాలను సైతం ఉపసంహరించు కోవాలంటూ డిమాండు చేయటాన్ని ఏవిధంగా వివరించగలరు? ఇలాంటి ఉద్దీపనలు లేనప్పటికీ పూర్తిస్ధాయి ఉపాధివైపు ఆర్థికవ్యవస్థ సాగగలదన్న విశ్వాసమే ఇలాంటి డిమాండ్లను ముందుకు తీసుకు వస్తున్నది. రూజ్వెల్ట్‌కు ముందు అమెరికాకు అధ్యక్షుడిగావున్న హెర్‌బెర్ట్‌ హూవర్‌ ఇలాంటి దృక్పథాన్నే కలిగివున్నాడు. హూవర్‌ చేపట్టిన విధానం పెనుమాంద్యానికి దారి తీసింది.


చైనావంటి దేశాలు స్వేచ్ఛా మార్కెట్లను అడ్డుకుంటున్నాయని అమెరికా ఆర్థిక మంత్రి టిమ్‌ గీత్నర్‌ ఆరోపించాడు. స్వేచ్ఛా మార్కెట్‌ను చైనా అనుమతించేటట్లయితే అది చైనాతో సహా అందరికీ ప్రయోజనకారిగా ఉంటుందని ఆయన చెప్పారు. చైనా కరెన్సీ విలువ పెరిగినట్లయితే అదేమీ ఆందోళనకరం కాదని ఆయన చెప్పుకొచ్చారు. పైగా దానివల్ల నిరుద్యోగం తగ్గుతుందని పేర్కొన్నారు. చైనా కరెన్సీ విలువను పెంచాలని కోరటంలో అసలు ఆంతర్యం వేరే వున్నది. అలాంటి పెరుగుదల చైనాలో నిరుద్యోగానికి దారితీయగలదన్న సంగతి వారికి తెలుసు. ప్రభుత్వ వ్యయం తగ్గించే దిశలో చైనా నడవాలన్నదే వారి ఉద్దేశం.


పురాతన కాలంలో వలస దేశాలలో పరిశ్రమలు నెలకొనకుండా చేసి పెట్టుబడిదారీ దేశాలు లాభపడిన మార్గంలోనే ఇప్పుడు కూడా చైనా తదితర అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను బలిపెట్టి అమెరికా తదితర దేశాలు లాభపడాలన్నదే ద్రవ్యపెట్టుబడుల, మితవాద శక్తుల అభిప్రాయంగా ఉన్నది. మార్కెట్లు పనిచేస్తే నిరుద్యోగం అంతమవుతుందన్న నిరర్థక వాదనల ముసుగులో పై అభిప్రాయాలను ముందుకు తీసుకు వస్తున్నారు. కొత్తగా ఎదుగుతున్న వర్ధమాన దేశాల విషయంలో సంపన్న దేశాలు అనుసరిస్తున్న ఈ విధానం పక్కవాడి నెత్తిన చేయిపెట్టే సిద్ధాంతం మినహా మరేమీకాదు.


ప్రపంచ డిమాండు స్థాయి పెరిగే సూచనలు కనిపించక పోవటంతో పై వాదనలను ముందుకు తెస్తున్నారు. అగ్రగామి పెట్టుబడిదారీ దేశంగా ఉన్న అమెరికా ప్రస్తుత పరిస్థితిలో నాయకత్వం వహించగలిగిన స్ధితిలో లేదు. ఎందుకంటే అది ఏమాత్రం విస్తరణ కార్యక్రమాలు చేపట్టినా దాని కరెంటు ఖాతా లోటు పెరిగి పోతుంది. ప్రపంచానికి నేతృత్వం వహించే స్ధాయికి చైనావంటి దేశాలు ఇంకా ఎదగలేదు. నానాటికీ పెరుగుతున్న ప్రపంచ డిమాండు అవసరాలను తీర్చటానికిగాను పలు దేశాలు కలసి సమన్వయంతో వ్యవహరించటానికి అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిదారులు సుముఖంగా లేరు. ప్రభుత్వ జోక్యాన్ని వీరెంతమాత్రం సహించలేకపోతున్నారు. కనుకనే పక్కవాడి నెత్తిన చేతులు పెట్టే సిద్ధాంతాన్ని వీరు చేపడుతున్నారు. సంక్షోభం నుంచి బయటపడేందుకే ఈనాడు కరెన్సీ యుద్ధాలు సాగుతున్నాయి. ప్రస్తుత స్తంభన పెట్టుబడిదారీ విధానాల పుణ్యమే. పైగా ఈ స్థితిని అది మరింత తీవ్రతరం చేస్తున్నది. 


Article from prajasakti written By Prabatpatnayak
Posted by Srinivas NEELA at 4:41 AM No comments:
Labels: world currency

Sunday, October 10, 2010

నోబెల్‌ దుర్వినియోగం

నోబెల్‌ శాంతి బహుమతిని మరోసారి దుర్వినియోగం చేశారు. చైనా సోషలిస్టు వ్యవస్థను కూలదోసేందుకు కుట్రచేసిన నేరగాళ్లలో ఒకడైన లియూ జియావొబోకు 2010 శాంతి బహుమతిని ప్రకటించారు. సహజంగానే ఈ నిర్ణయంపై చైనా ఆగ్రహం ప్రకటించింది. బహుమతి ప్రకటించారు గనుక లియూను జైలు నుంచి విడుదల చేయాలని అమెరికా అధ్యక్షుడు ఒబామా డిమాండ్‌ చేశాడు. రెండవసారి కూడా కొనసాగాలని వాంఛిస్తున్న ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్‌ ప్రపంచంలో మానవహక్కుల ఆచరణ మెరుగుపడాలని ప్రపంచంలో పెరుగుతున్న ఏకాభిప్రాయానికి ఈ బహుమతి నిదర్శనం అని పరోక్షంగా ప్రశంసించారు. సరిగ్గా ఈ సమయంలోనే ఇజ్రాయెల్‌ 1976 నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మెయిరెడ్‌ మాగైర్‌ను పాలస్తీనా ప్రాంతంలోకి వెళ్లటం చట్టవిరుద్ధమంటూ బలవంతంగా విమానం ఎక్కించి పదేళ్లదాకా రావటానికి వీల్లేదంటూ దేశం నుంచి వెళ్లగొట్టారు.


చైనా మానవహక్కులు,ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేవారు దీన్నేమంటారు?. మెయిరెడ్‌ చేసిన నేరం ఏమిటి? పాలస్తీనియన్లకు సంఘీభావం తెలిపేందుకు ప్రయత్నించటం తప్ప ఇజ్రాయెల్‌ వ్యవస్థను కూలదోయటానికి ప్రయత్నించలేదే? కానీ లియూ చేసిందేమిటి? విద్యార్థుల ఉద్యమం పేరుతో తిరుగుబాటును రెచ్చగొట్టి సోషలిస్టు వ్యవస్థను కూలదోసేందుకు కుట్ర చేశాడు. సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యతిరేకులకు బహుమతులు ప్రకటించి కమ్యూనిజానికి వ్యతిరేకంగా ప్రచారం చేయటం ఇదే కొత్తగా కాదు. సోవియట్‌ యూనియన్‌ ఉనికిలో ఉన్న సమయంలో ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా తయారైన రచయిత బోరిస్‌ పాస్టర్‌నాక్‌ను 1958వ సంవత్సరానికిగాను నోబెల్‌ పురస్కారానికి ఎంపిక చేశారు. మూడు దశాబ్దాల తరువాత పాస్టర్‌నాక్‌ కుమారుడికి దానిని అందచేశారు.


ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ గనుక ఇప్పుడు బ్రతికి ఉంటే తాను ఏర్పాటు చేసిన శాంతి బహుమతిని ఇలా దుర్వినియోగం చేయడాన్ని అనుమతించేవాడా? రెండు దేశాల మధ్య శాంతికి చేసే కృషికి శాంతి బహుమతి ఇవ్వాలని తన వీలునామాలో రాశాడు. బహుమతి నిర్ణేతలు తమ అతి తెలివితేటలను జోడించి ఇతరులకు ఇవ్వకూడదని రాయలేదుగా అంటూ దానికి వక్రభాష్యాలు చెబుతున్నారు. సామ్రాజ్యవాదులు నోబెల్‌ బహుమతిని కూడా ఒక అస్త్రంగా వాడుకోవటం 1906లో నాటి అమెరికా అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌ను ఎంపిక చేయటంతోనే ప్రారంభమైంది. ఆయనకు ఎందుకిచ్చారంటే ఆ ఏడాడే స్వీడన్‌ నుంచి విడిపోయిన నార్వేకు ఎవరో ఒక పెద్ద దిక్కు అండగా ఉండాలని రూజ్వెల్టుకు ఇచ్చామని నిర్ణేతలు తరువాత వెల్లడించారు. గతేడాది తనకు ప్రకటించిన శాంతి బహుమతి గురించి స్వయంగా ఒబామాయే దిగ్భ్రాంతి చెందారు. తనకింకా ఆ అర్హత రాలేదని చెప్పుకోవాల్సి వచ్చింది.


లియూ వంటి కమ్యూనిస్టు వ్యతిరేకులకు ప్రకటించటం వెనుక రాజకీయం గురించి చెప్పనవసరం లేదు. దుర్మార్గులకు నాయకత్వం వహించిన వారికీ, ప్రజల పక్షాన వారిని ఎదిరించిన నాయకులనూ ఒకే గాటన కట్టటం కూడా నోబెల్‌ కమిటీ నిర్వాకాలలో కొన్ని. వియత్నాంపై దురాక్రమణ, సర్వనాశనం చేసిన అమెరికా రక్షణ మంత్రి హెన్రీ కిసింజర్‌, వియత్నాం కమ్యూనిస్టుపార్టీ నాయకుడు లీ డక్‌ తోకు, పాలస్తీనా ఆక్రమణ నాయకుడు యిత్జిక్‌ రాబిన్‌, పాలస్తీనా విమోచన నాయకుడు యాసర్‌ అరాఫత్‌కు ఉమ్మడిగా బహుమతులు ప్రకటించిన ఉదంతాలు తెలిసిందే. లీ డక్‌ బహుమతిని తిరస్కరించటంతో కిసింజర్‌ కూడా దానిని తీసుకొనేందుకు సిగ్గుపడ్డాడు.నోబెల్‌ కమిటీ మరొక ప్రహసనం ఏమంటే 2007 అమెరికా ఉపాధ్యక్షుడు అల్‌గోర్‌కు వాతావరణ మార్పులపై చైతన్యం కలిగించినందుకు శాంతి అవార్డును ప్రకటించారు.


సామ్రాజ్యవాదులు తమతో పాటు, తమకు తొత్తులుగా మారిన కమ్యూనిస్టు వ్యతిరేకులకు అవార్డులు ఇప్పించుకుంటారు. తమను వ్యతిరేకించిన వారి పేర్లను ఎవరైనా ప్రతిపాదించినా రాకుండా అడ్డుకుంటారు. మన జాతిపితగా పరిగణించే మహాత్మాగాంధీ విషయంలో అదే జరిగింది. ఆయనకు ఆ బహుమతి ఇవ్వాలని 1937,38,39, 1947,48 సంవత్సరాలలో ప్రతిపాదించారు. ఆయనకు ఎందుకు నిరాకరించారో ఇంతవరకు కారణాలు బయటకురాలేదు. కానీ ఆయన మరణించిన పదేళ్ల తరువాత అరెరె బహుమతి ఇవ్వాల్సిన పెద్దమనిషిని మరిచిపోయామంటూ కమిటీ మొసలి కన్నీరు కార్చింది, పోనీ మరణానంతర అవార్డు ఇద్దామా అంటే బతికున్నవారికే ఇవ్వాలని నిబంధనలని సాకు చెప్పారు. కానీ అదే కమిటీ వాటన్నింటినీ పక్కనపెట్టి 1961లో స్కాండినేవియాకు చెందిన డాగ్‌ హామర్‌ష్కోజోల్‌కు మరణాంతరం ప్రకటించారు. సామ్రాజ్యవాదులతో పాటు వారి ప్రతినిధిగా ఉన్న ప్రపంచబ్యాంకు కూడా అవార్డులను ఇప్పించుకోవటంలో ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో ఏదో ఒక చోట మైక్రో ఫైనాన్స్‌ పిండారీల దౌర్జన్యం, దారుణాలకు గురికాని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అలాంటి మైక్రోఫైనాన్స్‌, గ్రామీణబ్యాంకు పద్దతిని రూపొందించిన ఒకప్పటి ప్రపంచబ్యాంకు అధికారి బంగ్లాదేశ్‌కు చెందిన మహమ్మద్‌ యూనస్‌కు కూడా నోబెల్‌ బహుమతి వచ్చింది. ఆసంస్థలు వసూలు చేస్తున్న అధికవడ్డీ గురించి ఆ పెద్దమనిషి ఇటీవల నెత్తీనోరు బాదుకున్నాడు.


నోబెల్‌ కమిటీ నిర్ణయాలు ఒక్క శాంతి బహుమతి విషయంలోనే అనుకుంటే పొరపాటు. 1923నే ఔషధాలపై జరిపిన కెనడా శాస్త్రవేత్త బాంటింగ్‌, ఆయన జూనియర్‌ చార్లెస్‌ బెస్ట్‌కు ఇవ్వాల్సిన అవార్డును వారి పరిశోధనను పర్యవేక్షించాడనే పేరుతో బాంటింగ్‌తో కలిపి జాన్‌ మెక్‌లోడ్‌కు ప్రకటించారు. చైనా ప్రజావ్యతిరేకి లియూ విషయానికి వస్తే గత రెండు సంవత్సరాలలో అమెరికా ఇతర ధనిక దేశాలు అటు ఆర్థిక రంగంలోనూ ఇటు రాజకీయ, మిలిటరీ రంగాలలోనూ తీవ్ర ఎదురుదెబ్బలు తింటున్నాయి. ఆర్థికంగా చైనా ప్రపంచ మాంద్యం నుంచి తప్పించుకోవటమే కాదు, అమెరికా తరువాత సంపదలో రెండవ పెద్ద దేశంగా ఉన్న జపాన్‌ను వెనక్కు నెడుతోంది. రాజకీయంగా అటు లాటిన్‌ అమెరికాలోనూ ఇటు తూర్పు ఆసియాలోనూ ప్రభావం చూపుతోంది. ఆఫ్రికన్‌ దేశాలతో సంబంధాలను రోజురోజుకూ మెరుగుపరచుకుంటోంది. తన కరెన్సీ విలువను పెంచాలన్న ధనిక దేశాల వత్తిడిని చైనా తోసి పుచ్చింది. ఇదే సమయంలో పెట్టుబడిదారీ దేశాలు రోజురోజుకీ మరింత సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. చైనాపై అమెరికా అమ్ములపొదిలోని మానవహక్కుల అస్త్రాన్ని గతంలో అనేకసార్లు ప్రయోగించినా తుస్సుమంది. ఇప్పుడు లియూ అనే శిఖండిని అడ్డుపెట్టుకొని మరోసారి అదే దాడి చేసింది. నోబెల్‌ ఆశయాలను నోబెల్‌ కమిటి ఉప్పు పాతర వేస్తోంది. సామ్రాజ్యవాద శక్తులకు నిస్సిగ్గుగా ఊడిగం చేస్తోంది.

Posted by Srinivas NEELA at 10:30 AM No comments:
Labels: nobel, నోబెల్‌ దుర్వినియోగం

Friday, October 8, 2010

1948 సెప్టెంబరు 17 కొన్ని వక్రీకరణలు

'నలుగురు గుడ్డివారు - ఏనుగు' కథలో ప్రతిగుడ్డివాడూ ఏనుగును తనకు అర్థమైనరీతిలో వర్ణించినట్లుగానే ఆనాడు తెలంగాణా గడ్డపై సాగిన ఆ మహాపోరాటాన్ని ఈనాటి రాజకీయపార్టీలు తలో విధంగా వ్యాఖ్యానించటం మనం చూస్తున్నాం. ఎవరు ఏవిధంగా వర్ణించినా, వారి, వారి గుడ్డితనం బయటపెట్టుకోవటం తప్ప ఏనుగు, ఏనుగుగానే ఉంటుంది. అలాగే ఎవరెన్ని విధాలుగా వక్రీకరించినా, వ్యాఖ్యానించినా భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో మహత్తర ఘట్టమైన తెలంగాణా సాయుధ రైతాంగ గెరిల్లా పోరాటాన్ని ఎవరైనా మసకబార్చటమో, మరుగుపర్చటమో అసాధ్యమూ, అసంభవం.


సెప్టెంబరు 17, హైద్రాబాద్‌ సంస్థానా ధిపతి 'నైజాం రాజు' భారతసైన్యాలకు లొంగి పోయిన రోజు. అప్పటివరకూ స్వతంత్ర సంస్థా నంగా ఉన్న ఈ ప్రాంతం ఇండియాలో కలిసిపో యిన రోజు. ఆరోజు తెలంగాణా విమోచన దినమా, విలీనదినమా, విద్రోహదినమా అనే వాద, వివాదాలతో వివిధ రాజకీయపార్టీల, వ్యక్తుల అభిప్రాయాలతో ఇటీవల మీడియా హౌరెత్తింది. ఆ దినాన్ని ఎవరికి తోచిన రీతిలో వారు నిర్వహించారు. ప్రజాస్వామ్య రాజ్యంలో ఎవరి దినాలు వాళ్లు జరుపుకోవటానికీ, ప్రతి విషయంపైనా తమ అభిప్రాయాలు వెల్లడించ డానికీ ఎవరికైనా హక్కు ఉంటుంది. ఇందుకు ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండా ల్సిన అవసరం లేదు. అయితే తమ రాజకీయ అవసరాలకోసం, సంకుచిత ప్రయోజనాలకోసం చారిత్రక వాస్తవాలను వక్రీకరించబూనుకోవటం మాత్రం సమర్థనీయం కాదు. 'సాక్షి' ఇంకా కొన్ని పత్రికల్లో ఇటీవల ప్రచురితమైన, కొందరి వ్యాసాలలో ఇలాంటి వక్రీకరణలు, అసత్యవ్యక్తీ కరణలతో పాటు, ఆనాటి పోరాటానికి నాయ కత్వం వహించిన కమ్యూనిస్టులపై నిరా ధారమైన నిందారోపణలనేకం చేయబడ్డాయి.

1948 సెప్టెంబరులో జరిగిన ఘటనలను వివిధ పార్టీలు, వ్యక్తులు పలువిధాలుగా చిత్రించి, వ్యాఖ్యానించటంలోని మర్మమేమిటో ముందుగా పరిశీలించటం అవసరం. సెప్టెం బరు 17ను 'విమోచనదినం'గా భావించి ఉత్సవాలు జరపాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) పిలుపిచ్చింది. ఈపిలుపును బట్టి, మన దేశంలోని ఫ్యూడల్‌ సంస్థానాలు రద్దుకావాలనీ, ప్రజాస్వామ్య పాలనలోకి రావాలనీ అందువల్ల ఆ సంస్థానాలన్నీ ఇండియన్‌ యూనియన్‌లో విలీనంకావటం సరైందనే వైఖరిని ఆపార్టీ కలిగి ఉందని భావించవచ్చా? అలా భావించే అవ కాశం ఎంతమాత్రం లేదు. ఎందుకంటే హైద్రా బాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనం గావ టాన్ని మాత్రం 'విమోచన'గా చెబుతున్నా, మరో స్వతంత్రసంస్థానమైన జమ్మూ-కాశ్మీర్‌ ఇండియా లో చేరాలని ఈ 'కాషాయసైన్యం' ఆనాడు డిమాండ్‌ చేయలేదు. పైగా కాశ్మీర్‌ స్వతంత్ర రాజ్యంగానే ఉండాలని ఆనాటి బిజెపి అవతా రం 'రామరాజ్య పరిషత్‌' డిమాండ్‌ చేస్తూ వచ్చింది. వీరి ఈ విన్యాసాలకు మతరాజకీ యాలే కారణం. కాశ్మీర్‌లో ఉన్నది హిందూ రాజు గాబట్టి స్వతంత్రంగా ఉండాలి. ఇక్కడ హైద్రాబాద్‌లో ఉన్నది 'ముస్లిం' రాజు గాబట్టి అతని రాజ్యాన్ని ఇండియాలో కలిపేయాలనే ద్వంద్వవైఖరిని వీళ్లు చేబట్టారు. అందువల్ల బిజెపి శక్తులు ఆనాటినుండి కూడా మత ప్రాతిప దికపైన, ముస్లింవ్యతిరేక దృష్టితో మాత్రమే వ్యవహరిస్తున్నారనేది వాస్తవం. అలాగే ఈనాటి వారి 'విమోచన' పిలుపుల్లో కూడా అలాంటి ప్రయోజనాలే దాగి ఉన్నాయనేది గమనించటం అవసరం. మరోవైపు ప్రత్యేక తెలంగాణావాదులు ఈ సమస్యను తమకోణంలోంచి వక్రీకరించటానికి ప్రయత్నిస్తున్నారు. వారు విచిత్రంగా ఒకవైపు విమోచనదినం అంటూనే, మరోవైపు నైజాం నవాబును కీర్తిస్తున్నారు. ఇంకోవైపు కొందరు తెలంగాణావాదులు, నక్సలైట్లలో కొందరు ఈ రోజును 'విద్రోహ దినం' అంటున్నారు. టి.ఆర్‌. యస్‌ అధినేత చంద్రశేఖర్‌రావే స్వయం గా నైజాం నవాబు చాలా గొప్పపాలకుడనీ, అతని హయాంలో ఈ ప్రాంతం చాలా అభివృద్ది సాధించిందనీ ఆకాశానికెత్తి మరీ పొగిడాడు. ఆయన నైజాం పాలకుడ్ని ఈ విధంగా కీర్తించటంపట్ల అనేక విమర్శలు వెల్లువెత్తాయి. అయినా ఆయన ఏ మాత్రం వెనక్కుతగ్గకుండా 'నైజాం నవాబు గొప్పపాలకుడని ఒక్కసారికాదు. వందసార్లు అంటాను' అని తన వైఖరిని బల్లగు ద్దిమరీ చెప్పాడు. మరి అంత గొప్పపాలకుడైన 'నిజాం' పాలన అంతం కావాలని టి.ఆర్‌.యస్‌ ఎలా కోరుతుంది? ఆ పాలన అంతమైన రోజును 'విమోచనదినం'గా ఎలా జరుపు తుంది? ఆ పార్టీకి ఇలాంటి తర్క,వితర్కాలు సుతరా మూ తలకెక్కవు. ముస్లింలలో సానుకూల వైఖరి సాదించవచ్చనే సంకుచితమైన అశతోనే ఈ విధంగా నైజాంనవాబుపైన వారు పొగడ్తలు గుప్పిస్తున్నారు. మరోవైపు ప్రజలందరి ఆకాంక్ష లనూ, సెంటిమెంట్లనూ వాడుకోవటానికి 'విమోచన' పేరుతో ఉత్సవాలు జరుపుతున్నారు. తమ ఈ వంచనాశిల్పాన్ని ప్రజలు గ్రహించలేరనే వారి నమ్మకం.

ఇక 'సాక్షి' పత్రికలో ప్రచురితమైన ఒక వ్యాసం విషయానికివస్తే, ఆ వ్యాసకర్త కమ్యూ నిస్టులపైన అనేక ఆధారాలులేని అభాండాలు వేసారు. హైద్రాబాద్‌ సంస్థానం స్వతంత్రంగా ఉండాలనే వైఖరిని కమ్యూనిస్టులు తీసుకున్నా రనేది ఆయన ఒక ఆరోపణ. ఆనాడు హైద్రా బాద్‌సిటీకి సంబంధించిన ఒకరిద్దరు నాయకులు పార్టీ వైఖరికి విరుద్ధంగా ప్రకటనలు చేసారు. వాటిని పార్టీ వెంటనే ఖండించింది. పార్టీ ఖండించిన విషయాన్ని మరుగుపర్చి హైద్రాబాద్‌ సంస్థానాన్ని స్వతంత్రంగా ఉండాలని కమ్యూని స్టులు ప్రకటించారని వక్రీకరించటం, విమర్శిం చటం ద్వారా ఆయన ఏమి సాధించదలిచారో తెలియదు. అలాగే కలకత్తా మహాసభలో అలాంటి తీర్మానమే చేసారని చెప్పటం, రజా కార్లతో కమ్యూనిస్టులు కుమ్మక్కయ్యారని అభూత కల్పనలు సృష్టించి చెప్పటం ఆయనకే చెల్లింది. ఇవన్నీ ఆయన పక్షపాత పరిశీలనకు, కమ్యూనిస్టు వ్యతిరేకతకు నిలువెత్తు నిదర్శనాలు. భూమికోసం, భుక్తికోసం, వెట్టినుండి విముక్తికోసం, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకోసం, నైజాంఫ్యూడల్‌ పాలనను తుదముట్టించేందుకు, సర్వంఒడ్డి పోరాడింది ఆనాటి కమ్యూనిస్టులనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. అంతెందుకు, కమ్యూ నిస్టులను ఇన్ని శాపనార్థాలు పెట్టిన ఈ వ్యాసకర్తే తన వ్యాసంలోనే మరోచోట తెలంగాణా సాయుధపోరాటంద్వారా 10లక్షల ఎకరాల భూ స్వాముల భూమి పేదలకు పంచిపెట్టబడిందనీ, ఈ పోరాటంలో 4,000 మంది వీరులు చని పోయారనీ, నెహ్రూసైన్యాలు ప్రవేశించాక అప్పటివరకూ పట్టణాలు పట్టిన భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు తిరిగి గ్రామాలు చేరి పేదలకు పంచిన భూములు మళ్లీ స్వాధీనం చేసుకున్నారనీ చెప్పక తప్పలేదు. మరి ఆ సాయుధపోరాటం ఎవరి ఆధ్యర్యంలో జరిగింది? కమ్యూనిస్టుల నాయకత్వంలో కాదా? ఎవరికి వ్యతిరేకంగా జరిగింది? నైజాంకూ, అతని రజాకార్‌ సైన్యానికీ వ్యతిరేకంగా కాదా? లక్షల ఎకరాల భూములు పంచి, పటేల్‌, పట్వారీ, భూస్వాములు, జాగీర్‌ దార్ల జాతినంతా పట్టణాలు పట్టించిన ఆ మహౌద్యమం, గ్రామ గ్రామానా సకల వర్గా లనూ, వర్ణాలనూ ఏకం చేసిన అతిగొప్ప ప్రజా ఉద్యమం కాదా?

కమ్యూనిస్టులను చంపటానికి, పేదల చేతి లోని లక్షలాది ఎకరాల భూమిని తిరిగి భూస్వా ములు స్వాధీనం చేసుకోవటానికి కారణమైన నెహ్రూసైన్యాలరాకను, తెలంగాణా విమోచనగా కమ్యూనిస్టులు ఎలా జరుపుతా రనేది ఆయన లేవనెత్తిన మరో సందేహం. నైజాం ప్రభుత్వ పతనం అంటే అది నెహ్రూ సైన్యాల గొప్పదనమే అనుకునే అపోహనుండే అలాంటి పొరపాటు సూత్రీకరణ ముందు కొస్తున్నది. నెహ్రూసైన్యాల రాకను బేషరతుగా, కమ్యూనిస్టులు ఏనాడూ స్వాగతించక పోవట మేగాక, ఆ సైన్యంరాక ప్రధాన ఉద్దేశం కమ్యూనిస్టుల సాయుధ పోరాటాన్ని అణచివేయ టమేననీ, నైజాంను లొంగదీయటంవారి రెండవ ప్రాధాన్యమేననీ మార్క్సిస్టులు ఎల్లపుడూ భావించారు. నైజాం లొంగిపోవటం 4రోజుల లోనే పూర్తికావటం, అయినా మరో 3 సంవత్స రాలపాటు ఆ సైన్యా లు ఇక్కడే తిష్టవేసి వేలాదిమంది కమ్యూనిస్టు పోరాటయోధులను కాల్చిచంపటం, ప్రజలపై ఎన్నో అకృత్యాలు, అఘాయిత్యాలు జరపడాన్ని బట్టే మార్క్సిస్టుల అంచనా ఎంత సరైనదో రుజువయింది. నైజాం లొంగిపోవటం నెహ్రూ సైన్యాల మూడురోజుల కృషిఫలితమనీ, హైద్రాబాద్‌ సంస్థానం ఇండియన్‌ యూనియన్‌ లో విలీనంగావటం వారి విజయం మాత్రమే ననీ అనుకుంటే అంతకంటే చారిత్రక వక్రీకరణ మరొకటి ఉండబోదు. సంస్థాన ప్రజల తీవ్రమైన ఆకాంక్ష, ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగిన సాయుధపోరాటం సాధించిన విజయంగా దానిని అర్థంచేసు కోవాలి. ప్రజలం దరూ కోరుకున్నట్లుగానే హైద్రాబాద్‌ సంస్థానం ఆరోజు ఇండియన్‌ యూనియన్‌లో విలీన మైందిగాబట్టి దానిని 'విలీనదినం' అని చెప్పటంలోనూ, సుదీర్ఘ ఫ్యూడల్‌పాలన నుండి విముక్తి పొందిందిగాబట్టి ఆరోజును 'విమోచన దినం' అనటంలోనూ ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండాల్సిన పనిలేదు. అయితే ఆ విమోచనను 'వర్గవి మోచన'గా కమ్యూనిస్టులు ఎంతమాత్రం భావించరు. దాన్ని ఫ్యూడల్‌ పాలననుండి, నిరంకుశ రాచరికం నుండి మాత్రమే విమోచ నగా అర్థం చేసుకోవాలి.

నైజాంను లొంగదీయటమొక్కటే కాదు. ఇంకా అనేక విజయాలను తెలంగాణా సాయుధపోరాటం సాధించింది. ప్రధానంగా వరంగల్‌ (ఈనాటి ఖమ్మం కలిపి), నల్లగొండ జిల్లాల ప్రాంతంలో 16వేల చదరపుమైళ్ల విస్తీర్ణంలో విముక్తి ప్రాంతం ఏర్పడింది. సుమారు 3వేల గ్రామాలలో గ్రామప్రభుత్వాలు ఏర్పడ్డాయి. భూస్వాముల మిగులు భూములు 10 లక్షల ఎకరాలు పేదలకు పంచబడింది. తాతల, తండ్రులనుండి వస్తున్న అక్రమబాకీలు, వడ్డీలు రద్దుచేయబడ్డాయి. అరణ్యప్రాంతం మొత్తం కోయ, లంబాడీ ప్రజలు ఫారెస్టు అధికారుల పీడననుండి రక్షించబడ్డారు. 13వేల మంది పేద యువకులు సాయుధసైన్యంలో స్వచ్చందంగా చేరారు. ఈ పోరాటం తెలుగు ప్రజలను ఎంతగా ప్రభావితం చేసిందంటే పోరాట విరమణ తర్వాత పార్టీపై జరిగిన అన్ని దుష్ప్రచారాలనూ, పార్టీలో అనైక్యతనూ ఎదుర్కొంటూనే 1952 సాధారణ ఎన్నికలలో ఈనాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతంలో మొత్తం 85 మంది శాసనసభ్యులూ, 19 మంది పార్లమెంటు సభ్యులూ కమ్యూనిస్టుపార్టీ తరఫున ఎన్నిక య్యారు. పార్లమెంటులో కమ్యూనిస్టుపార్టీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ప్రభుత్వం అయిష్టంగానో, అరకొరగానో అయినా వివిధ వ్యవసాయ సంస్కరణలు తేవటానికీ, భూసమస్య ముఖ్యమైన ఎజండాగా దేశంలో రూపొంద టానికీ తెలంగాణా పోరాటమే మూలం. కేంద్రప్రభుత్వం వివిధ సంస్థానాధీశులతో లోపాయికారీ ఒప్పందాలకు రాకుండా ఈ పోరాటం నిలువరించింది. సంస్థానాలను ఇండియన్‌యూనియన్‌లో విలీనం చేయటాన్ని వేగిరపర్చింది. భాషా ప్రయుక్తరాష్ట్రాల ఏర్పాటులో ఈ పోరాటం ప్రముఖ పాత్ర నిర్వహించింది. ఈ పోరాటంలో 4వేల మంది కమ్యూనిస్టులు ప్రాణాలు బలియిచ్చారు. 10వేలమందికి పైగా జైళ్ళపాలయ్యారు. కనీసం 50వేలమంది నిర్భంధాలకు, చిత్రహింసలకు గురయ్యారు. ప్రజలపై లాఠీచార్జీలు, దాడులేగాక కోట్లవిలువజేసే ఆస్తులు ధ్వంసం చేయబడ టమో, లూటీచేయబడటమో జరిగింది. దాదాపు 50వేల మంది సాయుధసైన్యాన్ని దించారు. 1947-48లో జరిగిన పాకిస్తాన్‌ వ్యతిరేక పోరాటంలో ఖర్చుపెట్టినదానికంటే ఎక్కువగా తెలంగాణాలో జరిగిన ఫ్యూడల్‌ వ్యతి రేక పోరాటాన్ని అణచటానికి కేంద్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం ఖర్చుపెట్టింది. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఆ 'వీరతెలంగాణా' పోరాటాన్ని, నేటి 'వేరుతెలంగాణా' ప్రయోజనాలకోసం కించపర్చ టం విజ్ఞులు చేయదగిన పనికాదు.

కమ్యూనిస్టులు ఈ పోరాట వార్షికోత్స వాలు జరపటాన్ని విమర్శించేవారు ఒక విష యం ఆలోచించాలి. తెలంగాణా సాయుధ పోరాటం నాటికి, ఇంకాపుట్టని పార్టీలు, పుట్టినా పోరాటాన్ని పుట్టిముంచ ప్రయత్నించిన పార్టీలు కూడా ఆ పోరాటం పేరుతో, రకరకాల సందడి సృష్టిస్తున్న నేపథ్యంలో ఆనాటి ఆ మహా పోరాటానికి నాయకత్వం వహించిన కమ్యూ నిస్టులు నాటి పోరాట విజయాలను ప్రజలలో కీర్తించటానికి పూనుకుంటే, ఇంకా మిగిలిఉన్న పోరాట కర్తవ్యాలను సాధిస్తామని ప్రతిన బూనితే తప్పెలా అవుతుంది? నాటి పోరా టానికి గర్వకారణమైన వారసులుగా ప్రకటించు కోవటానికి కమ్యూనిస్టులకు తప్ప హక్కెవరి కుంటుంది?

నైజాం వ్యతిరేక పోరాటం నడిపిన, నాయ కత్వం వహించిన కమ్యూనిస్టులను నిందించ టంతో ఆగకుండా ఆ వ్యాసకర్త మరింత ముందుకెళ్లి నైజాంనే సమర్థించటానికి పూను కున్నాడు. ఆయన తన వ్యాసంలో ఒకచోట ఇలా అంటాడు ''సెప్టెంబరు 17 పరాయి పాలనకు పునాది. ఎందుకంటే అప్పటివరకూ హైద్రాబాద్‌ రాజ్యం (తెలంగాణాతో సహా) ఇక్కడపుట్టి, ఇక్కడి ప్రజలతో మమేకమైన వారిపాలనలో ఉండింది''. ఈ మాట ఆయన అసలు నైజాన్ని బయటపెడుతోంది. ఈ విధంగా నిజాంపాలనను ప్రజలతో మమేకమైన పాలనగా చెప్పటం అంటే ఈ వ్యాసకర్త తెలంగాణా ప్రజలను అతికిరాతకంగా దోపిడీ, పీడనలకు గురిచేసిన, నిరంకుశ 'నిజాం' నికృష్టపాలనను నిస్సిగ్గుగా బలపరచటం కాదా? ఇది తెలంగాణా ప్రజలను అవమానించటం కాదా? తెలంగాణా ప్రజలపట్ల ఇంత చులకన భావం ఉన్నవారు, ప్రత్యేకరాష్ట్రం సాధించి ఈ ప్రజలనేదో ఉద్ధరిస్తామని చెప్పబూనటం మోసపూరితం. ఒకవైపు నైజాంను కీర్తిస్తూ, మరోవైపు 'విమోచనదినం' అంటూ కార్యక్ర మాలకు పిలుపులిచ్చిన టి.ఆర్‌.యస్‌ నాయకుడు కె.సి.ఆర్‌ చివరికి ఈ గందరగోళంలో ఏం చేయాలో పాలుపోలేదేమో, సెప్టెంబరు 17వ తేదీన తెలంగాణాభవన్‌లో జరిగిన విమోచన కార్యక్రమంలో ఆక్కడే ఉండికూడా పాల్గొనలేదు. బహుశా ఆవిధంగా 'నిజాం'పట్ల తన భక్తిని మరోసారి ప్రదర్శించి ఉంటారు.
ఇక సెప్టెంబరు 17ను 'విద్రోహదినం' గా కొందరు నక్సలైట్లు పిలుస్తున్నారు. ఆనాటి తెలంగాణా రైతాంగసాయుధ పోరాటాన్ని ఆపివేయకుండా, కేంద్ర కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగించాల్సి ఉండాల్సిందనీ, కానీ పార్టీ నాయకత్వం పోరాటానికి ద్రోహం చేసిందనీ వారు విశ్లేషిస్తున్నారు. ఇది పూర్తిగా అతివాద దుస్సాహసిక దృక్పథం తప్పవేరుగాదు. ఇలా భావించేవారు వాస్తవ భౌతికపరిస్థితులను పరిగణనలోకి తీసుకోవటంలో విఫలమవు తున్నారు. సెప్టెంబరు 17న నైజాం లొంగి పోయేదాకా ఉన్నపరిస్థితికి, ఆతర్వాత మారిన వర్గ బలాబలాల పరిస్థితికి గుణాత్మకమైన తేడా ఉందనే సంగతి వీళ్లు గుర్తించటంలేదు.

తెలంగాణాలో నైజాం వ్యతిరేక పోరాటం అంత ఉధృతంగా సాయుధరూపం తీసుకోవ టానికి తోడ్పడిన అంశాలను మనం జాగ్రత్తగా గమనించటం అవసరం. నైజాం నవాబు నిరంకుశత్వంలో క్రూరంగా నలిగిపోయిన ప్రజలను ఆనాడు భూమి, భుక్తి, వెట్టినుండి విముక్తికి సాగిన ఫ్యూడల్‌ వ్యతిరేక పోరాటాలు ఒకవైపు పురిగొల్పితే, మరోవైపు అగ్నికి వాయువు తోడయినట్లు దేశవ్యాప్తంగా సాగుతున్న సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయోద్య మం తోడైంది. అలాగే 1947 అగస్టు 15 తర్వాతకూడా ఇండియాలో విలీనానికి నైజాం వ్యతిరేకంగా ఉన్నాడు గాబట్టి, భారత పాలకవర్గాలకు నైజాంకు వైరుధ్యం ఏర్పడింది. ఈ అంశం పోరాటానికి బాగా తోడ్పడింది. కాంగ్రెస్‌ను అభిమానించే ప్రజానీకం కూడా పోరాటానికి సానుకూలంగా ఉండేదానికి ఉపయోగపడింది. అంతేగాక పాలకుడు మొగ లాయీ దురాక్రమణదారుల వారసుడు గావటం, ప్రజలు అత్యధికంగా హిందూ మత అనుయాయులు గావటం వల్ల కమ్యూనిస్టుపార్టీ అన్నా, పోరాటాలన్నా ఇష్టంలేనిశక్తులు, వ్యక్తులు కూడా ఈ పోరాటంలో పాల్గొన్నారు. లేదా తటస్థంగా ఉన్నారు. వీరోచిత తెలంగాణా సాయుధపోరాట మహాప్రవాహంలో ఇన్ని విధాలైన అంతర్‌ప్రవాహాలు ఇమిడి ఉన్నాయనేది మరువకూడదు.

సెప్టెంబరు 17 తర్వాత ఈ పరిస్థితంతా ఒక్కసారిగా మారిపోయింది. కాంగ్రెస్‌ అధి కారంలోకి రావటంతోనే స్వాతంత్రోద్యమ భావజాలం వెనుకపట్టుబట్టింది. లొంగిపోయిన నైజాం నవాబు, అతనితో లాలూచీపడ్డ కాంగ్రెస్‌, భూస్వామ్య, పెట్టుబడిదారీ వర్గాలన్నీ కలిపి ఒక వైపూ, పోరాడుతున్న రైతాంగమూ కమ్యూ నిస్టుపార్టీ మరొక వైపుగా నూతన వర్గ విభజన జరిగింది. ఇందువల్ల బలాబలాల్లో గుణా త్మకమైన మార్పులు సంభవించాయి. ఈ కారణాల వల్ల ప్రారంభంలో ఎంతో విశాల ప్రాతిపదికపై ఏర్పడ్డ 'నిజాం వ్యతిరేక ఐక్యసంఘటన' విచ్ఛిన్నమయింది. 50 వేల భారత ప్రభుత్వ సైన్యాల తీవ్రనిర్భందం వల్ల , రైతాంగ గెరిల్లాల సంఖ్య 2 వేలకు పడిపో యింది. మిగిలిన దళాలుకూడా ప్రజలను వదిలి, రక్షణకోసం అడవుల్లోకి వెళ్లాల్సివచ్చింది. వీటన్నింటికీ మించి ఒక పరిమిత ప్రాంతంలో భూమిహక్కు, వెట్టిచాకిరీవిముక్తి, నైజాం రాజు ఫ్యూడల్‌పాలన అంతంకావాలనే కోర్కెలతో ప్రారంభమైన పోరాటం, ఆ నియంత దిగిపో యాక కూడా కొనసాగాలనటం, కొత్తగా ఏర్పడిన 'నెహ్రూ ప్రభుత్వ' వ్యతిరేక పోరాటంగా దానిని నిర్వహించాలని చెప్పటం ఏవిధంగానూ సమర్థనీయంకాదు. నెహ్రూ పాలన కూడా దోపిడీపాలనే గాబట్టి సాయుధపోరాటం కొనసాగించాలనే వాదన అర్థంలేనిది. అప్పటివరకూ ప్యూడల్‌ దోపిడీకి వ్యతిరేకంగా తిరగబడ్డ ప్రజలు, ఆ ఫ్యూడల్‌వ్యతిరేక పోరా టంలో పాల్గొని కొత్తగా అధికారం చేబట్టిన పెట్టుబడిదారీవర్గాలను వెంటనే వ్యతిరేకిస్తారను కోవటం, అలా వ్యతిరేకించాలని ఆశించటం 'నేలవిడిచి సాము చేయటం' తప్ప మరోటిగాదు. కొత్త ప్రభుత్వం కూడా దోపిడీ దార్లదే గాబట్టి ప్రజలు పోరాటం కొనసాగించటానికి సంసిద్ధ మవుతారనే వాదన పిడివాదం తప్ప వాస్తవ పరిశీలన నుండి ఉద్భవించిందిగాదు. అలా గయితే సమాజ పరిణామం ఇంత సుదీర్ఘకాలం జరిగేదేకాదు. ఫ్యూడల్‌ దోపిడీ రూపం నుండి పెట్టుబడిదారీ దోపిడీ రూపంలోకి పాలన ప్రవేశించినపుడు తాముపోరాడిన దోపిడీ పోయినందుకు ప్రజలు పండగ చేసుకుంటారు తప్ప మళ్లీ దోపిడీయే ఉందిగదా అని 'వెంటనే' బాధపడి తిరగబడరు. ఆ కొత్తరూపం ప్రజలు భరించేదిగా ఉండటమేగాక, ఉత్పత్తి శక్తులు వేగంగా పెరిగే అవకాశంవల్ల ప్రజలకు కొంతకాలంపాటు అభివృద్ధికరంగా కూడా ఉంటుంది. ఈ అంశాన్ని అర్థంచేసుకోవటంలోని వైఫల్యమే తెలంగాణా పోరాట విరమణ విషయంలో నక్సలైట్లు తప్పుడుపాఠాలు తీయటానికి ప్రధానకారణం.

ఈ పొరపాటు అవగాహన ఈనాటి నక్సలైట్లనేగాకుండా ఆనాడు కొంతకాలం పాటు మొత్తంపార్టీనే ఆవహించింది. నెహ్రూప్రభుత్వ వ్యతిరేకపోరాటంగా అతివాద నినాదాలిచ్చి పార్టీ నష్టపోయింది. అనతికాలంలోనే ఆ తప్పు తెలుసుకుని, సాధించిన భూములు, హక్కులు నిలుపుకునేందుకు సరైన నినాదాలతో సాయుధ పోరాటాన్ని కొనసాగించటం జరిగింది. అయితే పార్టీలో ఏర్పడిన భేదాభిప్రాయాలు, అనైక్యత ఆ పోరాటానికి సరైన ముగింపునివ్వటంలో ఆటంకంగా మారటంవల్ల విజయాలను దృఢ పర్చుకోవటంలో కొన్ని వైఫల్యాలు సంభ వించాయి. ఏమైనా 'నలుగురు గుడ్డివారు - ఏనుగు' కథలో ప్రతిగుడ్డివాడూ ఏనుగును తనకు అర్థమైనరీతిలో వర్ణించినట్లుగానే ఆనాడు తెలంగాణా గడ్డపై సాగిన ఆ మహాపోరాటాన్ని ఈనాటి రాజకీయపార్టీలు తలో విధంగా వ్యాఖ్యానించటం మనం చూస్తున్నాం. ఎవరు ఏవిధంగా వర్ణించినా, వారి, వారి గుడ్డితనం బయటపెట్టుకోవటం తప్ప ఏనుగు, ఏనుగుగానే ఉంటుంది. అలాగే ఎవరెన్ని విధాలుగా వక్రీ కరించినా, వ్యాఖ్యానించినా భారతదేశ కమ్యూ నిస్టు ఉద్యమ చరిత్రలో మహత్తర ఘట్టమైన తెలంగాణా సాయుధ రైతాంగ గెరిల్లా పోరా టాన్ని ఎవరైనా మసకబార్చటమో, మరుగు పర్చటమో అసాధ్యమూ, అసంభవం. అయితే నేటికీ మిగిలిఉన్న కర్తవ్యాలతో ఆ పోరాట వారసులుగా మనం ప్రజలలో మరింత పట్టుదలగా మమేకం కావాలి. అన్ని వక్రీకర ణలకూ అదే సరైన సమాధానం అవుతుంది.

Article from Markist Monthy written by Thammenani Veerabadram
Posted by Srinivas NEELA at 9:53 AM No comments:
Labels: 17 september 1948, 1948september17

Wednesday, September 29, 2010

A Silent Attack, but Not a Subtle One Stuxnet Viruse

The Stuxnet worm was no different.

The most striking aspect of the fast-spreading malicious computer program — which has turned up in industrial programs around the world and which Iran said had appeared in the computers of workers in its nuclear project — may not have been how sophisticated it was, but rather how sloppy its creators were in letting a specifically aimed attack scatter randomly around the globe.

The malware was so skillfully designed that computer security specialists who have examined it were almost certain it had been created by a government and is a prime example of clandestine digital warfare. While there have been suspicions of other government uses of computer worms and viruses, Stuxnet is the first to go after industrial systems. But unlike those other attacks, this bit of malware did not stay invisible.

If Stuxnet is the latest example of what a government organization can do, it contains some glaring shortcomings. The program was splattered on thousands of computer systems around the world, and much of its impact has been on those systems, rather than on what appears to have been its intended target, Iranian equipment. Computer security specialists are also puzzled by why it was created to spread so widely.

Global alarm over the deadly computer worm has come many months after the program was suspected of stealthily entering an Iranian nuclear enrichment plant, perhaps carried on a U.S.B. memory drive containing the malware.

Computer security specialists have speculated that once inside the factory and within the software that controls equipment, the worm reprogrammed centrifuges made by a specific company, Siemens, to make them fail in a way that would be virtually undetectable. Whether the program achieved its goal is not known.

Much speculation about the target has focused on the Iran nuclear plant at Natanz. In mid-July the Wikileaks Web site reported that it had learned of a serious nuclear accident at the plant. But international nuclear inspectors say no evidence of one exists.

The timing is intriguing because a time stamp found in the Stuxnet program says it was created in January, suggesting that any digital attack took place long before it was identified and began to attract global attention.

The head of the Bushehr nuclear plant in Iran said Sunday that the worm had affected only the personal computers of staff members, Reuters reported. Western nations say they do not believe Bushehr is being used to develop nuclear weapons. Citing the state-run newspaper Iran Daily, Reuters reported that Iran’s telecommunications minister, Reza Taghipour, said the worm had not penetrated or caused “serious damage to government systems.”

Siemens has said that the worm was found in only 15 plants around the world using its equipment and that no factory’s operations were affected. But now the malware not only is detectable, but also is continuing to spread through computer systems around the world through the Internet.

It is also raising fear of dangerous proliferation. Stuxnet has laid bare significant vulnerabilities in industrial control systems. The program is being examined for clues not only by the world’s computer security companies, but also by intelligence agencies and countless hackers.

“Proliferation is a real problem, and no country is prepared to deal with it,” said Melissa Hathaway, a former United States national cybersecurity coordinator. The widespread availability of the attack techniques revealed by the software has set off alarms among industrial control specialists, she said: “All of these guys are scared to death. We have about 90 days to fix this before some hacker begins using it.”

The ability of Stuxnet to infiltrate these systems will “require a complete reassessment” of security systems and processes, starting with federal technology standards and nuclear regulations, said Joe Weiss, a specialist in the security of industrial control systems who is managing partner at Applied Control Solutions in Cupertino, Calif.

One big question is why its creators let the software spread widely, giving up many of its secrets in the process.

One possibility is that they simply did not care. Their government may have been so eager to stop the Iranian nuclear program that the urgency of the attack trumped the tradecraft techniques that traditionally do not leave fingerprints, digital or otherwise.

While much has been made in the news media of the sophistication of Stuxnet, it is likely that there have been many other attacks of similar or even greater sophistication by intelligence agencies from many countries in the past. What sets this one apart is that it became highly visible.

Security specialists contrast Stuxnet with an intrusion discovered in the Greek cellphone network in March 2005. It also displayed a level of skill that only the intelligence agency of some foreign power would have.

A two-year investigation by the Greek government found an extremely sophisticated Trojan horse program that had been hidden by someone who was able to modify and then insert 29 secret programs into each of four telephone switching computers.

The spy system came apart only when a software upgrade provided by the manufacturer led to some text messages, sent from the system of another cellphone operator, being undelivered. The level of skill needed to pull off the operation and the targets strongly indicated that the culprit was a government. An even more remarkable set of events surrounded the 2007 Israeli Air Force attack on what was suspected of being a Syrian nuclear reactor under construction.

Accounts of the event initially indicated that sophisticated jamming technology had been used to blind the radar so Israeli aircraft went unnoticed. Last December, however, a report in an American technical publication, IEEE Spectrum, cited a European industry source as raising the possibility that the Israelis had used a built-in kill switch to shut down the radar.

A former member of the United States intelligence community said that the attack had been the work of Israel’s equivalent of America’s National Security Agency, known as Unit 8200.

But if the attack was based on a worm or a virus, there was never a smoking gun like Stuxnet.

Article took from this Site click here to go to that site
for references goto this sites http://blogs.forbes.com/firewall/2010/09/28/reality-check-is-stuxnets-iran-connection-the-new-iraqi-wmd/
Posted by Srinivas NEELA at 4:57 AM No comments:

Thursday, September 16, 2010

 సెప్టెంబరు17 చరిత్రకు వక్రభాష్యాలు


జమిందారీ దోపిడీకి, వెట్టిచాకిరీకి, నైజాం నిరంకుశ రాచరికానికి వ్యతిరేకంగా ప్రారంభమైన రైతాంగ సాయుధ పోరాటమే హిందూ, ముస్లిం పేదలను ఐక్యంగా నడిపింది. కులమత భేదాలకు అతీతంగా పోరాట యోధులు రక్తతర్పణ చేశారు. ఇప్పుడు సమస్య విలీనమా, లేక విమోచనా అన్నది కాదు. నాటి పోరాట కర్తవ్యాలు ఇంకా పూర్తి కాలేదు. చర్చ జరగవల్సిందీ, ఉద్యమించవలసిందీ వాటి గురించే. తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవ సందర్భంగా గతాన్ని స్మరించుకునేది ఇందుకోసమే.
సెప్టెంబర్‌ 17 మరోసారి చర్చనీయాంశమైంది. విలీనమా? విమోచనా? విద్రోహమా? అంటూ కొన్ని రాజకీయ పార్టీలు కూడా చర్చోపచర్చలు చేస్తున్నాయి. అందరూ తెలంగాణా గురించే మాట్లాడుతున్నారు. ఏ తెలంగాణ గురించి అన్నదే అసలు సమస్య. ఈ చర్చోపచర్చల్లో, అసలైన సమస్యలు మరుగున పడుతున్నాయి. ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టుల పాత్ర, విశాలాంధ్రలో ప్రజారాజ్యం నినాదం గురించి ఎవరికి తోచిన రాతలు వారు రాస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ, సమైక్య రాష్ట్రం గురించి వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ చర్చకు ప్రాధాన్యత ఏర్పడింది. వేరు తెలంగాణ గురించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉండవచ్చు. కాని వీరతెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నేపథ్యం, దాని పునాదులు, తీరుతెన్నులు వేరు. వీరతెలంగాణ పోరాటాన్ని, వేరు తెలంగాణ చర్చను, కలగాపులగం చేయటం సమంజసం కాదు. చరిత్రను చరిత్రగా చూడాలి.


వీర తెలంగాణ విప్లవ పోరాటం చారిత్రాత్మకమైనది. మధ్య యుగాల నాటి అణచివేతపై ప్రజా తిరుగుబాటు. దేశంలోనే అతిపెద్దదైన హైదరాబాద్‌ సంస్థానంలో దేశ్‌ముఖ్‌లు, జాగీర్దార్లు, జమిందార్ల నిరంకుశ ఫ్యూడల్‌ దోపిడీకి హద్దుల్లేవు. ముందు జమిందార్లు, జాగీర్దార్ల భూముల్లో దున్నిన తరువాతనే రైతాంగం తమ భూమి దున్నుకోవాలి. చేతివృత్తిదార్లు తమ ఉత్పత్తులను వీరికి ఉచితంగా కట్టబెట్టాలి. వీరి కుటుంబాలలో ఉత్సవాల సందర్భంగా గొర్రెలు, మేకలు, కోళ్ళు ఉచితంగా ముట్టజెప్పాలి. ఇవన్నీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన శిస్తుకు అదనం. జమిందార్ల బిడ్డలను అత్తవారింటికి పంపేటపుడు, వారికి తోడు అత్తవారింట చాకిరి చేయడానికి దళిత బాలికలను పంపించేవారు. జమిందార్లు, అధికారుల ఇండ్లలోనూ, కార్యాలయాల్లోనూ వెట్టిచాకిరీకి, గ్రామంలో కుటుంబానికి ఒకరు చొప్పున పంపాలి. ఈ ఫ్యూడల్‌ దోపిడీికి, వెట్టిచాకిరీకి, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఉప్పొంగిన తిరుగుబాటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం.


ఈ పోరాటంలో తొలి అమరుడు బందగీ. ఆయనను 1941 జూలై 17న భూస్వామ్య గూండాలు హత్యచేశారు. సంఘం కార్యకర్త (ఆంధ్రమహాసభను సంఘం అని పిలిచేవారు) ఐలమ్మ భూమిమీద పంటను కాజేయడానికి వచ్చిన దేశ్‌ముఖ్‌ల గూండాలను రైతాంగం తరిమికొట్టింది. ఐలమ్మ పంటకు రక్షణ కల్పించింది. ఈ అవమాన భారాన్ని తట్టుకోలేని దేశ్‌ముఖ్‌ల గూండాలు 1946 జూలై 4న దొడ్డి కొమరయ్యను పొట్టన పెట్టుకున్నారు. దానితో అగ్గి రగిలింది. క్రమంగా తిరుగుబాటు సాయుధ రూపం దాల్చింది.


1928లోనే మాడపాటి హనుమంతరావు నాయకత్వంలో ఆంధ్రమహాసభ ప్రారంభమైంది. 1934లో కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రలో ఆవిర్భవించింది. 1940 నాటికే నైజాంలో ఆంధ్రమహాసభను సమైక్య ప్రజాసంస్థగా, నైజాం వ్యతిరేక ప్రజాశక్తుల వేదికగా కమ్యూనిస్టు పార్టీ రూపొందించింది. ఫ్యూడల్‌ వ్యతిరేక, నైజాం వ్యతిరేక పోరాటం నడిపింది కమ్యూనిస్టు పార్టీ. జమిందార్ల దౌర్జన్యాలు, నైజాం సైన్యాల అణచివేత, రజాకార్ల (వాలంటీర్ల పేరుతో ఏర్పడిన నిజాం ప్రైవేటు సైన్యం) దాడులను ఎదిరించి సాగిన సుదీర్ఘ పోరాటమది. ఈ క్రమంలోనే 1946లో విశాలాంధ్రలో ప్రజారాజ్యం కోసం పుచ్చలపల్లి సుందరయ్య పిలుపునిచ్చారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం ప్రకటించినప్పటికీి, హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి నిరాకరించింది. నైజాం సర్కారుకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం కొనసాగింది.


స్వాతంత్య్రోద్యమకాలంలో, హైదరాబాద్‌ వంటి సంస్థానాలకు వ్యతిరేకంగా పోరాటానికి కాంగ్రెస్‌ సిద్ధపడలేదు. స్వాతంత్య్రానంతరం కూడా నైజాంతో సహా సంస్థానాధీóశులతో రాజీకే సిద్ధపడింది. నైజాం సర్కారు స్వతంత్ర రాజ్యంగా కొనసాగడానికి కేంద్ర కాంగ్రెసు ప్రభుత్వం అంగీకరించింది. కమ్యూనిస్టుపార్టీ నేతృతంలో సాగిన సాయుధ రైతాంగ పోరాటం మాత్రం అసఫ్‌జాహీ వంశపు మధ్యయుగాల నాటి రాచరిక పాలన పునాదులను కుదిపేసింది. నైజాం సర్కారు కూలిపోవడం తథ్యం అని తేెలిపోయింది. అదే జరిగితే ఈ ప్రాంతమంతా కమ్యూనిస్టుల అధిపత్యం కిందకు వస్తుంది. అది గమనించిన నెహ్రూ ప్రభుత్వం, గోల్కొండ ఖిల్లా పునాదులు కదులుతున్న సమయంలో, 1948 సెప్టెంబర్‌ 13న యూనియన్‌ సైన్యాలను రంగంలోకి దించింది. అందుకే నాలుగు రోజులు తిరగకుండానే, ఏ ప్రతిఘటన లేకుండానే సెప్టెంబర్‌ 17న నైజాం సర్కార్‌ లొంగిపోయింది.


నిజాం లొంగిపోయిన మరుక్షణం, ఆ ప్రజాకంటకుడైన రాజునే రాజ ప్రముఖ్‌గా నెహ్రూ ప్రభుత్వం నియమించిన విషయం మరువలేం. ఏడాదికి 50లక్షలు నష్ట పరిహారంగానూ, మరో 50లక్షల రూపాయలు రాజ భరణాలుగానూ ముట్టజెప్పింది. గ్రామాల నుండి పారిపోయిన జమిందార్లు, జాగీర్దార్లు, షేర్వాణీలు విడిచి ఖద్దరు బట్టలు, తెల్ల టోపీిలతో మళ్లీ గ్రామాలకు చేరుకోడానికి, పేదల అధీóనంలో ఉన్న భూములను తిరిగి స్వాధీóనం చేసుకునేందుకు నెహ్రూ సైన్యాలు అండగా నిలిచాయి. ప్రతిఘటించిన రైతాంగం పైన భయంకరంగా దాడులు చేశాయి. ఈ పరిస్థితులలో సుదీర్ఘపోరాటంలో సాధించుకున్న భూములు, ఇతర హక్కుల పరిరక్షణ కోసం కమ్యూనిస్టుపార్టీ నాయకత్వంలో రైతాంగం సాయుధ పోరాటం కొనసాగించక తప్పలేదు. 1951 అక్టోబర్‌ 21 వరకు ఈ పోరాటం సాగింది.


భూమి కోసం, భుక్తికోసం సాగిన ఈ పోరాటంలో 6వేల మంది ప్రాణాలొడ్డారు. 10వేల మంది కమ్యూనిస్టులు, ప్రజాపోరాటయోధులు మూడు, నాలుగు సంవత్సరాల పాటు నిర్బంధ శిబిరాలలో, జైళ్ళలో మగ్గవలసి వచ్చింది. 50వేల మంది పోలీస్‌ క్యాంప్‌లలోనూ, మిలటరి క్యాంప్‌లలోనూ వారాలు, నెలలతరబడి చిత్రహింసలకు గురయ్యారు. గ్రామాల్లో లక్షలాది ప్రజల మీద దాడులు చేశారు. ఆస్తులు లూటీ చేశారు. మహిళలను మానభంగాలకు, అవమానాలకు గురిచేశారు. నెహ్రూ సైన్యాలు రాక ముందు 1,500 మంది మరణిస్తే, అవి చేరిన తరువాత మరో 2,500 మంది ప్రత్యక్షంగా వారి తుపాకులకు బలయ్యారు. మరో 2వేల మంది కాన్‌సన్‌ట్రేషన్‌ క్యాంప్‌లలో తనువు చాలించారంటే, నెహ్రూ సైన్యాలు ఎవరిమీద యుద్ధానికి వచ్చాయో అర్థ్ధం చేసుకోవచ్చు. కాశ్మీర్‌ సంస్థానం విలీనం సందర్భంగా పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో కేంద్రం ఎంత ఖర్చు చేసిందో, ఇక్కడ సాయుధ రైతాంగ పోరాటాన్ని అణచడానికి కూడా అంత ఖర్చు చేసింది.


ఈ సాయుధ రైతాంగ పోరాటంలో 10వేల మంది గ్రామదళ సభ్యులు, 2వేల మంది గెరిల్లాదళ సభ్యులతో కూడిన ప్రజాసైన్యం పాల్గొన్నది. 16వేల చ.మైళ్ళ భూభాగంలో ప్రజారాజ్యం స్థాపించింది. 10 లక్షల ఎకరాల భూమి పంచింది. 3వేలగ్రామ రాజ్యాలను ఏర్పాటుచేసింది. బేదఖళ్లు నిలిచిపోయాయి. వెట్టిచాకిరి రద్దు చేశారు. వడ్డీ భారాల నుంచి పేద రైతులకు విముక్తి కల్పించారు. వ్యవసాయ కార్మికుల కనీస వేతనాలు అమలు జరిపారు. ప్రజాకంటక అటవీ అధికారులను తరిమివేసి గిరిజనులను కాపాడారు. ఈ పోరాటంలో పురుషులతో సమానంగా, మహిళలు తమ ప్రాణాలొడ్డి పోరాడారు. ఈ క్రమంలోనే మహిళలకు పురుషులతో సమాన హక్కులు గ్యారెంటీ చేయబడ్డాయి. కుల,మత భేదాలను మరిచి పేదలంతా సమైక్యంగా అగ్రకుల భూస్వాముల దురహంకారంపై తిరగబడ్డారు. గ్రామరాజ్యాల్లో అందరూ సమానంగా గుర్తింపు పొందారు. ఈ పోరాట ఫలితంగానే భూమి సమస్య దేశ ఎజెండా మీదకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా భూసంస్కరణల చట్టం, కౌల్దారి రక్షణచట్టం చేయవలసి వచ్చింది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కూడా ఈ పోరాటం మార్గం సుగమం చేసింది.
హైదరాబాద్‌ సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనం కావటంతో, మరాఠీ మాట్లాడే ఐదు జిల్లాలు మహారాష్ట్రలోను, కన్నడం మాట్లాడే 3జిల్లాలు కర్ణాటకలోను విలీనం చేశారు. దీనితో మద్రాసు నుండి ఆంధ్రప్రాంతాన్ని వేరు చేయాలన్న ఉద్యమం ఊపందుకున్నది. పొట్టి శ్రీరాములు మరణానంతరం ఆంధ్రరాష్ట్రం అవతరించింది. 1892లో పుట్టిన ఆర్యసమాజ్‌ కానీ, 1927లో పుట్టిన ఇత్తెహాద్‌ ఉల్‌ ముస్లిమీన్‌ కాని, హిందూ-ముస్లిం సామాన్య ప్రజల మధ్య వైషమ్యాలు పెంచడానికి ప్రయత్నించాయి. హుమ్నాబాద్‌, గుల్బర్గా, ఉద్గిర్‌, ధూల్‌పేట వంటి ప్రాంతాల్లో మత ఘర్షణలను రెచ్చగొట్టారు. జమిందారీ దోపిడీకి, వెట్టిచాకిరీకి, నైజాం నిరంకుశ రాచరికానికి వ్యతిరేకంగా ప్రారంభమైన రైతాంగ సాయుధ పోరాటమే హిందూ, ముస్లిం పేదలను ఐక్యంగా నడిపింది.


కులమత భేదాలకు అతీతంగా పోరాట యోధులు రక్తతర్పణ చేశారు. ఇప్పుడు సమస్య విలీనమా, లేక విమోచనా అన్నది కాదు. నాటి పోరాట కర్తవ్యాలు ఇంకా పూర్తి కాలేదు. చర్చ జరగవల్సిందీ, ఉద్యమించవలసిందీ వాటి గురించే. తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవ సందర్భంగా గతాన్ని స్మరించుకునేది ఇందుకోసమే. సెప్టెంబర్‌ 17 విలీనం నిజమే, విమోచనా నిజమే. హైదరాబాద్‌ సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనం అయినది ఒక చారిత్రక వాస్తవం. నైజాం రాచరిక పాలన నుంచి విముక్తి పొంది ప్రజాస్వామ్య పాలనలో అడుగుపెట్టిందీ నిజమే. ముస్లిం రాజు నుండి హిందువులకు విమోచన కలిగించినట్లు చిత్రీకరిస్తూ మతం రంగు పులిమే వారు కొందరైతే, ప్రత్యేక తెలంగాణా వాదానికి ముడిపెట్టే వారు మరికొందరు. ఈ రెండు వాదనలు చరిత్రకు వక్ర భాష్యాలే.


ఇక విద్రోహ దినం అనటంలో అర్థంలేదు. నిజాం నిరంకుశ రాచరికం కూలిపోవడాన్ని సర్వత్రా హర్షించారు. తర్వాత కాలంలో కొందరు, ఈ సాయుధ పోరాటాన్ని 1951 అక్టోబరు తర్వాత కూడా కొనసాగించి వుండాల్సిందనే వాదనను ముందుకు తెచ్చారు. ఇక్కడి నుండి దేశం మొత్తాన్ని పెట్టుబడిదారీ, భూస్వామ్య పాలన నుండే విముక్తి చేయగలిగివుండే వారమని వీరి వాదన. కానీ వాస్తవ పరిస్థితులు, దేశంలో ప్రజలు అందుకు సిద్ధంగా లేరన్న వాస్తవం వీరికి ఆరు దశాబ్దాలు గడిచినా అర్థ్ధం కాలేదు. 1948లో కలకత్తాలో జరిగిన కమ్యూనిస్టు పార్టీ తీర్మానం, భారతదేశానికింకా స్వాతంత్య్రం రాలేదనే అంచనా ప్రకటించింది. అది కూడా సరైంది కాదని త్వరలోనే తేలిపోయింది. తెలంగాణా ప్రాంతంలో ఒకరిద్దరు నాయకులు, ఆనాటి హైదరాబాద్‌ స్టేట్‌ ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేయొద్దని ప్రకటించటంతో, వారి మీద కమ్యూనిస్టు పార్టీ విశాలాంధ్ర కమిటీి చర్య తీసుకున్నది. ఈ ఘటనలను కూడా, ఇప్పుడు కొందరు వక్రీకరించి తప్పుడు భాష్యం చెబుతున్నారు.


ఈ పోరాటం ఎజెండా పైకి తెచ్చిన భూమి సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. కేంద్రం, కౌల్దారి చట్టం గురించి గాని, భూసంస్కరణ చట్టం గురించి గాని ముందుగానే ఊదరగొట్టి భూస్వాములు జాగ్రత్త పడడానికి తోడ్పడింది. కాపాడుకోగలిగినంత భూమిని భూస్వాములు అడ్డదారుల్లో సర్దుకున్న తరువాత కూడా 16,63,881 ఎకరాలు మిగులు భూమి ఉన్నట్లు డిక్లేరేషన్‌ ఇవ్వక తప్పలేదు. అయినా, నేటికీ అందులో మూడో వంతు కూడా పేదలకు పంచలేదు. ఇది కాక 17,35,000 ఎకరాల సాగుకు లాయకైన పడావు భూమి ఉన్నది. 16,90,000 ఎకరాల పచ్చిక బయళ్ళు, 6,92,500 ఎకరాల ఇతర భూములు కూడా పంచేందుకు అవకాశం ఉన్నదని కూడా తేలింది. ఇది కాక ఫారెస్టు, రెవెన్యూ శాఖల మధ్య వివాదాల్లో ఉన్న మరో 75 లక్షల ఎకరాల భూమి, మరో 3,75,000 ఎకరాల దేవాదాయ భూమి కూడ పంచేందుకు అవకాశం ఉన్నది. అయినా ప్రభుత్వం ఈ పని చేయడానికి సిద్ధ్దంగా లేదు. గత ఐదారు సంవత్సరాలలో పంచినట్లు చెప్పుకుంటున్న రాళ్ళురప్పల భూమి లెక్కిస్తే కూడా సుమారు 7లక్షల ఎకరాలకు మించలేదు. అది కూడా కాగితాలకే పరిమితమైంది. రాష్ట్ర ప్రభుత్వమే నియమించిన కోనేరు రంగారావు కమిటీ కూడా రాష్ట్రంలో భూమిలేని పేదలందరికీి భూమి పంచవచ్చునని తేల్చి చెప్పింది. రాష్ట్రంలో భూమిలేని వ్యవసాయ కూలీల సంఖ్య 1991లో ఒక కోటి 10లక్షలు ఉండగా, ఇపుడది సుమారు 2కోట్లకు చేరుకున్నది. అటవీ హక్కుల చట్ట ప్రకారం కూడా గిరిజనులకు, తరతరాలుగా సాగుచేసుకుంటున్న నిరుపేదలకు పంచదగిన భూమి 30లక్షల ఎకరాలు ఉన్నది. ఇందులో 80శాతం తెలంగాణలోనే ఉన్నది. ఇప్పటికీ ప్రభుత్వం గుర్తించింది 3లక్షల ఎకరాలు మాత్రమే. కౌలు సమస్య పరిష్కారం కాలేదు. వీటి పర్యవసానంగానే 2007లో, రాష్ట్రంలో మరోసారి 7మాసాల పాటు మహత్తర భూ పోరాటం సాగింది. ఇప్పటికీ కులవివక్ష అంతం కాలేదు. గిరిజనుల, వెనుకబడిన తరగతుల, మహిళల సామాజిక సమస్యలు పరిష్కారం కాలేదు. మిగిలి ఉన్న ఈ చారిత్రక కర్తవ్యం గురించి చర్చ జరగాలి. ప్రజల్లో చైతన్యం పెంచి, వారిని కర్తవ్యోన్ముఖులను చేయాలి.
Note:Article from prajasakti paper written  by Veeraiaha(CPM Party State Scerterail member)
Posted by Srinivas NEELA at 4:37 AM No comments:

Friday, September 10, 2010

BIRTH DAY CALUCULATOR

Hi Friends ,

Yesterday i read one article so iam sharing with you
Just try this for caluclating your Birth Date 

4 x Ur Birth Date

+ 13

x 25

- 200

+ Month u r born

x 2

- 40

x 50

+ last 2 digits of the Year u born

- 10500 = ??*
*


You get the Answer "??" = "Your Birth Date (DDMMYY)" 

I think this will intrests you..................
Posted by Srinivas NEELA at 10:52 AM No comments:
Newer Posts Older Posts Home
Subscribe to: Posts (Atom)

About Me

My photo
Srinivas NEELA
Jangaon,Warangal, Telangana, India
I'm from INDIA, now I live in Paris,France, since I'm studying in ISEP. This blog is dedicated to my passion for Communism and most of the articles is about presents world And article sources are from prajasakti editorials
View my complete profile

Blog Archive

  • ▼  2014 (1)
    • ▼  January (1)
      •  అమెరికా - అణు ఒప్పందం - క్రయోజనిక్ ఇంజన్
  • ►  2013 (3)
    • ►  July (1)
    • ►  April (1)
    • ►  March (1)
  • ►  2012 (2)
    • ►  April (1)
    • ►  February (1)
  • ►  2011 (15)
    • ►  November (1)
    • ►  September (1)
    • ►  August (6)
    • ►  July (3)
    • ►  April (2)
    • ►  March (1)
    • ►  February (1)
  • ►  2010 (16)
    • ►  November (1)
    • ►  October (3)
    • ►  September (4)
    • ►  August (1)
    • ►  June (1)
    • ►  May (2)
    • ►  March (1)
    • ►  February (2)
    • ►  January (1)
  • ►  2009 (11)
    • ►  October (1)
    • ►  September (2)
    • ►  August (2)
    • ►  July (4)
    • ►  June (2)

My UpDates

  • http://neelassrinivas.blogspot.com/

Total Pageviews

Followers

Picture Window theme. Theme images by -ASI-. Powered by Blogger.