Some Quotes

"I will not say I failed 1000 imes,I will say that I discovered there are 1000 ways that can cause failure.......... Thomas Edison" "Believing everybody is dangerous;Believing nobody is very dangerous.......Lincon" "If you start judging people you will be having no time to love them....MOTHER TERESA"

Tuesday, August 9, 2011

స్కాములోరి సామ్రాజ్యాలు




స్వాములమని ఇంకా మాట్లాడితే సాక్షాత్‌ భగవత్‌ స్వరూపులమని తమకు తామే ముద్ర వేసుకుని పూజా పీఠాలధిష్టిస్తున్నారు. సొంత సామ్రాజ్యాలు సృష్టించుకుంటున్నారు. అమాయకుల నమ్మకాలతో ఆటలాడుకుంటున్న ఇలాంటి ఆషాడభూతుల అసలుసిసలు అవతారాలు ఒక్కొక్కటే బట్టబయలవుతున్నాయి. నిత్యానందుని అత్యానంద రహస్యాలు ఆమూలాగ్రం వెల్లడై అతగాడు అత్తగారింటిని సందర్శించవలసిన గతి పట్టింది. వచ్చాక మళ్లీ భక్తాభినేత్రి రంజితతో కలసి రసవత్తర గురు పూర్ణిమ దృశ్యంలో దర్శనమివ్వడం వేరే సంగతి. అంతకు ముందే కల్కి భగవానుని కళంకిత గాధలు వెలుగు చూశాయి. అంతు తెలియని మానసిక స్థితిలో అపసవ్య అవస్థలో అమాయకులెందరో ఆ సాలెగూడులో చిక్కిన ఉదంతాలు టీవీలలో ప్రసారమయ్యాయి. వీటన్నిటినీ మించి బాబాలకు బాబాగా దేవేంద్ర వైభవంలో మునిగితేలిన పుట్టపర్తి సాయిబాబా జబ్బుపట్టి ఆస్పత్రి పాలవడం, ఆశ్రమంలోని అపార సంపదలు తరలిపోవడంపైన భక్త జనాలే గగ్గోలు పెట్టారు గాని ఏలిన వారు వేలు కదల్చలేదు. బాబా అవసానదశ నుంచి అంత్యక్రియల వరకూ కూడా ఆ విచారం కన్నా వివాదమే ప్రధానమైపోయింది. బయటివారి సంగతి అటుంచి బాబా బంధువర్గాలు కూడా గగ్గోలు పెడుతుంటే సర్కారు వారు మాత్రం ఆఖరు వరకూ మీన మేషాలు లెక్కించి అంతా అయిపోయాక రంగంలోకి దిగామనిపించారు. అక్కడ గూడుపుఠానీ జరుగుతుందని భక్తులు కూడా వాపోక తప్పలేదు. భక్తి కొద్దీ వారు ఇదంతా బాబాకు సంబంధం లేదని అనుకోవచ్చు. అంతటి వ్యక్తి ఆంతరంగికులను అమాయకంగా ఎంచుకుంటాడా అని ఆలోచించలేకపోవచ్చు. కాని అదే అసలైన ప్రశ్న. ఏతావాతా తేలేదొక్కటే! స్వీయ సామ్రాజ్యాలను తలపించే స్వామీజీల ఆశ్రమాలు అనేక రకాల అవాంఛనీయ శక్తులకు, అవినీతిపరులకు ఆశ్రయాలుగా మారుతున్నాయి. చెదురుమదురుగా గాక అన్ని చోట్లా అందరి విషయంలో ఇదే తంతు. స్వాములకూ స్కాములకూ అవినాభావ సంబంధం ఎవరూ కాదనలేని సత్యం. ఒకప్పుడు హేతువాదులు లేదా నాస్తికులు, కాదంటే కమ్యూనిస్టులు మాత్రమే చెప్పే విషయాలు ఇప్పుడు మీడియాలో రోజూ పుంఖానుపుంఖాలుగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సదరు స్వాముల స్కాముల లీలా విలాసాలు మచ్చుకు కొన్ని...
70, 80 ఏళ్ల కిందటి వరకూ ఆది శంకరాచార్యులు స్థాపించిన పీఠాల అధిపతులూ, రామకృష్ణమఠాలు నిర్వహించే స్వాములు లాంటి కొద్దిమంది ధర్మ ప్రచారకులుండేవారు. వారు కూడా దైవభక్తినీ, ధర్మాచరణను మాత్రమే బోధించేవారు. కానీ ఈనాడు అనేక పీఠాలూ మఠాలే కాదు, అనేకమంది కలియుగ దేవుళ్లు అవతారమెత్తి ధార్మిక జీవనాన్ని శాసిస్తుండడం చాలా ఆశ్చర్యకరమైన పరిణామం. విచిత్రమేంటంటే 12,96,000 సంవత్సరాల కాలపరిమితి గల త్రేతాయుగంలో రామావతారమొక్కటే ధరించినట్లుగా పేర్కొనబడింది. పరశురాముడు కూడా శ్రీరాముడు జన్మించిన తర్వాత తన అవతార అవసరం తీరిందంటాడని రామాయణంలో చెప్పబడింది. 8,64,000 సంవత్సరాల కాల పరిమితిగల ద్వాపరయుగంలో కృష్ణావతారమొక్కటే చెప్పబడింది. కలియుగంలో కూడా ఐదు వేల సంవత్సరాలలో ఒక్క దేవుడూ అవతరించలేదు కానీ గత 150 ఏళ్లలో అనేక దేవుళ్లు జన్మించారనీ, వాళ్లు భక్తులకు మోక్షసామ్రాజ్యాన్ని కాక, భక్తుల క్షణిక బాధలూ, తాత్కాలిక సమస్యలూ తీర్చారనీ ప్రచారం జరుగుతుండడం ఈ శతాబ్ది ప్రత్యేకతగా గుర్తింపు పొందుతోంది.
కోవూరు నుంచి జెవివి వరకూ

70 లలో అబ్రహాం టి.కోవూరు అనే శ్రీలంక హేతువాద డాక్టరు సత్యసాయిబాబాను తన ముందు మహిమలు నిరూపించవలసిందిగా సవాలు చేశాడు. కాని బాబా స్పందించలేదు. ప్రభుత్వాలూ ప్రశ్నించలేదు. క్రమేణా టీవీ మీడియా వచ్చిన తర్వాత బాబా మహిమలు మానేసి దాన ధర్మాలు మొదలెట్టారు. అది కూడా ప్రజా ధనమే మరి. ఇటీవల చాలా కాలంగా జన విజ్ఞాన వేదిక కార్యకర్తలు మహిమల బండారం బయటపెడుతున్నారు. బాబాలు, స్వాములు చేసేవన్నీ మరింత బాగా చేసి చూపిస్తూ ఇదంతా హస్త లాఘవమేనని నిరూపిస్తున్నారు. దురదృష్టం ఏమంటే వీరికి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేదు.
పరంపర.. తామర తంపర
వీరిలో షిర్దీసాయిబాబా వారసులుగా చెప్పుకుంటున్న పుట్టపర్తి సత్య సాయిబాబా, పెనుగొండ కాళేశ్వర్‌, కర్నూలు బాలసాయి బాబా మరియు దత్తాత్రేయుని అపరావతారంగా చెప్పబడుతున్న గణపతి సచ్చిదానంద స్వామి, విష్ణుమూర్తి పదవ అవతారంగా తనను తాను ప్రకటించుకున్న కల్కి భగవాన్‌ ఉరఫ్‌ విజయకుమార్‌, కృష్ణుని అవతారంగా చెప్పుకుంటున్న స్వామి సుందర చైతన్య, ప్రకాశం జిల్లా రామదూత స్వామి... ఇలా అనేకమంది ''భగవత్‌ అవతారమూర్తులు'' మన రాష్ట్రంలోనే అవతరించడం తీవ్రంగా ఆలోచించవలసిన విషయం. వీరందరూ అతి సామాన్య, పేద కుటుంబాల్లో జన్మించారు. కానీ ప్రస్తుతం వేల కోట్ల రూపాయల ఆస్తులతో సొంత సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు. హత్యలు, మానభంగాలు, కబ్జాలు ఇలా అనేక నేరారోపణలు వీరిమీదున్నాయి. చాలావరకు నిరూపితమయ్యాయి కూడా. కొన్ని నేరాలను తమ పరపతితో విచారణ స్థాయిలోనే తొక్కేయగలిగారు. వీరు భగవంతుని అవతారమూర్తులని పిలుద్దామా? అంటే కొన్ని దశాబ్దాల కాలంలోనే ఈ విశాల భూగ్రహంపై ఇంతమంది అవసరం ఏం వచ్చిందన్న ప్రశ్న ఉదయిస్తుంది. అదీగాక వీరందరూ జీవించి ఉన్న సమయంలోనే ధర్మ సంస్థాపన జరగకపోగా నేరాల తీవ్రత, నేరస్థుల చిట్టా రోజురోజుకీ పెరుగుతోంది. మరి వీరి అవతార ప్రయోజనమేంటి? పోనీ స్వాములు, యోగులు, సన్యాసులు అనుకుందామా అంటే డబ్బు, బంగారం, ఆస్తులున్న సన్యాసులను చూస్తేనే మహా పాపమనీ, ఆ పాపం పోగొట్టుకోడానికి కట్టుకున్న బట్టలతోనే స్నానం చేయాలనీ ''యాజ్ఞవల్క్య స్మృతి'' వంటి స్మృతులు ఘోషిస్తున్నాయి. కాబట్టి వీరు సన్యాసులూ కారు. వీరి ''లీల''లను కొన్నింటిని పరిశీలిద్దాం.


కర్నూలు బాలసాయిబాబా ఈయన మొదట్లో రికార్డింగ్‌ డ్యాన్సర్‌. బాలసాయిగా అవతారమెత్తాక ఈయన ఆస్తి వందల కోట్లలోకి చేరింది. ఈయన నడిపే స్కూళ్లలో ఉచితంగా చదువు చెప్తారని ప్రచారం. కానీ పిల్లల నుండి 40 వేల రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తారు. హైదరాబాద్‌లోని భూ ఆక్రమణ కోర్టు ఇతన్ని భూ కబ్జాదారునిగా నిర్థారించింది. చెక్‌ పవర్‌ తన దగ్గరే అట్టిపెట్టుకున్న ''భగవాన్‌'' ఈయన.

 కాళేశ్వర్400 గదులతో కూడిన అన్ని వసతులూ ఉన్న బ్రహ్మాండమైన ఆశ్రమం ఈయనది. ఈ ఆశ్రమంలోని సిబ్బంది జీతాల ఖర్చే నెలకు పది లక్షల రూపాయలుంది. ఒక భక్తురాలి పట్ల అమర్యాదగా ప్రవర్తించి చెప్పుదెబ్బలు తిన్నాడు. 2005లో పెళ్లి చేసుకున్నాడు. ఆస్తుల విలువ కొన్ని కోట్ల రూపాయలు

 సుందర చైతన్యానంద స్వామి స్వగ్రామం నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం. చిన్నతనంలో కనీసం సైకిల్‌ కూడా లేని పరిస్థితి నుండి ఈనాడు అనేక ఎ.సి కార్లున్న పరిస్థితికి ఎదిగిపోయాడు. కబ్జాల్లో చెయ్యి తిరిగినవాడు. దళితుల గుడిసెలను కూడా వదిలిపెట్టని కబ్జావీరుడు. ధవళేశ్వరంలో ఆ కబ్జాను అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన అఖిల పక్ష కమిటీ కార్యకర్తలను గూండాలతో కొట్టించే ప్రయత్నం చేశాడు. ఉపన్యాసాలు చేసేటప్పుడు నెమలి పింఛం పెట్టుకుని భక్తులు తనని శ్రీకృష్ణావతారుడుగా భావించాలంటాడు. భక్తులతో ఒకసారి బంగారు కిరీటం పెట్టించుకుని, బంగారు మురళిని బహుమతిగా అందుకున్నాడు. అయితే ద్వాపరయుగ కృష్ణుడికీ, సుందర చైతన్యానందుడికీ గల ప్రధానమైన తేడా ఏమిటంటే శ్రీకృష్ణుడ్ని ఎంత బంగారంతోనైనా సత్యభామ తూచలేకపోయింది. ఒకే ఒక్క తులసిదళంతో అది సాధ్యమైంది. కానీ మన అపర శ్రీకృష్ణుడు భక్తులకు ఒక్కో తులసిదళం ఇచ్చి వెయ్యి రూపాయలు వసూలు చేశాడు. ఇలా కొన్ని వేల తులసిదళాలు భక్తులకిచ్చి కొన్ని లక్షల రూపాయలు ఆర్జించాడు

 గణపతి సచ్చిదానంద ఈయన పాద దర్శనానికి వెయ్యి రూపాయలు, పాద పూజకు కనీసం 20 వేలు, గృహ ప్రవేశానికి వస్తే మినిమమ్‌ 50 వేలు, అమెరికాలోనైతే పాద పూజకు వేల డాలర్లు వసూలు చేశాడు. ఒక దశలో తన పాదుకలను పంపి ఫీజు వసూలు చేశాడు. ఈయన ప్రస్తుత ఆస్తి వెయ్యికోట్లు.



కల్కి భగవాన్‌ ఉరఫ్‌ విజయకుమార్‌ ఈయన తనను తాను విష్ణుమూర్తి పదవ అవతారమైన కల్కిగా ప్రకటించుకున్నాడు. ఈయన దర్శనానికి ఐదు వందల రూపాయలు, దీక్షకు 50 వేలు, పాదం చూస్తే వెయ్యి రూపాయలు, పాద పూజకు ఐదు వేలు, మాట్లాడేందుకు వేలకు వేలు వసూలు చేశాడు. మూలమంత్రం అంటూ ఒక మంత్రాన్ని సృష్టించి దాన్ని లాకెట్‌లో పొదిగి, ఆ లాకెట్‌ని భారతీయులకు 50 వేలు, విదేశీయులకు లక్ష రూపాయలకు అమ్మాడు. చిత్తూరు జిల్లా, వరదయ్యపాలెం మండలం, బత్తలవల్లం గ్రామంలో మూడు వందల కోట్ల రూపాయలతో గోల్డెన్‌ టెంపుల్‌ నిర్మించాడు. ప్రస్తుత ఆస్తి విలువ వేల కోట్లలో ఉంది. ఈ ఆశ్రమంలో స్వామీజీ ఇచ్చే ద్రవం తాగిన ఆశ్రమవాసులు అచేతనావస్తలో అయోమయంగా మాట్లాడుతున్న దృశ్యాలు టీవీలలో ప్రసారమై ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఈయన భూములు విపరీతంగా ఆక్రమించుకోవడంతో భూ పోరాటాలు కూడా జరిగాయి.అయితే ఇప్పటికీ దీనిపై ప్రభుత్వ చర్య శూన్యం.

రామదూత స్వామి ఈయన ఆశ్రమం నెల్లూరు ప్రకాశం మధ్య ఉంది. ఈయన భూకబ్జాదారుడని స్థానిక తహసీల్దారు కలెక్టరుకు నివేదిక పంపించాడు కూడా. అయినా నాటి కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప, నాటి డిజిపి అరవిందరావు ఈయనను దర్శించి పాదాభివందనాలు, సాష్టాంగ నమస్కారాలు చేయడం ఎవరికీ అంతుచిక్కని విషయం.
సర్కార్ల సహకారం!
అనేక అక్రమాలు వెలుగు చూస్తున్నా ఆశ్రమాల అధిపతులు శిష్య పరివారంతో సహా వైభోగంలో తులతూగడానికి ప్రభుత్వాధినేతలు పాలక వర్గ ప్రముఖుల కుమ్మక్కు ప్రధాన కారణం. చిన్నాచితకా నేరాలకే అమితమైన ప్రచారం ఇచ్చే ప్రభుత్వం, పోలీసులు ఈ బాబాలు, స్వాముల సామ్రాజ్యాల జోలికి పోరు. సాయిబాబా ఆశ్రమంలో అయిదు హత్యలు జరిగినా దానిపై అధికారిక దర్యాప్తు గాని విచారణ గాని లేకపోగా రాజ్యాధినేతగా వున్న శంకర్‌ దయాళ్‌ శర్మ అది చిన్న విషయమని తేల్చేశారు! బాబా ఆరోగ్యపరిస్థితిపై అనేక ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి తటపటాయించింది. వెళ్లిన మంత్రులు ట్రస్టు నిర్వాహకులకే వంత పాడారు తప్ప తమ వంతు బాధ్యత నిర్వహించలేదు. ఇప్పుడు అనివార్యంగా కొన్ని చర్యలు తీసుకుంటున్నా జరగాల్సిన నష్టం జరిగే పోయింది. లోగడ నగ సన్యాసిని మంగమ్మవ్వ ఓ హత్య కేసులో జైలు పాలైంది. తమిళనాడులో ప్రేమానంద అనే స్వామి కూడా అంతే. అమెరికా వెళ్లిన స్వామి రజనీష్‌ (ఓషో) అక్కడి పోలీసుల దాడి తట్టుకోలేక ఇక్కడకు పరుగెత్తుకొచ్చాడు. నీళ్ల స్వాములు, నిమ్మకాయల స్వాములు, వుమ్మేసే స్వాములు... ఎందరెందరో జన విజ్ఞాన వేదిక ధాటికి చిత్తయిపోయారు. ఈ బడా స్వాములు అలా చిక్కకుండా తప్పించుకోవడానికి కారణం ప్రభుత్వ అండదండలే. పాలక వర్గ ప్రముఖులు పనులు జరిపించుకోవడానికి ఈ ఆశ్రమాలను ఉపయోగించుకుంటారు. అక్కడ చట్టాలు పని చేయకుండా అడ్డుకుంటారు. ఇప్పుడు దేశంలో నల్లడబ్బు గురించి ఇంత చర్చ జరుగుతున్నది గాని బాబా ఆశ్రమంలో గుట్టలు పడిన సంపద ఎవరిదనే దానిపై మాత్రం సమాచారం లేదు. దేశ విదేశీయులు ఇష్టానుసారం సంచరించే అలాంటి చోట సంఘ వ్యతిరేక శక్తులు తలదాచుకునే అవకాశాలను ఎవరూ తోసి పుచ్చలేరు. ఆధ్యాత్మికంగా ప్రతిష్టాత్మకమైన కంచి ఆశ్రమ స్వామి జయేంద్ర సరస్వతి అరెస్టు సందర్భంలో వినవచ్చిన కథనాలు కంపరం పుట్టించాయి. ఏదో కారణంతో జయలలిత ప్రభుత్వం నాడు అంత కఠినంగా వ్యవహరించింది గాని అది అరుదైన ఘటన. ఆమెకు స్వయంగా చాలా మూఢత్వం వుంది. అవినీతి వ్యవహారాలతో నిన్న గద్దె దిగిన యెడ్యూరప్ప ముందు స్వామీజీనే సందర్శించారు. నెల్లూరు జిల్లాలోని రామదూత ఆశ్రమానికి కూడా ఆయన తరచూ వస్తుంటారు. తులాభార చక్రవర్తిగా పేరొందిన మన మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కూడా బాబాలు స్వాముల చుట్టూ తిరుగుతుండే వారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, పోలీసులు, శాస్త్రజ్ఞులు ఆఖరుకు అత్యున్నత నేతలుగా వుండాల్సిన ప్రధాన మంత్రులు రాష్ట్రపతులు కూడా రాజ్యాంగ విలువలను కాలదన్ని బాబాల ముందు మోకరిల్లుతుంటే సామాన్య ప్రజలు వారి చుట్టూ చేరడంలో ఆశ్చర్యం ఏముంటుంది? ప్రజల చైతన్యాన్ని మొద్దుబార్చి పోరాటాల్లోకి రాకుండా చేసేందుకు కర్మ సిద్ధాంతం లాగే బాబాలు కూడా బాగా ఉపయోగపడతారు గనకే పాలకులు వారిని నెత్తిన పెట్టుకుంటారు. ఆపైన తమ అక్రమాలకూ ఉపయోగించుకుంటారు. ప్రశ్నించేవారిని ప్రోత్సహించకపోగా అణగదొక్కుతారు. అంతర్జాతీయ శక్తులు కూడా ఆ విషయంలో వెనకబడవు. వెరసి ఇదొక విష వలయం అంటే తప్పు కాదు.
పుట్టపర్తి సాయిబాబా తనకు తాను భగవంతునిగా ప్రకటించుకున్న ఈ బాబా చనిపోయిన తర్వాత, ఈయన నెలకొల్పిన ట్రస్టు సభ్యులు, బాబా డబ్బునుగానీ, బంగారాన్ని గానీ ముట్టుకునేవారు కాదనీ, విరాళాలన్నీ చెక్కుల రూపంలో ఉంటాయనీ, డబ్బు స్వీకరిస్తే రసీదు ఇచ్చేవారనీ ప్రకటించారు. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయన బెడ్‌రూంలో దాదాపు క్వింటాల్‌ (వంద కేజీలు) బంగారం, కోట్ల రూపాయల నగదు కనిపించింది. ట్రస్ట్‌ సభ్యులు రసీదులు లేని, కోట్లాది రూపాయల బంగారం, నగదు అక్కడ ఎందుకు ఉందనే ప్రశ్నకు జవాబు చెప్ప లేదు. మీడియా కూడా సత్యసాయి నివాస గృహం నుండి అక్రమంగా తరలిపోతున్న ధనాన్ని ఎవరు బయటికి పంపారనే విషయం పైనే కేంద్రీకరించింది కానీ, అసలు సాయి నివాసంలో ఎందుకుందనే విషయంపై దృష్టి సారించలేదు.
అంతేకాదు, రిజర్వ్‌ బ్యాంకు సూత్రాల ప్రకారం ప్రైవేటు వ్యక్తుల వద్ద బంగారం ఎక్కడ్నుండి వచ్చిందనే వివరాలు, రసీదులు లేకుండా కిలోలు, క్వింటాళ్ల లెక్కన బంగారం ఉండకూడదు. కానీ వంద కేజీల బరువున్న సుందర చైతన్యానంద బంగారంతో తులాభారం తూగినా, పుట్టపర్తి సత్యసాయిబాబా వద్ద దాదాపు క్వింటాల్‌ బంగారం లెక్కల్లో లేనిది ఉన్నా రిజర్వ్‌ బ్యాంకు కానీ, ప్రభుత్వం కానీ ఎంక్వయిరీ చేయించిన దాఖలాలు లేవు. అంటే ఈ స్వాములూ, బాబాల ఆశ్రమాలు వారి స్వంత సామ్రాజ్యాలా? వారి నెవరూ సోదా చేయకూడదా?
ఈ భగవాన్‌లు, స్వాములలో కొందరు తమ భారీ నిల్వ ధనంలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాల కోసం వెచ్చిస్తున్నారు. కాబట్టి వారిని గౌరవించాలనీ, కీర్తించాలనీ కొందరు అంటుంటారు. ఇదే పరిస్థితి బాబాలు మన అమాయక భక్తుల విషయంలోనూ జరుగుతోంది. కబ్జాదారులు, మోసగాళ్లు.... బాబాలు, స్వాముల అవతారాలు ఎందుకు ఎత్తుతున్నారు? అన్న ప్రశ్నకు ఒక టీవీ చానల్‌ ప్రసారంలో ఒకరు ఇచ్చిన సమాధానం మీ ముందుంచుతాను.
''ఒక కొలనులో కొన్ని చేపలుండేవి. వాటిని తినడానికి ఓ కొంగ వచ్చింది. రోజల్లా ఆ నీళ్లల్లో ప్రయత్నించినా ఒక్క చేపా దానికి దొరకలేదు. అప్పుడది సమీపంలో వున్న తన గురువుగారి దగ్గరకు వెళ్లి తనకు చేపలు దొరికే మార్గం చెప్పమని అడిగింది. ఆ గురువుగారు నీవు రేపు కాషాయ వస్త్రాలు ధరించి వెళ్లు. నీ దగ్గరకే చేపలు వస్తాయి'' అని చెప్పారు. గురువు గారు చెప్పినట్టే చేసి కొంగ కడుపు నిండా చేపలను ఆరగించిందట. ఇదీ కాషాయ వస్త్రాల రహస్యం. అందుకే నిపుణులైన మోసగాళ్లు కాషాయ వస్త్రాలు ధరించి ప్రజల ముందుకు వస్తున్నారు. అమాయకులైన ప్రజలు వారి వలలో పడి తమ సర్వస్వం సమర్పించుకుంటున్నారు.
ఈ సందర్భంలో ఒక విషయం స్పష్టం చేయాలి. కాషాయం ధరించిన వాళ్లంతా మోసకారులు కాదు. ఎవరైతే సామాన్యమైన మెజీషియన్లు చేసే మేజిక్కులను తాము కూడా చేసి అవి తమ మహిమలని ప్రకటించుకుంటారో, ఎవరైతే దర్శనానికి కూడా రేట్లు నిర్ణయిస్తారో, ఎవరైతే వందల..వేల కోట్లలో ఆస్తులు సంపాదించి సన్యాస ధర్మాన్ని అతిక్రమిస్తారో, ఎవరైతే తమ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి తాము చనిపోయే వరకు చెక్‌ పవర్‌ కూడా వదులుకోరో వారిని మోసగాళ్లగా ప్రజలు గుర్తించాలి.
మూఢత్వమే మార్కెట్‌!
ఆధునిక యుగంలో కూడా ఎందుకీ మూఢత్వం? చదువుకున్న వారు కూడా మోసకారి స్వాముల వెంట ఎందుకు పడుతున్నారు? వంటి ప్రశ్నలు తరచూ ఎదురవుతుంటాయి. విద్యలో విజ్ఞానాన్ని రంగరించే బదులు దేనికదిగా చెబుతూ మూఢత్వాన్ని ప్రోత్సహించే విధానాలు ఇందుకు ముఖ్య కారణం. అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మన్‌ ప్రయోగించే ఉపగ్రహ నమూనాను దైవ దర్శనానికి తీసుకువెళ్లడం నిజానికి సైన్సుకే గాక రాజ్యాంగ లౌకిక స్వభావానికి కూడా విరుద్ధం. అయినా అవన్నీ షరా మామూలుగా జరిగిపోతున్నాయి. పాలకులకు ప్రజల మూఢత్వం కావాలి తప్ప చైతన్యం కాదు.దాన్ని పెంచేందుకే సహకరిస్తారు తప్ప తగ్గించేందుకు సిద్ధపడరు. ఇప్పుడు నడుస్తున్న ప్రపంచీకరణ వాస్తవంలో మార్కెట్‌తత్వంతో పాటు మత ఛాందసాన్ని కూడా ఎగదోస్తుంది. అంతర్జాతీయ సామ్రాజ్యవాదాన్ని గురించి తెలుసుకోకుండా స్థానికత పేరిట అంధ విశ్వాసాలలో జనం కూరుకుపోవడం వారికి చాలా అవసరం. అలాగే వారి మార్కెట్‌ సూత్రాలకు ఏదీ అతీతం కాదు గనక మూఢత్వాన్ని భక్తి విశ్వాసాలను కూడా మార్కెట్‌ సరుకుగా మార్చుకుని సొమ్ము చేసుకుంటారు. బాబాలు తమ ప్రచారం తామే చేసుకునే రోజుల నుంచి ఇప్పుడు మెగా ఈవెంట్స్‌గా జరిపే స్థితికి వచ్చారంటే అదే కారణం. ఒకప్పుడు హరేరామ హరే కృష్ణ ఉద్యమం మన దేశంలో గాక పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి అయిన సంగతి మర్చిపోరాదు. వినోదం పొందడానికి విలాసంగా గడపడానికి కూడా వారికి ఈ ఆశ్రమాలు ఉపయోగపడతాయి. విదేశీయులు వస్తే అది అదనపు ఆకర్షణగా భావించి మన దేశంలోని అమాయక ప్రజలు కూడా ఎగబడతారు.
చిన్న చిన్న స్వాముల నుంచి వేలకోట్ల రూపాయలార్జించిన బడాస్వాముల వరకూ, వీరికి భక్తులెందుకు ఏర్పడుతున్నారు? కొంత మందికి మానవాతీత శక్తులుంటాయనే కథలను పసితనం నుంచి అమ్మలు, బామ్మలు, పాఠ్యపుస్తకాలు నూరిపోయడమే స్వాములను మానవాతీత వ్యక్తులుగా నమ్మడానికి ప్రధాన కారణం. పాఠ్యపుస్తకాలలో శాస్త్రీయ అవగాహనను పెంచే అంశాలే వుండడం లేదు. పైగా ఉన్నత విద్యావ్యవస్థలో జ్యోతిషం, వాస్తు వంటి అశాస్త్రీయ అంశాలు కోర్సులుగా ప్రవేశ పెట్టబడ్డాయి. దానితో ప్రజలలో అశాస్త్రీయ ఆలోచనా విధానం బాగా ముదిరిపోయింది. ''ఈశాన్య మూలన బరువు వుంటే ధన నాశం'' అని ఒక వాస్తువాది అంటే నమ్మడమే గానీ ఈశాన్య మూలన వుండే కర్రకు, మన ఇంట్లో ధనాన్ని నాశనం చేసే శక్తి ఎలా వస్తుంది? అని హేతుబద్ధంగా ఆలోచించే శక్తి నశించింది. అందుకే నిన్నటి దాకా బిందెల చిల్లులకు మాట్లు వేసుకుని బతికిన వ్యక్తి నేడు నీళ్ల స్వామి అవతారమెత్తి, ప్రజల రోగాలు పోగొట్టే శక్తిగలవాడంటే నమ్మి విద్యాధికులతో సహా నీళ్ల చెంబులతో అతని ముందు క్యూ కట్టారు. నిన్న సినిమా హాళ్ల ముందు బ్లాకులో టికెట్లు అమ్మిన వ్యక్తి నేడు బాబా అవతారమెత్తి ఆశీర్వదిస్తున్నాడంటే శిరస్సు వంచారు. కాబట్టి ఈనాడు నలుగురైదుగురు బాబాలు, స్వాముల బండారం బయటపెడితే, వారి సొంత సామ్రాజ్యాల పెరుగుదల ఆగిపోతుంది. అంతే. రేపు మరో నలుగురైదుగురు స్వాములు 'అవతరిస్తారు'. ప్రజలు వారిని అనుసరిస్తారు. వీరి 'ప్రమాదం' నుంచి ప్రజలు బయటపడాలంటే విద్యార్థి దశ నుంచే పిల్లల మనస్సులలో శాస్త్రీయ అవగాహనా బీజాలు నాటాలి. ప్రకృతి సూత్రాలకతీతంగా ఎవ్వరూ ఏ పనీ చేయలేరని వివరించాలి. అశాస్త్రీయ అంశాల బోధనను నిలిపివేయాలి.
ఒక మోసకారి బాబాదో, కబ్జాస్వామిదో బండారాన్ని సైన్సు ఉద్యమకారులు బయటపెట్టినప్పుడు, ఆ ప్రయత్నం హిందూ మతం మీద దాడిగా భావించుకొని కొందరు ఆవేశపూరితులౌతున్నారు. సైన్సుఉద్యమకారులు హిందూ మతం మీదే దాడిచేస్తారనీ, ఇతర మతాలకు చెందిన మోసగాళ్ల జోలికి పోరనీ ఆరోపిస్తున్నారు. హైదరాబాదులో ఎంతోమంది ముస్లిం మతానికి చెందిన నకిలీ బాబాలు దొరికిపోయారు. సైన్సుఉద్యమకారులు బలంగా వున్న చోట ముస్లిం, క్రిస్టియన్‌ మతాలలోని మోసగాళ్ల బండారాలను కూడా బయటపెడుతున్నారు. కింది ఉదాహరణను పరిశీలించండి.
''అమెరికాలో దైవదూతగా ప్రచారం పొందిన మావియన్‌ సెలోలార్‌ బొంబాయి, మద్రాసులలో విజయవంతంగా పర్యటనలను ముగించుకొని కలకత్తాలో అడుగుపెట్టారు. ఆయన రాకకు పత్రికలలో కనీవినీ ఎరుగని ప్రచారం లభించింది. చెవుడు, మూగతనంతో బాధపడుతున్నవారిని తక్షణం నయం చేస్తాననే వాగ్దానంతో నగరంలోని పార్క్‌ సర్కస్‌ మైదానంలో ఆయన బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆయన తన అసమాన వాక్చాతుర్యంతో వేలాదిమందిని ఆకట్టుకున్నారు. అయితే సైన్సుఉద్యమకారులు రంగప్రవేశం చేసి ఆయన బూటకాన్ని బట్టబయలుచేసే వరకే అదంతా సాగింది. సైన్సుఉద్యమకారులు అకస్మాత్తుగా వేదికపైకి ఎక్కి సెలోలార్‌ అప్పుడే నయం చేశానని చెబుతున్న ఒక వ్యక్తిని చుట్టుముట్టారు. తరచి తరచి ప్రశ్నించిన మీదట అతను అసలు చెవుడు లేదా మూగ కాదని తేలింది. దాంతో ఆగ్రహావేశులైన ప్రజలు సెలోలార్‌పై రాళ్లు రువ్వడంతో ఆయన వాటి నుంచి ఎలాగో తప్పించుకున్నారు. చివరకు రాష్ట్ర ప్రభుత్వం ఆయనను అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించి అక్కడి నుంచి పంపివేసింది.''

(లేఖా రతనాని, కవితా షెట్టి, టి.ఎన్‌.గోప కుమార్‌, సరితా రారులు ఇండియా టుడే లో వ్రాసిన వ్యాసం నుంచి)
ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి, శివసేనలు బలంగా వున్న బొంబాయిలో సెలోలార్‌ బండారం బయటపడలేదు. అసలు అక్కడ ఆ ప్రయత్నమే జరగలేదు. సైన్సుఉద్యమకారులు బలంగా వున్న కలకత్తాలో అతని బండారం బయటపెట్టబడింది. మార్క్సిస్టు ప్రభుత్వం ఆ మోసగాడిని రాష్ట్రం నుంచి బయటకు పంపేసింది. ఇదీ అసలు విషయం.
భగవత్‌ స్వరూపులను విమర్శిస్తే వారి భక్తుల మనోభావాలు గాయపడతాయని ఇటీవల కొందరు అంటున్నారు. పురాణాల ప్రకారం చూసినా భగవంతుడికేే భక్తులుంటారు. భగవత్‌ స్వరూపులను అనుసరించేవారిలో చాలా మంది అమాయకంగా మోసగాళ్లను నమ్ముతున్నారు. కాబట్టి ఆ అమాయకులను ఆత్మహత్యా సదృశ్యమైన మార్గం నుంచి తప్పించి, మోసగాళ్ల బారి నుంచి బయట పడవేయడం ప్రతి ఒక్క పౌరుని కర్తవ్యం. కాబట్టి భగవత్‌ స్వరూపుల మోసాలను, కబ్జాలను బయట పెట్టడాన్ని, వారి భక్తుల మనోభావాలను గాయపరచడం కానే కాదు. రాజ్యాంగంలో 51ఎ (హెచ్‌) అధికరణం కూడా ఆ కర్తవ్యాన్ని నిర్దేశిస్తోంది. ఇన్ని భాగోతాలు బయటపడిన తర్వాతనైనా ఈ స్వాములు, బాబాలు, భగవత్‌ స్వరూపుల మాయా సామ్రాజ్యాలను విచ్ఛిన్నం చేయడం ప్రతి ఒక్క దేశ భక్తుడి బాధ్యత. అంతకు మించి ప్రభుత్వాల బాధ్యత.


***Article From Prajasakti Daily
Written By K.L.KanthaRao  http://www.prajasakti.com/




Tuesday, August 2, 2011

గాడిద-ఏనుగు పోరు

పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణసంకటంగా మారినట్లు ప్రపంచ ధనిక దేశాల విన్యాసాలున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికలను గమనంలో ఉంచుకొని అమెరికాలోని పాలక ప్రతిపక్షాల బడ్జెట్‌కోత, దేశ రుణపరిమితిపై వేస్తున్న ఎత్తులు జిత్తులు చివరకు ప్రపంచంలో దేనికి దారితీస్తాయో తెలియని అయోమయంలోకి నెడుతున్నాయి. చిత్రమేమంటే అవసరం లేని ఆయుధాలు కొని ఐరోపాలోని పేద దేశమైన గ్రీస్‌ దివాళా తీస్తే ఆయుధాలు అమ్మి సొమ్ము చేసుకున్న అమెరికా కూడా ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడినట్లు ప్రపంచ దేశాలన్నింటికీ పొదుపు చర్యలు తీసుకోవాలని బోధించే అమెరికా ఇప్పుడు తమ అప్పు భారాన్ని తగ్గించుకొనేందుకు ఎలాంటి పొదుపు చర్యలు తీసుకోవాలో తేల్చుకోలేక కొట్టుమిట్టాడుతోంది. ఆగస్టు రెండవ తేదీలోగా ఈ సమస్యపై ఏదో ఒక పరిష్కారానికి రాని పక్షంలో ప్రభుత్వ బిల్లు చెల్లింపులు నిలిచిపోతాయి. ఈ స్థితిని చూసి యూరోపియన్లు దివాళాకు సిద్దంగా ఉన్న మా పోర్చుగల్‌కు అమెరికాకు తేడా ఏంటట అని జోకులు వేస్తున్నారు. అనేక ఇతర దేశాలపై ప్రభావం చూపుతుందన్న జ్ఞానం, బాధ్యత లేకుండా అమెరికాలోని గాడిద-ఏనుగు(రిపబ్లికన్‌-డెమోక్రటిక్‌ పార్టీల గుర్తులు) దెబ్బలాడుకుంటున్నాయని చైనా వార్తా సంస్థ సిన్హువా ఘాటుగా స్పందించింది. రుణ ఊబిలో అమెరికా కూరుకుపోతే చైనా, ఇతర దేశాలు ఎందుకు అంతగా ఆందోళనకు గురికావాలని ఎవరైనా అడగవచ్చు. ఒకనాడు ప్రపంచంపై పెత్తనం చలాయించిన బ్రిటీష్‌ పౌండు స్థానాన్ని అమెరికన్‌ డాలర్‌ ఆక్రమించింది. దాంతో డాలర్‌పే పరమాత్మ అన్నట్లు పరిస్థితి తయారైంది. ఇప్పుడా ఆ డాలరే ఆరు దశాబ్దాలలో తొలిసారిగా తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నపుడు డాలర్లను కలిగి ఉన్నవారికి,దానిపై ఆధారపడిన వారికి ఆందోళన లేకుండా ఎలా ఉంటుంది. ప్రపంచంలో అన్ని దేశాల కంటే అధికంగా చైనా ఇప్పుడు 1.16లక్షల కోట్ల డాలర్లతో అమెరికన్‌ బాండ్లు కొనుగోలు చేసింది. ఒక వేళ తన కరెన్సీ విలువను అమెరికా తగ్గించినా, బరితెగించి దివాలా ప్రకటించినా మునిగిపోయేది ప్రపంచమే. సంక్షోభ ఊబిలో మునిగి ఉన్న తమను రక్షిస్తుందని భావిస్తున్న అమెరికాయే రుణ ఊబిలో దిగబడితే తమ గతేం కానని ఐరోపా యూనియన్‌ దేశాలు బావురుమంటున్నాయి. ప్రపంచ ద్రవ్య మార్కెట్ల పట్ల తమకూ బాధ్యత ఉందన్న స్పృహతో అమెరికన్‌ రాజకీయ పక్షాలు వ్యవహరించాలని జర్మన్‌ ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించారు చేజేతులా తాను సృష్టించిన సంక్షోభానికి తాను బలౌతూ ప్రపంచాన్ని కూడా బలితీసుకుంటున్న అమెరికాలో పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. సకల రోగాలున్న రోగికి ఒకదానికి మందిస్తే మరొక రుగ్మతకు దారి తీస్తుందన్న మాదిరి పరిస్థితి తయారైంది. ఇప్పుడున్న ఉద్దీపన పథకాలు, సంక్షేమ పథకాలను కొనసాగిస్తే రుణభారం పెరుగుతుంది. దాన్ని అదుపులో ఉంచటానికి ఉద్దీపన, సంక్షేమ పథకాలకు కోతపెడితే ఇప్పుడున్న ఒకశాతం అభివృద్ధి రేటు మైనస్‌లో పడుతుంది. దీనిలో ఏది జరిగినా అధికారంలో ఉన్న బరాక్‌ ఒబామా రెండవసారి ఎన్నికయ్యే అవకాశం ఉండదు. ధనికుల రాయితీలు తగ్గించకుండా సంక్షేమ పథకాలపై కోత పెట్టించటం ద్వారా ఒబామాను ప్రజలనుంచి దూరం చేసి తాము గద్దెనెక్కాలని ప్రతిపక్ష రిపబ్లికన్లు చూస్తున్నారు. అందుకోసం రెండుపార్టీలు గత నెల రోజులుగా ఆడుతున్న చెలగాటం ప్రపంచానికి ప్రాణసంకటంగా మారుతోంది. ప్రజాప్రతినిధుల సభలో మెజారిటీ ఉన్న ప్రతిపక్ష రిపబ్లికన్లు ఆమోదించిన ఒక ఫార్ములా తీర్మానాన్ని 24 గంటలలోపే డెమొక్రాట్లు మెజారిటీ ఉన్న సెనేట్‌ తోసి పుచ్చింది. రెండు సభలలోనూ కొందరు రిపబ్లికన్లు అధికార పార్టీతో చేతులు కలిపారు.
నిజంగా అమెరికా అంత ప్రమాదంలో ఉందా? అలాంటపుడు ఇప్పటికీ అది ప్రపంచ అగ్రరాజ్యంగా ఎందుకుంటోందని కొందరికి సందేహం రావచ్చు. సంక్షోభం, సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ ఆర్థికంగా, మిలిటరీ, రాజకీయంగా అమెరికా ఇప్పటికీ అగ్రరాజ్యంగానే ఉంది. దాని ఆధిపత్యానికి ముప్పుతెచ్చే సమస్యల తీవ్రత నానాటికీ పెరుగుతోంది. అందువల్లనే గాడిద-ఏనుగు పార్టీలు రెండూ కూడా ఎంతసేపటికీ సామాన్యుల సంక్షేమ పథకాలకు ఏమేరకు కోతపెట్టాలనే దానిపై కీచులాడుకుంటున్నాయి తప్ప ఆఫ్ఘన్‌, ఇరాక్‌, లిబియాలపై దాడులు, దురాక్రమణలకు, ప్రపంచంలో ఇతర చోట్ల అగ్గి రాజేసేందుకు చేస్తున్న మిలిటరీ ఖర్చు తగ్గించటం గురించి ఏమాత్రం ఆలోచించటం లేదు. రానున్న పది సంవత్సరాలలో సంక్షేమ పథకాలకు కోత పెట్టి పొదుపు చేయాలని చూస్తున్న మొత్తం కంటే యుద్ధ ఖర్చు రెండింతలుంది. పోనీ ఆ యుద్ధం ద్వారా ఏమైనా సాధించిందా అంటే తన కంపెనీల ఆయుధాలు అమ్ముకోవటం, చవకగా ఇరాక్‌ నుంచి చమురును కొట్టేయటం తప్ప సామాన్య అమెరికన్లకు ఒరిగిందేమీ లేదు. ఉగ్రవాదంపై పోరు పేరుతో ఆప్ఘనిస్తాన్‌లో చేస్తున్న దాడులు ఉగ్రవాద ప్రమాదాన్ని మరింత పెంచాయే తప్ప తగ్గించలేకపోయాయని ఒసామా బిన్‌లాడెన్‌ హత్యానంతర పరిణామాలు కూడా స్పష్టం చేశాయి. అన్నమైతే నేమిరా సున్నమైతే నేమిరా ఈ పాడు పొట్టకు అన్నమే వేతామురా అన్నట్లు అమెరికా ఆర్థిక వ్యవస్థలో సంక్షోభాలు తలెత్తిన ప్రతిసారీ నష్టపోయింది సామాన్యులు తప్ప కార్పొరేట్‌ కంపెనీలు కాదు. తాజా సంక్షోభంలో అమెరికాలో దాదాపు 50లక్షల మంది తమ కొంపాగోడు కోల్పోయారు తప్ప వారికి అప్పులిచ్చి తిప్పలకు గురిచేసిన బ్యాంకర్లు లక్షల కోట్ల డాలర్ల ప్రభుత్వ ఉద్దీపన పథకాలతో అపరిమిత లాభాలు ఆర్జించారు. వారికి సంక్షోభం వరంలా పరిణమించింది. ఇప్పుడు కూడా అలాంటి వారే రెండుపార్టీల వెనుక చేరి సామాన్యుల నెత్తిన శఠగోపం పెట్టించేందుకు చక్రం తిప్పుతున్నారు.
సోమవారంలోగా సమస్య పరిష్కారంగాకపోతే అమెరికాలో ఏమౌతుంది? చికాగో నగరంలో వచ్చే గురువారం నాడు అట్టహాసంగా తన 50వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకొనేందుకు అధ్యక్షుడు ఒబామా సిద్ధం అవుతున్నాడు. నిజంగా దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే ఎవరైనా అలా చేస్తారా? గడువులోగా తాను చెప్పిన విధంగా పార్లమెంట్‌ రాజీకి రాకపోతే రాజ్యాంగంలోని పద్నాల్గవ సవరణ కత్తిని ఉపయోగించేందుకు సిద్ధం అవుతున్నాడు. దాని ప్రకారం ప్రభుత్వ రుణ పరిమితిపై అధ్యక్షుడి నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించే అవకాశం ఉండదు. ఎన్నికలలో రుణాన్ని ఒక అస్త్రంగా ఉపయోగించుకొనేందుకు ప్రతిపక్ష రిపబ్లికన్లు ఒబామాను ఆ స్థితికి నెడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రతిపక్షం సహకరించని కారణంగా కత్తి ఝళిపించక తప్పలేదని ఒబామా కూడా ఎన్నికల్లో చెప్పుకుంటాడని వేరే చెప్పనవసరం లేదు. ఏమైనా అమెరికాలోని అధికార,ప్రతిపక్షపార్టీలు రెండూ కలిసి సామాన్య అమెరికన్లు, ప్రపంచ దేశాలను కష్టాల పాల్జేస్తున్నాయి.
article From : prajasakti daily

Friday, July 22, 2011

మర్డోక్‌ మీడియా - నేరస్త జర్నలిజం

మీడియా సామ్రాజ్యానికి రారాజు వంటి వాడు ఆస్ట్రేలియాకు చెందిన రూపర్ట్‌ మర్డోక్‌. న్యూస్‌ కార్పొరేషన్‌ అనే సంస్థ ద్వారా అన్ని ఖండాలలో పత్రికలు, టీవీ ఛానల్స్‌తో తన ఆర్థిక ప్రాభవాన్ని పెంచుకొనేందుకు ఎంతకైనా తెగించే ఒక దుష్టశక్తిగా పేరు తెచ్చుకున్నాడు. దానిలో భాగంగానే పలు తరగతులవారి ఫోన్లను దొంగచాటుగా విని ఆ సమాచారంతో వార్తలు ప్రచురించటం, ఇతరత్రా వినియోగించుకొని సొమ్ముచేసుకున్న పెద్ద కుంభకోణంలో మర్డోక్‌ కుటుంబం ఇరుక్కుంది. ఇప్పటివరకు సూత్రధారులను వదలి పాత్రధారులుగా ఉన్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని నడిపించిన సంపాదకులు రెబెగా బ్రూక్స్‌, లెస్‌ హింటన్‌ తమ మర్డోక్‌ వ్యాపార సామ్రాజ్యంలో తమ బాధ్యతలకు రాజీనామా చేశారు. తొమ్మిది సంవత్సరాల క్రితం అపహరణ, హత్యకు గురైన 13 సంవత్సరాల బాలిక చివరిగా ఇచ్చిన సమాచారం, ఇతర అంశాలను ఆమె ఫోన్‌ బాక్సునుంచి తొలగించిన న్యూస్‌ ఆఫ్‌ దివరల్డ్‌ పత్రిక జర్నలిస్టులు అమె తప్పిపోయింది తప్ప మరణించలేదనే అభిప్రాయం కలిగించారు. వివిధ తరగతులనుంచి వస్తున్న వత్తిళ్లు, తన వ్యాపార సంస్థల వాటాల ధరలు స్టాక్‌మార్కెట్లో పడిపోతుండటంతో మర్డోక్‌ శుక్రవారం నాడు ఆ బాలిక ఇంటికి వెళ్లి తమ సిబ్బంది చేసిన తప్పిదానికి క్షమాపణలు కోరాడు. పత్రికల్లో విచారం వెలిబుచ్చుతూ పేజీలకు పేజీల ప్రకటనలు ఇచ్చాడు. లేబర్‌ పార్టీ మాజీ ప్రధాని గార్డన్‌ బ్రౌన్‌ కూడా మర్డోక్‌ ఫోన్‌ ట్యాపింగ్‌కు బలయ్యాడు. తనను పదవి నుంచి తప్పించటానికి పేరు మోసిన క్రిమినల్స్‌ను వినియోగించి సండే టైమ్స్‌ పత్రిక తన వ్యక్తిగత ఆర్థిక లావాదేవీల వివరాలను సేకరించిందని స్వయంగా చెప్పాడు. తమకు అవసరమైన సమాచారం ఇవ్వని వారికి లంచం ఇవ్వటం,లొంగనివారిని బ్లాక్‌ మెయిల్‌, వేధించటం మర్డోక్‌ వ్యవహార శైలి.
బ్రిటన్‌కు చెందిన న్యూస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ పత్రిక మూసివేత. తన ఆధీనంలోని పత్రికలు అక్రమాలకు పాల్పడితే సహించను అవసరం అయితే శాశ్వతంగా మూసివేస్తా అని గొప్పలు చెప్పుకొనేందుకే. ప్రపంచంలో ఎంతటి పెద్ద పత్రిక,రేడియో స్టేషన్‌, టీవీ ఛానల్‌ అయినా కొనుగోలు చేయగలిగిన మర్డోక్‌ కుటుంబానికి ఒక పత్రికను మూత వేయటం పెద్ద లెక్కలోది కాదు. కానీ దీనివల్ల తప్పు చేయని జర్నలిస్టులు, సిబ్బంది కూడా వీధిలో పడ్డారు.
రాణీగారి ప్రతిపక్షం, అధికార పక్షం అనేది బ్రిటన్‌లో ఒక సామెత. అలాగే అధికార పక్షాన్ని వ్యతిరేకించటమే తన విధానం అని చెప్పుకొనే ఈ పెద్దమనిషి నిజానికి ఎక్కడ అధికారం ఉంటే దానితోనే ఉండి తన పబ్బం గడుపుకుంటాడు. అమెరికాలో టీవీ ఛానల్‌ను నడపాలంటే యజమాని అమెరికా పౌరుడై ఉండాలి. దాంతో అక్కడ పాగా వేసేందుకు 1985లో అక్కడి పౌరసత్వాన్ని తీసుకున్నాడు. అమెరికాలో అతి పెద్ద ధనికుల్లో 38వ స్థానం(2010) ఆక్రమించాడు. మర్డోక్‌ మీడియా కుంభకోణంపై పార్లమెంటరీ కమిటీ విచారణకు హాజరు కావాలని బ్రిటన్‌ కోరింది. ప్రభుత్వం అన్నీ అవాస్తవాలు చెబుతోంది. విచారణకు రావాలో లేదో ఇంకా నిర్ణయించుకోలేదని పొగరుబోతుగా సమాధాన మిచ్చాడు.
నిజానికి ఈ కుంభకోణంలో మర్డోక్‌ను రక్షించేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం తన శక్తి కొలదీ ప్రయత్నిస్తోందంటే అతిశయోక్తి కాదు. దానిలో భాగమే పార్లమెంటరీ విచారణ తతంగం. ఆపేరుతో అక్రమాల వివరాలను ధ్వంసం చేసేందుకు వ్యవధి ఇవ్వటమే. బ్రిటన్‌లో మూతవేసిన న్యూస్‌ ఆఫ్‌ది వరల్డ్‌ పత్రిక ఫోన్ల ట్యాపింగ్‌లో పేరు మోసింది. గత తొమ్మిది సంవత్సరాలుగా దాని అనుచిత కార్యకలాపాలు బయటకు వస్తూనే ఉన్నాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తులు, పోలీసు అధికారులు, చివరకు ఇతర పత్రికల జర్నలిస్టుల ఫోన్‌ సంభాషణలను కూడా అక్రమంగా వింటూ మర్డోక్‌ సేవలో తరిస్తున్నది. అలాంటి దానిని ఇప్పుడు ఆకస్మికంగా మూసివేయటం వెనుక కూడా పెద్ద కుంభకోణమే ఉంది. రెండు సంవత్సరాల క్రితం ఇద్దరు ప్రముఖుల ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో వారికి 16 లక్షల పౌండ్ల నష్టపరిహారం చెల్లించి న్యూస్‌ ఆఫ్‌ది వరల్డ్‌ కేసుల నుంచి బయట పడింది. ఇప్పుడు దాని పాత కేసులన్నీ బయటకు వచ్చేట్లుగా ఉన్నాయి. అదే జరిగితే కేసులు కోర్టుల్లో పోరాడగలిగిన వివిధ రంగాల ప్రముఖులు కనీసం మూడువేల మంది ఉంటారని అంచనా. అదే జరిగితే వందల కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దాన్ని తప్పించుకొనేందుకే పత్రిక మూత. కుంభకోణం వివరాలు బయటకు వచ్చిన తరువాత ముందుగా ఎవరైనా ఆధారాలను ధ్వంసం చేయకుండా చర్యలు తీసుకుంటారు. మర్డోక్‌ యంత్రాంగం ఫోన్‌ ట్యాపింగ్‌ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు గత కొద్ది రోజులుగా కంప్యూటర్లనుంచి సమాచారం మొత్తాన్ని తొలగిస్తున్నది.కొన్ని కోట్ల ఇమెయిల్స్‌, ఇతర సమాచారాన్ని ధ్వంసం చేసినట్లు చెబుతున్నారు.
బ్రిటన్‌ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తరువాత అమెరికాలో కూడా అదే తరహా అక్రమాలకు పాల్పడినట్లు బయటపడింది. న్యూయార్క్‌ నగరంలోని ప్రపంచ వాణిజ్య కేంద్రాన్ని పేల్చివేసిన ఉగ్రవాద దాడిలో మరణించిన వారి కుటుంబాల ఫోన్‌ నంబర్లను సేకరించి వారి సంభాషణలను దొంగచాటుగా విన్నట్లు వచ్చిన ఫిర్యాదులపై అక్కడి ఎఫ్‌బిఐ విచారణకు ఆదేశించింది.
'మర్డోక్‌ ఎల్లపుడూ అధికార పక్షం వైపే ఉండాలని కోరుకుంటాడు. అతనెప్పుడూ ఓడిపోయిన వారితో ఉండాలని కోరుకోడు' అని అతని జీవిత చరిత్రను రాసిన విలియమ్‌ షాక్రాస్‌ పేర్కొన్నాడు. తనతో పాటు పత్రికలో రాతలు కూడా ఎటుతిరిగితే అటే తిరగాలని ఆదేశించటంతో 'ది ఆస్ట్రేలియన్‌' అనే పత్రిక జర్నలిస్టులు నిరసనగా సమ్మెకు దిగారు. సమ్మెకు దిగిన వారు ఎర్ర జెండాలు పట్టుకున్న కిరాయి వ్యక్తులని మర్డోక్‌ నిందించాడు. అమెరికాలో న్యూయార్క్‌ పోస్ట్‌ అనే పత్రికను కొనుగోలు చేసినపుడు కూడా ఇలాగే జరిగింది. లండన్‌లోని తన పత్రికల్లో సిబ్బంది తాను చెప్పినట్లు వినాలి తప్ప చట్టాలు గిట్టాలు అంటే కుదరవని ప్రకటించిన నిరంకుశుడు మర్డోక్‌. ముద్రణా విభాగ కార్మికులను దెబ్బతీసేందుకు రహస్యంగా ఒక ముద్రణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ యూనియన్‌లేకుండా చూశాడు. రెగ్యులర్‌ ప్రెస్‌ కార్మికులు సమ్మెకు పూనుకోవటంతో వాటిని మూసివేసి ఆరువేల మందిని ఇంటికి పంపి యూనియన్‌లేని ప్రెస్‌ ద్వారా పత్రికలను ముద్రించాడు.
మర్డోక్‌ మద్దతు కోసం పాకులాడటంలో లేబర్‌, టోరీ పార్టీలకు తేడాలేదు. అందుకే అధికారంలో ఉన్న టోరీ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ కుంభకోణ తీవ్రతను తగ్గించేందుకు తన వంతు పాత్రను పోషిస్తున్నాడు.' నిజం ఏమిటంటే దీనిలో మనం అందరం ఉన్నాం, మీడియా, రాజకీయవేత్తలు, నాతో సహా అన్ని పార్టీల నాయకులు దీనికి బాధ్యులే'. అని వ్యాఖ్యానించాడు. ఇది నిజంగా హృదయంలోంచి వచ్చిందైతే వెంటనే పదవికి రాజీనామా చేసి ఉండేవాడు. పొదుపు చర్యల పేరుతో విశ్వవిద్యాలయాల ఫీజులను కామెరాన్‌ సర్కార్‌ విపరీతంగా పెంచింది. దాన్ని వ్యతిరేకించిన విద్యార్థులు పెద్ద ఆందోళన చేశారు. వారిని పోలీసులతో కొట్టించి జైల్లో పెట్టిన గూండాలుగా చిత్రించిన కామెరాన్‌ మర్డోక్‌ వంటి నేరగాళ్లను ప్రోత్సహించటంలో తాము కూడా ఉన్నామని చెప్పుకొనేందుకు ఏమాత్రం సిగ్గుపడటం లేదు. ఇదే వర్గనీతి.

Note : article from prajasakti.daily

Monday, July 18, 2011

మర్డోక్‌ మాఫియా జర్నలిజం

దాదాపు నాలుగు వందల సంవత్సరాల కాలంలో ప్రపంచవ్యాపితంగా పలువురు సంపాదకులు, యజమానులు సమకూర్చిన పత్రికల విశ్వసనీయతను నలభై సంవత్సరాల కాలంలో తలెత్తుకోలేనంతగా దెబ్బతీసిన దుష్టశక్తి రూపర్ట్‌ మర్డోక్‌. ఎక్కడ తిరిగితే నాకేం నా దొడ్లో ఈనటం ముఖ్యం అని తలచే బాపతు మర్డోక్‌. ఏం చేస్తారో నాకనవసరం సంచలనాత్మక వార్తలతో నా పత్రికలు, టీవీ ఛానళ్లు లాభాలు సంపాదించాలి, ప్రపంచమంతటా నా సామ్రాజ్యం విస్తరించాలని ఆదేశించిన తరువాత జర్నలిస్టులు,ప్రచారం కోసం తహతహలాడే అధికార రాజకీయ నాయకులు, అయితే నాకేంటి అనే పోలీసు అక్రమార్కులు కలిసి విలువల వలువలను విప్పేశారు. ఇంతింతై వటుడింతై అన్నట్లు మర్డోక్‌గేట్‌ అక్రమాలు ఐరోపా, అమెరికా ఖండాలను గత రెండు వారాలుగా అనేక మలుపులు తిప్పుతున్నాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు గలవారి వ్యక్తిగత అంశాల వంటి వాటితో ప్రారంభించి చివరకు ఉగ్రవాదుల దాడులు, ఇతర సందర్భాల్లో మరణించిన వారిని కూడా వదల కుండా వేలాది కుటుంబాల దైన్య స్థితిని కూడా సొమ్ము చేసుకొనే హీన స్థాయికి మర్డోక్‌ కంపెనీలు దిగజారాయి. తొమ్మిది సంవత్సరాల క్రితం బ్రిటన్‌లో అపహరణకు గురై హత్యగావించబడిన 13 సంవత్సరాల బాలిక ఉదంతం ఇప్పుడు మర్డోక్‌ మెడకు చుట్టుకుంది. ఆమె చివరి సారిగా పంపిన వాయిస్‌ మెయిల్‌, ఈ మెయిల్స్‌ను ఆమె బాక్సునుంచి న్యూస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ అనే మర్డోక్‌ పత్రికకు చెందిన జర్నలిస్టులు తొలగించారు. దాంతో ఆమె కనిపించకుండా పోయిందని అందరూ అనుకునేట్లు చేశారు. ఇది వెల్లడి కావటంతో దాదాపు నాలుగువేల మంది ప్రముఖుల ఫోన్లు, ఇమెయిల్స్‌ను అక్రమంగా వినటం, సమాచారాన్ని తస్కరించడం వంటివి చేశారని వార్తలు వస్తున్నాయి. తొలుత తమ సిబ్బంది అంతా పత్తిత్తులే అని బుకాయించిన మర్డోక్‌ అక్రమాల తీవ్రతను తగ్గించేందుకు చివరకు న్యూస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ పత్రికను మూసివేసి అక్రమాలను సహించేది లేదన్నట్లుగా ఫోజు పెట్టాడు. చివరకు సీసాలో బంధించిన దుష్టశ క్తి తన విశ్వరూపాన్ని ప్రదర్శించినట్లుగా కుంభకోణం తీవ్రత వెల్లడి కావటంతో తమ వారు చేసిన తప్పుడు పనుల తీవ్రత తనకు తెలియదని అందుకు క్షమాపణలు కోరుతున్నట్లు తన పత్రికల్లో పేజీల పేజీల ప్రకటనలు జారీ చేశాడు.


            లేబర్‌ పార్టీ మాజీ ప్రధాని గార్డన్‌ బ్రౌన్‌ కూడా మర్డోక్‌ ఫోన్‌ ట్యాపింగ్‌కు బలయ్యాడు. తనను పదవి నుంచి తప్పించటానికి పేరు మోసిన క్రిమినల్స్‌ను వినియోగించి సండే టైమ్స్‌ పత్రిక తన వ్యక్తిగత ఆర్థిక లావాదేవీల వివరాలను సేకరించిందని స్వయంగా చెప్పాడు. తమకు అవసరమైన సమాచారం ఇవ్వని వారికి లంచం ఇవ్వటం,లొంగనివారిని బ్లాక్‌ మెయిల్‌, వేధించటం, ఇలాంటి అక్రమాలకు పోలీసులకు లంచాలిచ్చి వారి నుంచి సమాచారం, సహకారం పొందటం మర్డోక్‌ నిత్య వ్యవహార శైలి. అక్రమాలకు పాల్పడేవారి సమాచారం సేకరించటంతో పాటు అలాంటి పనులకు అసలు వారినే ఉపయోగించుకోవటంలో కూడా ఘనుడు మర్డోక్‌. ఈ క్రమంలో అలాంటి అక్రమార్కులకు జర్నలిస్టుల ముద్రవేసి వారిని తన పత్రికల కాలమిస్టులుగా నియమించిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సకల అవాంఛనీయ కార్యకలాపాలను నడిపించిన రెబెకా బ్రూక్స్‌ అనే మహిళా ఎడిటర్‌, అమెరికా నుంచి వెలువడే వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ముద్రాపకుడు లెస్‌ హింటన్‌ శుక్రవారం నాడు రాజీనామా చేసి ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. మర్డోక్‌గేట్‌ వార్తలతో స్టాక్‌ మార్కెట్‌లో మర్డోక్‌ సంస్థల వాటాల రేట్లు పతనం కావటంతో మీడియా సామ్రాజ్యంలో ఏడుశాతం వాటా కలిగిన సౌదీ రాజ కుటుంబీకుడు ఒకరు రెబెకాను తొలగించాలని వత్తిడి చేసిన తరువాతే ఆమె రాజీనామా చేశారు. అమెకంటే ముందు సంపాదకుడిగా ఉన్న హింటన్‌ కూడా అనివార్యంగా అదేదారి పట్టాడు. ఈ వరుసలో వారికి సహకరించిన స్కాట్లండ్‌ యార్డ్‌ పోలీసు ఉన్నతాధికారులు ముగ్గురు, మర్డోక్‌ కుమారులు, చివరకు మర్డోక్‌కూడా ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. మర్డోక్‌ పత్రికల జర్నలిస్టులు అక్రమాలకు పాల్పడుతున్నారని, అందుకు అవసరమైన సొమ్మును కూడా తానే మంజూరు చేశానని అయితే వాటి తీవ్రత తనకు తెలియదని మర్డోక్‌ కొడుకు బుకాయిస్తున్నాడు. తన మీడియా ద్వారా ఆస్ట్రేలియా, బ్రిటన్‌, అమెరికాల్లోని రెండు పార్టీల వ్యవస్థల్లో అధికార ప్రతిపక్షం రెండింటినీ మర్డోక్‌ ప్రభావితం చేస్తున్నాడు. ఎవరు గెలిచినా వారివెనుక చేరటం తన సంపదను పెంచుకోవటం అతగాడి స్వభావం. మూడు దేశాల్లోనూ మీడియాపై గుత్తాధిపత్యం కలిగి ఉన్నందున ఆయా పార్టీల వారు మర్డోక్‌ మద్దతు కోసం నానా గడ్డీ కరుస్తారు. అందువల్లనే సాక్షాత్తూ బ్రిటన్‌ ప్రధాని కామెరాన్‌ మర్డోక్‌ ఫోన్‌ట్యాపింగ్‌ అక్రమాలపై పార్లమెంటరీ కమిటీ విచారణకు ఆదేశించినా, అమెరికా ఎఫ్‌బిఐని రంగంలోకి దించుతున్నట్లు ప్రకటించినా మర్డోక్‌ మాఫియాకు ఎలాంటి ఆటంకం ఉండదని అనేక మంది చెబుతున్నారు. దానికి నిదర్శనమా అన్నట్లు న్యూస్‌ఆఫ్‌ ది వరల్డ్‌ అక్రమాల వివరాలున్న కంప్యూటర్లను ఇంతవరకు లండన్‌ పోలీసులు స్వాధీనం చేసుకోలేదు. ఈలోగా వాటిలోని సమాచారాన్ని, ఇతర ఫైళ్లను ధ్వంసం చేసేందుకు మర్డోక్‌ యంత్రాంగానికి వ్యవధి ఇచ్చారన్నది స్పష్టం. మూల విరాట్టులను వదలి ఉత్సవిగ్రహాలను పట్టుకున్నట్లుగా సూత్రధారుల జోలికెళ్లకుండా పాత్రధారులుగా బయటపడిన వారిని ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేశారు.
స్టార్‌ టీవీతో ప్రారంభమైన మర్డోక్‌ సామ్రాజ్యం మింట్‌ వంటి ఆంగ్ల పత్రికతో మన దేశంలో కూడా విస్తరించటం ప్రారంభమైన విషయం అంతగా తెలియదు. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లుగా కాపీ కొట్టటంలో తిరుగులేని సామర్ధ్యం ఉన్న కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్లు మన దేశంలో, రాష్ట్రంలో మర్డోక్‌ మాఫియా జర్నలిజాన్ని అమలు చేయటం అనేక ఉదంతాలలో గమనించవచ్చు. తమకు అనుకూలమైన వారికి బాకాలూదటం, లేనివారిని విస్మరించటం చూస్తున్నాము. ఇలాంటి శక్తులను ఒక కంట కనిపెట్టి అప్రమత్తం కాకపోతే లాభాలే ధ్యేయంగా ఈ రంగంలోకి ప్రవేశించిన వారు తెల్లవారేసరికి మరో మర్డోక్‌గా మారేందుకు మాఫియా జర్నలిజాన్ని మరింతగా విస్తరిస్తారని, మన ప్రజాస్వామ్య, పౌరహక్కులకు, సామాజిక వ్యవస్థకు ముప్పు తెస్తారని గ్రహించటం అవసరం.

Editorial From :  prajasakti

Friday, July 1, 2011

From 2G to KG:Where Does the Buck Stop?


THE government of the day does not own the natural gas from Krishna Godavari (KG) basin. It is a natural resource owned by the people of this country and the government is only the trustee. National resources are owned by the doctrine of public trust as held by the Supreme Court. Natural gas being one of the main sources of energy for production of power and fertilizer, higher price of gas means higher tariff from gas-based power plants and higher fertilizer subsidy. That is why the recently revealed CAG’s draft report very correctly categorises the loss on KG gas scam as “unquantifiable” unlike 2G scam where the quantification is more specific to the tune of Rs 1.76 lakh crore.

But the most glaring difference between these two cases is on the issue of accountability i.e. where does the buck stop in the KG gas scam? Let the facts speak for themselves.

GENESIS OF THE CASE 

Till recently gas production and marketing was entirely with the public sector and pricing was administered. This was opened up for private participation in the nineties. The New Exploration and Licensing Policy (NELP) was announced in 1997 and M/s RIL was awarded the contract in the first NELP round for operating KG basin, which has India’s largest gas discoveries. A Production Sharing Contract (PSC) was signed between the government and RIL, the contractor, to govern gas production and pricing. The opening of gas production and marketing to private sector resulted in dual pricing of gas: administered and market-linked. Administered Price was through “Administrative Pricing Mechanism” (APM), which comprised actual cost of production plus reasonable profit, determined by the government. Before the production and marketing of KG basin started in 2009, the pre-dominant part was covered by APM @ 1.83 US dollar/unit. Before the marketing of KG gas, market pricing was done for relatively small volumes by private operators which were in the field before NELP.

CAG’s draft report has actually vindicated one of the two major charges leveled by CPI(M) MPs against government-RIL nexus on KG gas viz the “gold plating” or “manipulating the development cost of the gas fields”. The other charge was regarding high price of Reliance gas @ 4.2 USD/unit fixed up in 2007 by an Empowered Group of Ministers, in spite of the fact that actual production cost of KG gas was 1.43 USD/unit, the APM cost of ONGC was 1.83 USD and most shockingly RIL itself had quoted 2.34 USD/unit to M/s NTPC, the Maharatna PSU, in response to an international competitive bidding in 2004. This issue of pricing of gas has not been dealt in CAG’s Draft report. 

CHRONOLOGY OF EVENTS 

  I.            The question was first raised in Rajya Sabha on December 12, 2006 by CPI(M) MPs late Chittabrata Majumdar and Tapan Sen. The government informed that M/s RIL-Niko consortium had submitted a development plan that envisaged increase in production from 40 to 80 mmscmd and increase in expenditure from 2.47 billion dollar to 8.84 billion dollar. It was immediately pointed out in a letter dated 21.12.2006 to minister of petroleum and natural gas by Tapan Sen, MP and a member of Standing Committee of Petroleum and Natural Gas that the expenditure per unit of production, which should come down with the increase in production due to economy of scale, had been inflated abnormally, warranting immediate intervention by the government.

                            II.            This was followed up with three letters dated 25.01.2007, 27.02.2007 and 12.03.2007. On April 30, 2007 a detailed letter was again sent to minister of petroleum and natural gas with copy to the prime minister about the likely impact of gold plating on price of natural gas. On 15.05.2007 in reply to a question in parliament, it was informed by the government that the revised capital investment has been approved by DGH.

                         III.            Three more letters dated 11.6.2007, 4.7.2007 and 13.7.2007 were sent by Tapan Sen to the prime minister directly for his intervention to stop gold plating and ensure that the price of natural gas is not arbitrarily increased. No action was taken other than mere acknowledgement of letters.

                        IV.            The prime minister and his office swung into action only when the then chief minister of Andhra Pradesh late Y S Rajasekhar Reddy raised a number of issues on KG basin gas, including the gold plating and pricing of gas in a series of three letters dated 16th, 29th & 30th June 2007. Some of issues raised by Reddy were common viz

a)     The proposed market discovery price of natural gas produced from KG basin @ $ 4.5 to $ 5/MMBTU would mean an increase of 256 per cent from the present APM prices.

b)    RIL has obtained bids from consumers with stranded assets and claim this to be market driven price forgetting its own bid to NTPC. This bid should be treated as market price because this price came through global competitive bidding.

c)     The government should monitor the investment by the contractors and have it scrutinized by independent and autonomous authority so that costs are not unduly inflated.

d)    It will also be necessary to constitute an independent autonomous regulatory authority to decide upstream pricing of gas.

                           V.            PM/PMO immediately referred these letters to a Committee of Secretaries headed by cabinet secretary which was assigned to give report on issues related to supply and pricing of gas.

This raises an immediate question – why did the PM/PMO selectively choose to refer only the three letters written by Andhra Pradesh CM to the Committee of Secretaries ignoring the letters from an MP, that too an MP who was a member of Parliamentary Standing Committee on Petroleum and Natural Gas? Were these letters that contained several facts and figures ignored only because he was neither a Congressman nor someone from civil society? Who is responsible for this sidelining of a people’s representative in parliament ?

REPORT OF  THE CABINET SECRETARY
The Committees of Secretaries met on 29.6.2007, 2.7.2007, 6.7.2007 and 10.7.2007. And on development cost of the gas field, as per available information, the cabinet secretary reported:

‘The accountability of Management Committee mechanism for approval of various costs needs to be enhanced. For this purpose, Ministry of Petroleum & Natural Gas would draw up guidelines and mechanisms with the approval of the government as large amounts of government revenue in profit share are involved. Effective audit mechanisms through C&AG or other reputed agencies would be put in place. It is noted here that under Article 25.5, “The government shall have the right to audit the accounting records of the contractor in respect of petroleum operations in the accounting procedure.” The government must, in consultation with the CAG, appoint an international auditor who has sufficient experience in the field of oil exploration and production.’

The report was sent to PMO. Did the prime minister/government consult CAG and appoint an international auditor? Who should be blamed for not taking any preventive step to stop the revenue loss, though cautioned repeatedly by CPI(M) MPs, AP chief minister and even the cabinet secretary? Where should the buck stop?

GAS PRICING FORUMULA
What did the cabinet secretary’s report say regarding the pricing formula offered by RIL as per which the “well-head” price (i.e. the price at the production point) was 4.33 dollar per barrel and the delivered price at the user end would be 4.76 to 5.98 dollar without taxes? It reportedly said “the RIL formula may be taken up for approval only after a policy is put in place. Prima facie the formula appears to suffer from several infirmities in respect of the formula employed and the bidding process.”

The above was based on the presentations by the ministry of fertilizers and NTPC/ministry of power, which specifically stated:
·        RIL price formula is flawed;
·        A delivery price beyond 5 dollar/unit will be prohibitive for fertilizer sector and every increase of 1 dollar will involve an additional Rs 2000 crore subsidy;
·        Gas price beyond 2.34 dollar will be prohibitive for power sector;
·        Pricing should be fixed by Petroleum & Natural Gas Regulatory Board after amendment in the Act;
·        It was not prudent to fix a price which will jeoparadise the NTPC's case wherein price of 2.34 dollar was arrived at after International Competitive Bidding.”

Not only that, the chairman & managing director of NTPC in a letter dated 24.8.2007 wrote to the chairman of EGoM:

“In continuation of the presentation I made on the gas pricing issue of Reliance Industries Limited for KG Basin with particular reference to NTPC contract, I would like to convey that implication of the price differential between gas price as delivered at Kawas/Gandhar as per NTPC Contract and RIL's proposed price, will be of the order of Rs 24,000 crore for the quantity contracted by NTPC during the entire contract period of 17 years. This aspect may also please be kept in view.”

Inspite of the above, the EGoM approved the price formula in a great haste on 12.9.2007 though the production of KG gas started only from 1.4.2009. The rate was slightly reduced from 4.33 dollar to 4.2 dollar/unit. Why this hurry when there were serious question marks on development cost, pricing formula, loss to NTPC, financial impact on fertilizer and power production? Who is answerable to the parliament on an issue concerning three ministries viz Petroleum & Natural Gas, Power and Fertilizer? A minister or a Group of Ministers or the prime minister?

WHY EGoM?
As outlined at the outset, gas pricing was mostly based on cost plus reasonable profit basis as per APM and there was no sacrosanct formula for pricing for non APM gas produced by private sector, which covered very small volumes before KG basin gas. Keeping this in perspective the "Integrated Energy Policy" document of August 2006, prepared by the Planning Commission, recommended:

"As long as there is shortage of natural gas in the country and the two major users of gas, namely fertilizer and power, work in a regulated cost plus environment, a competitive market determined price would be highly distorted. The prevailing regime of fertilizer subsidies & power sector subsidies would further amplify such distortions and cross subsides. In such a situation price of domestic natural gas and its allocation should be independently regulated on a cost plus basis including reasonable returns."

The prime minister is the chairman of the Planning Commission and there was a gas shortage in 2007 which continues till date. Then who decided to overrule the Planning Commission recommendation for “Cost Plus” pricing and went for a distorted market determined price through a fast-track EGoM?

And finally what was the rationale for forming an EGoM headed by external affairs minister to fix gas price when Energy Co-ordination Committee (ECC) headed by the prime minister and comprising ministers of Finance, Petroleum & Natural Gas, Power, Coal, deputy chairman of Planning Commission, chairman of Economic Advisory Council to PM, with principal secretary to PM as convener was already in place since July 2005. Need for rational pricing to promote inter fuel substitutions (in this case gas, coal and oil) is one of major issues before ECC. Still, why a separate EGoM? Is it a case of shirking responsibility or of willfully insulating oneself from another ‘G’ series scam? Who will answer? Obviously not Jaipal Reddy, Deora, Sibal or Digvijay Singh. WHERE?


***Article from Cpim.org  written   by  Dipankar Mukherjee








Wednesday, April 6, 2011

Antrix Devas – Animal Spirit of Indian Capitalism

THE committee headed by B K Chaturvedi, Planning Commission member to review the controversial deal on S Band spectrum between Antrix Corporation and the Bangalore-based Devas Multimedia Private Ltd, has submitted its report, though its conclusions are yet not public. Nor are we aware what further steps the government intends to take, apart from the cancellation of the deal. Going by the response of  ISRO to an RTI application, the report will blame Antrix for the deal while claiming no one in IRSO or Space Commission was aware of the nature of the deal. This, despite key people from ISRO and the Space Commission being on the board of Antrix!

While the scam nature of the Antrix Devas Multimedia deal for S Band spectrum has drawn major attention, there are larger issues at stake here. How are commercial deals being undertaken by corporations such as Antrix, which are wholly owned companies of various departments of the government? How is spectrum allocation between various departments being managed? Can each department, which has been allocated spectrum for its specific needs, reach its own commercial deals treating this spectrum as its “private” property?

The Antrix Devas shows failure on all these counts. It was commercially a bad deal, even without taking into account the value of the spectrum. Antrix was making the up-front investment for the two satellites, while Devas was paying Antrix virtually from the revenue it would earn from leasing them. This is apart from the value of the spectrum. The spectrum issue is even worse. The spectrum that ISRO was giving away through this deal is a valuable one which is increasingly being used for land-based wireless broadband services. DoT and TRAI had been asking the Department of Space (DoS) to release a part of this spectrum for this purpose. DoS was not only the most recalcitrant in releasing spectrum, but also claimed that this S Band spectrum was vital for security and strategic reasons. They never disclosed to DoT and TRAI that they were commercially selling this spectrum to private parties for the same services.

The PMO and the Congress party have gone in an overdrive that the deal was somehow only known to Antrix and ISRO and not disclosed to the “government”. This makes strange reading as ISRO is a government body and the distinction between ISRO and the government is difficult to understand. The members in the Space Commission, the policy-making body of space, were all a party to this Antrix Devas decision. Various officials in DoS and the PMO were fully aware of this deal and if they did not understand what this deal was about, they should certainly not be sitting in those positions. Looking at this deal, it has all the hallmark of a sweetheart deal, struck between ISRO and some of its past senior personnel.

MAKING A KILLING
Let us look at the Devas Antrix deal first. It was a deal for leasing 90  per cent of capacity of transponders on two satellites –  GSAT 6 and 6A –  for 12 years from Antrix, the corporate arm of ISRO, at a total cost of $ 300 million (or about Rs 1,200 crore). For all practical purposes, the two satellites were being launched almost exclusively for Devas use. Leasing these transponders would provide 70 MHz of spectrum for Devas. Devas was proposing to use these transponders and the 70 MHz spectrum for providing broadband services to consumers through the two satellites. Given the broadband spectrum cost as shown by the BWA license sale – which gave about 12,000 crore for 20 MHz – the Devas leasing of 70 MHz spectrum for a fraction of this cost has obviously caused a major stink. The 2G scam is an obvious reference point, and even if we do not take mobile services but only broadband services as the bench-mark for spectrum prices, Devas has paid only 1/40th the current cost of the spectrum for similar services. Not surprisingly, Devas sold a part of their shares to Colombia Capital, Deutche Telecom and Telecom Ventures at a huge premium – Rs 10 share being sold first at Rs 21,445 in 2006 and later at Rs 1,26,821 on September 29, 2009, thus making a killing. As in the 2G case, the primary asset that Devas had was its agreement with Antrix and the 70 MHz of spectrum. Till 2006, they had made virtually no investments. Even by 2009, the only substantial investment that Devas made was paying Antrix Rs 58.37 crores as upfront capacity reservation fee for the two satellites.

Madhavan Nair, the then chairman of ISRO has claimed that spectrum in space should somehow not be seen in the same way as spectrum for mobile or other terrestrial services. Let us examine first the Devas deal without taking spectrum prices into account.

ISRO was sending up two satellites GSAT-6 and 6A satellite, at a cost of Rs 269 crores for GSAT 6 and GSAT-6A at a cost of Rs 147 crores. The launch cost of the satellites was Rs 350 crores. The total investment that ISRO and the government were making was Rs 766 crore. Against this, Devas was to make up-front reservation fees of $40 million, of which Rs 58.37 crore has been paid till date. The rest – an amount between $216 to $260 million – was to be paid over a period of 12 years. If we convert this to Rupees, Devas would pay anything between Rs 1000 crore to Rs 1,200 crore over the 12 year of the contract.

In any commercial deal, the money to be considered is the Net Present Value (NPV) of the sums to be paid in the future. This is simply because if I do not spend my money but put it in a bank, its value will appreciate over time due to interest that I will be paid. Therefore, when comparing money now to any future sums, we always have to take this into account. In all accounting practices, this is done by a discounting factor – we discount future money with a discounting factor to bring it to its current value or NPV. If we do this with the Antrix Devas deal, the money that Antrix would receive was less in NPV terms than the amount Antrix is spending on sending up the two satellites. In other words, this deal fails even the most elementary commercial test that can be applied – Antrix was spending more money than it was to receive in NPV terms from Devas. This deal makes no commercial sense whatever, even without taking the value of spectrum into account.

DEEPER MALAISE

The spectrum issue has been murky in the country right from the start. As per spectrum allocation, major departments of the government are sitting on commercially valuable spectrum. Defence, space, information and broadcasting all hold spectrum. For example, one of the charges against Lalli, the former AIR chief, was that he was vacating 106.4 MHz band –  the one that FM Gold uses in some of the metros –  to a private party and switch to an inferior band. This was again commercially a decision that made no sense for AIR and was obviously driven by extraneous considerations. In today's world, spectrum is extremely valuable and if each department and government entity is free to sell spectrum every which way, we are opening the country to innumerable scams.

The spectrum that was originally allocated to different departments was at a time when mobile and broadband services did not exist. So a number of ministries are sitting on spectrum that is required for such services. The problem with spectrum is that internationally, certain parts of the spectrum are used for certain purposes. If we do a different spectrum allocation than what is extant internationally, there will be no equipment manufacturer available for such services. This means those parts of the spectrum that are used internationally for mobile and broadband services have obviously more commercial value than other parts of the spectrum.

DoS holds 150 MHz of the S Band. When it became clear that the existing broadband services would run into insufficiency of spectrum at some point, DoT and TRAI started discussions with DoS and Defence for releasing some of their current allocation. According to TRAI, the most obdurate about releasing spectrum was DoS. In spite of repeated requests that a part of their current 150 MHz they are holding be released for other services, DoS refused, claiming strategic and other critical applications. All this is on record. It begs all imagination that DoS was completely unaware that 70 MHz of this spectrum had been reserved for Devas for commercial use.

Obviously, spectrum is emerging –  along with land and minerals – as a major part of the primitive accumulation of capital. The issue here is not just of corruption – whether laws have been obeyed or procedures followed. What is emerging is policy making to permit theft of nation’s scarce resources on a grand scale for the benefit of the corporate class. That is why while the government is willing to concede violations of procedure, it is not willing to take steps to cancel telecom licenses –in direct violation of the principle that those who made gains due to corruption cannot keep such ill gotten gains.

The problem for the government is once loot of public resources for private gain is accepted as the policy of the government, each department is turning entrepreneurial. Therefore Armed Services are looking at how to “sell” defence land (Adarsh), railways are talking about building malls and other commercial “use” of railway land and Space is “selling” spectrum.  All this is a part of the neo-liberal ethos of the current brand of capitalism. This is the “animal” spirit of Indian capitalism that Manmohan Singh extolled in his 1991 budget speech. What he forgot to tell the country is that this animal spirit of capitalism needs a State that allows for larceny on a grand scale. This is what we are seeing today. A huge transfer of nation's scarce resources to the capitalist class, in which politicians and bureaucratic class are becoming prominent.

This is the other part of this picture of animal spirit of India’s entrepreneurs. Today, ripping off State’s resources is the biggest part of capitalism. And in this, we have only to see the new capitalists to understand that under neo-liberalism, this has grown a hundred fold over the earlier license permit raj; with political families like DMK's "own” media, real estate and other companies, the mechanics of this brand of capitalism are not difficult to understand. This is the brand of capitalism that Manmohan Singh is promoting – behind his claim of personal integrity.

That BJP with its Yeddyurappas and Mahajans is not far behind is not surprising. They also subscribe fully to this brand of capitalism. They had also unleashed similar "animal spirits” during the Vajpayee regime and continue to do so in the states they rule.

The issue here is not the integrity of the prime minister, the issue here is the integrity of the system. That is what stands exposed today. Antrix Devas deal is a part of this deeper malaise. This is what we need to address.


Note :*
article from cpim.org written by prabir purkayastha

Monday, April 4, 2011

భక్తి ఉద్యమం

ప్రపంచీకరణ యుగంలో ప్రజలలో భక్తి మరీ పెరిగిపోవడం భౌతిక వాదులకు ఆందోళన కలిగించే విషయం. అయితే ఇలా ఎందుకు జరుగుతోందో తెలుసుకోవాలి. ప్రపంచీకరణ విధానాల వల్ల సంపద కేంద్రీకరణ జరుగుతోంది. ఇంకోవైపు పేదరికం పెరిగిపోతోంది. మధ్య తరగతిలో సైతం ఆదాయాలు పెరుగుతున్నట్టే కనపడినప్పటికీ, అభద్రతా భావం పెరుగుతోంది. కుటుంబ సంబంధాలపై దీని ప్రభావం తీవ్రంగా పడుతున్నది.ఇటువంటి దశలో ప్రజలను కదిలించే బలమైన ఉద్యమాలు నిర్మింపబడితే, ప్రజలలో విశ్వాసం పాదుకొల్పగలిగితే ఫలితాలు వేరుగా ఉంటాయి. కాని ప్రగతి శీల, కమ్యూనిస్టు ఉద్యమాలకు చారిత్రకంగా ఏర్పడిన బలహీనతలు, పరిమితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తి భావాలు, మూఢ విశ్వాసాలు పెరుగుతున్నాయి.
కలవారినేగాని కరుణించలేడా
నిరుపేద మొరలేవి వినపించుకోడా
కన్నీటి బ్రతుకుల కనలేనినాడు
స్వామి కరుణామయుండన్న బిరుదేలనమ్మా
''నడిరేయి ఏజాములో'' అన్న పాట రంగుల రాట్నం సినిమాలోని తెలుగునాట అంద రికీ సుపరిచితమే. ఆ పాటలోని పై చరణంలో భావం చాలా లోతైనది. ప్రజలు ఎందువలన దేవుడివైపు చూస్తారు? ఎందుకు కొలుస్తారు? ఎందుకు నమ్ముతారు? అన్నది ముఖ్యమైన అంశం. ప్రజలకున్న విశ్వాసం సరైనదా, కాదా అన్న భాగాన్ని మాత్రమే మనం తర్కించుకుంటే సరిపోదు. అటువంటి తర్కం, చర్చ భావవా దానికి, భౌతిక వాదానికి మధ్యన దీర్ఘకాలంగా కొనసాగుతున్న తాత్విక యుద్ధంలోకి మనను లాగుతుంది. ఆటువంటి యుద్ధమూ అవసరమే. మార్క్సు, ఆ తర్వాత లెనిన్‌ ఆ యుద్ధాన్ని చాలా ఉన్నత స్థాయిలో నడిపారు. గతి తార్కిక భౌతికవాదం ఆధునిక సమాజపు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని స్వీకరించి భావవాదంపై విజయం సాధించింది.
అయినప్పటికీ ప్రజలలో భక్తి విశ్వాసాలు తరగడం లేదు. భౌతికవాద ప్రచారంతో ప్రజల తాత్విక విశ్వాసాలను మార్చడానికి ప్రగతి వాదులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ యుద్ధం కొనసాగవలసిందే. మరి మనం ఎప్పుడు భావవాదంపై స్పష్టంగా విజయం సాధించగలుగుతాం అన్నది ప్రశ్న. దీనికి మార్క్స్‌ స్పష్టంగా పరిష్కారం చూపాడు. ప్రజలు ఎందుకు దేవుడి వైపు చూస్తారు? అన్నది పరిశీలించాడు.
మనిషికి కష్టాలు ఎదురైనపుడు, అవస రాలు తీరనపుడు, కోరుకున్నది పొందలేనే మోనన్న బెంగ పెరిగినపుడు అతడిలోని నిస్సహా యత, బలహీనత, దౌర్బల్యం బైటపడతాయి. అటువంటి పరిస్థితుల్లో దేవుడి వైపు చూస్తాడు, ప్రార్థిస్తాడు, కొలుస్తాడు, మొక్కుతాడు. మనిషిని ఆ విధంగా దైవం వైపుకి నెట్టడంలో భౌతిక పరిస్థితిదే ప్రధానమైన పాత్ర. కాబట్టి ఆ పరిస్థితులను మార్చేందుకు మనం ప్రయత్నిం చాలి ఆన్నాడు మార్క్స్‌. అంటే ఏమిటి? ఆ మనిషి భౌతిక అవసరాలను తీర్చగలిగే ప్రయ త్నం చేయాలి. సమస్యల పరిష్కారానికి ప్రయ త్నించాలి. ఆ క్రమంలో అతడికి మన ఉద్యమంపైన విశ్వాసం కల్పించాలి. తన నిస్స హాయతా భావాన్ని క్రమంగా అతడు అధిగమిం చేలా చేయాలి.
ఇటువంటి కృషి లేకుండా కేవలం తాత్వి కంగా అతడి ఆలోచనను మార్చాలన్న దానికే పరిమితం అయితే మార్పురాదు.
ఇక్కడ మనం పరిశీలించాల్సిన అంశం మరొకటుంది. మనిషికి కష్టాలు, పేదరికం, దుర్భలత్వం, నిస్సహాయత -వీటన్నింటినీ కలిగిం చేది దోపిడీ వ్యవస్థే. అదే వ్యవస్థ అతడిని దైవం వైపు చూసి సాగిలపడి ప్రార్థించి వేడుకునేలా చేస్తుంది. అలా ప్రజలు సాగిలపడుతున్నంత కాలమూ ఈ దోపిడీ వ్యస్థకు మనుగడ ఉంటు ంది. అందుకే పాలకవర్గాలు తమకనుకూలమైన తాత్విక భావాల వ్యాప్తిని ఎప్పుడూ ప్రోత్స హిస్తాయి.
తన అద్వైత సిద్థాంతాన్ని పాలకవర్గ ప్రయోజనాలకు దన్నుగా నిలబెట్టాడు శంక రుడు.(ఈ విషయాన్ని గత రెండు వ్యాసాలలో వివరంగా ముచ్చటించుకున్నాం). ఐతే ఈ ప్రపంచం మిథ్య అన్న అతడి సిద్థాంతం కష్టాల్లో పీకలలోతు కూరుకు పోయిన సామాన్య ప్రజానీ కానికి ఏమాత్రమూ ఊరట కలిగించలేక పోయింది. ఆకలి, పేదరికం, ఆనారోగ్యం -వీటిలో బాధపడే వాడి దగ్గరకిపోయి ''ఒరే! ఆకలి, పేదరికం, అనారోగ్యం అంతా మిథ్య'' అంటే వాడికి ఊరట ఎలా కలుగుతుంది? దేశ మంతటా తిరిగి తన పాండిత్యంతో, వాదనాపటి మతో మేధావులనందరినీ శంకరుడు ఓడించగలి గాడు. కాని ''నాకు ఎవరు దిక్కు?'' అని ఎదురు చూసే పేదవాడికి అద్వైతం సరైన పరిష్కారం చూపలేకపోయింది.
''మనం వత్తిడిలో, బాధలలో ఉన్నపుడు మనకు ఊరట కలిగించలేని తత్వవేత్తల సిద్థాంతాలు కేవలం మేధోపరమైన పెడవాదనలే తప్ప పెద్దగా ప్రాధాన్యత నివ్వవలసిన ఆలో చనలు కావు'', ''కష్టాలలో మునిగి వుండే భక్తులు భగవంతుడి నిరంతర సాన్నిహిత్యాన్ని వాంఛి స్తారు. ఈ అంశానికి శంకరుని అద్వైతం ఏమాత్రమూ న్యాయం చేయలేకపోయింది.'' అన్నారు డా|| రాధాకృష్ణన్‌.
ఈ నేపథ్యంలో భక్తి ఉద్యమం బలంగా ముందుకు వచ్చింది. భక్తితో పూజిస్తే దేవుడు చేయూతనిచ్చి ఆదుకుంటాడని చెప్పింది. ఈ ప్రపంచమంతా మిథ్య అని చెప్పిన అద్వైతానికి భిన్నంగా ఈ ప్రపంచమంతా వాస్తవమేననీ, అది ఈశ్వరమయమనీ చెప్పింది. భూమిపై పాపం పెరిగిపోయినపుడు భగవంతుడే స్వయం గా ఏదోఒక అవతారంలో దిగి వచ్చి ప్రజలను ఆదుకుంటాడనీ, దుష్టుల్ని శిక్షిస్తాడనీ చెప్పింది. ప్రపంచాన్ని సృష్టించడమేగాక మనకి సన్నిహి తుడైన స్నేహితుడిగా మార్గదర్శిగా దేవుడు ఉంటాడని చెప్పింది.
భక్తి ఉద్యమంలో ముఖ్య పాత్ర విశిష్టాద్వైత సిద్థాంత కర్త రామానుజుడిది. ఆయన క్రీ.శ.1027లో శ్రీ పెరంబుదూర్‌(తమిళనాడు) లో జన్మించాడు. శ్రీరంగం కేంద్రంగా చేసుకుని తన కృషిని కొనసాగించాడు. బ్రహ్మసూత్రా లపైనా, భగవద్గీతపైనా భాష్యాలు రచించాడు. ఇవి ఆనాటి పండితుల ఆమోదాన్ని పొందాయి. రామానుజుడి గురించిన ఒక కథ బాగా ప్రచా రం పొందింది.
రామానుజుడు తన గురువు వద్ద మంత్రోపదేశం పొందాడు. గురువుగారు రామా నుజుడి చెవిలో ''ఓం నమో నారాయణాయ'' అన్న మంత్రం చెప్పి దానిని రోజూ జపించ మన్నాడు. అలా చేస్తే ఏమౌతుంది? అని రామానుజుడు అడిగాడు. మోక్షం లభిస్తుందని గురువు చెప్పాడు. అయితే ఈ మంత్రం ఇంకెవరికీ తన అనుమతి లేకుండా చెప్పవద్ద న్నాడు. అలా చేస్తే నరకానికి పోతావని బెదిరిం చాడు. రామానుజుడు తిన్నగా కోవెల గోపురం ఎక్కి బైటనున్న ప్రజలందరినీ దగ్గరకు రమ్మని వారందరిచేత నారాయణ మంత్రం చెప్పిం చాడు. గురువు ఎందుకిలా చేశావని కేకలేశాడు. అప్పుడు రామానుజుడు ''గురువు గారూ..! నారాయణ మంత్రం జపించడంవల్ల వారంతా మోక్షం పొందుతారు గదా, అందుకే అలా చెప్పేను అని సమాధానమిచ్చాడు. ''ఈ మంత్రాన్ని నా అనుమతి లేకుండా ఇంకెవ్వరికీ చెప్పవద్దని ఆదేశించాను గదా! చెప్తే నువ్వు నరకానికి పోతావని కూడా హెచ్చరించేను కదా'' అని అన్నాడు గురువు. ''నేనొక్కడినే నరకానికి పోతే నేం? ఇన్ని వందల, వేల మంది మోక్షం పొందుతారు గదా'' అని రామానుజుడు జవా బిచ్చాడు.
దేవుడిని కోవెలలో బంధించి ఆగ్రవర్ణాలకే దేవాలయ ప్రవేశాన్ని అనుమతించి శూద్రులనూ, నిమ్న కులాల వారినీ దేవాలయాలలోకి రానివ్వ కుండా చేసిన అగ్రవర్ణ పెత్తనం సాగుతున్న ఆ రోజుల్లో కుల వ్యవస్థ కట్టుబాట్లను ధిక్కరించి దేవుడిని సామాన్య ప్రజలకు చేరువగా చేయడానికి రామానుజుడు పూనుకున్నాడు.
భక్తి ఉద్యమంలో వైష్ణవ మతానిది ముఖ్యమైన పాత్ర. వేదాలలో 'భగ' అన్న దేవుడి ప్రస్తావన ఉంది. శుభం జరిగేలా ఆశీర్వదించే దేవుడు ఇతగాడు. మహాభారతంలో భాగవత మతం ప్రస్తావన ఉంది. ఈ మతమే వైదిక దేవతలలో ఒకడైన విష్ణువును ప్రధాన దేవతగా ముందుకు తెచ్చింది. విష్ణుపురాణం, హరివంశం విష్ణువు ప్రాధాన్యతను మరింత పెంచి వేశాయి. క్రీ.శ.900 నాటి భాగవత పురాణం కృష్ణుడిని విష్ణువు అవతారంగా చిత్రీకరించింది. కృష్ణు డికీ, గోపికలకూ ఉన్న సంబంధాన్ని ప్రేమోద్వేగ, భావావేశ రూపంలోని భక్తి భావంగా చూపింది. పురుషుడి స్థానంలో కృష్ణుడిని, అతడిని భక్తితో ప్రేమతో సేవించుకునే సేవిక స్థానంలో భక్తులనూ చూపింది.
ఇక్కడ భక్తి భావం యొక్క విశిష్టత మనకు ఎంత మాత్రమూ ముఖ్యమైనది కాదు. ఈ భక్తి ఉద్యమం పోషించిన సామాజిక పాత్ర ముఖ్యం. ఆనాటి వర్ణ వివక్ష పూరిత, పురుషాధిక్య సమాజంలో శూద్రులనూ, స్త్రీలనూ దేవుడికి దూరంగా ఉంచివేశారు. భక్తి ఉద్యమం ఈ వివక్షతనూ, అణచివేతనూ సవాలు చేసి, తిరుగుబాటు చేసింది. వైష్ణవ మతాన్ని ప్రచారం చేసిన ఆళ్వారులు పన్నెండు మందిలో ఒక మహిళ, పలువురు శూద్రులు, ఒక రాజ కుమా రుడు ఉన్నారు. వీరు కవితా రూపంలో మతాన్ని ప్రచారం చేశారు. వీరు రచించిన కవితల సంకలనాన్ని 'నాలాయిర ప్రబంధం' అంటారు. ప్రజలందరికీ అర్థమయేలా వీరు ఆ కవితలను తమిళ భాషలో రచించారు. ఎవరైనా సరే భగవంతుడిని ఆరాధించవచ్చు. మోక్షం పొంద వచ్చు. మోక్షం అగ్రవర్ణాలకు, అందునా పురుషు లకు మాత్రమే పరిమితం కాదు అని స్పష్టం చేసింది భక్తి ఉద్యమం. కష్టాలతో, అణచివేతలతో నలిగిపోతున్న పేదలకూ, శూద్రులకూ, మహిళ లకూ భక్తి ఉద్యమం బాసటగా నిలిచింది. కులభేదాలను ఖండించింది. అందరూ దేవుని ముందు సమానమే అని చాటింది.
రామానుజుని అనంతరం వైష్ణవ మతం వడగలై(ఉత్తరాది) తెంగలై(దక్షణాది) అనే రెండు శాఖలుగా చీలిపోయింది. వడగలై శాఖ సంస్కృతానికీ, తాత్విక చర్చలకూ ప్రాధాన్యతనిస్తే తెంగలై తమిళ భాషకు ప్రాధాన్యతనిచ్చింది. వడగలై కుల విభేదాలను సమర్ధించింది. తెంగలై కుల విభేదాలను వ్యతిరేకించింది. వడగలై తెగది మర్కట కిశోర న్యాయం. అంటే కోతిపిల్ల తల్లి కోతిని గట్టిగా వదలకుండా పట్టుకున్నట్టు భక్తుడు భగవంతుడిని వదలకుండా పట్టుకోవాలి. స్వయంకృషి ద్వారా, జ్ఞాన, భక్తి మార్గాల ద్వారా భగవంతుడిని చేరుకోవాలి.
తెంగలై తెగది మార్జాల కిశోరన్యాయం. పిల్లిపిల్ల యోగక్షేమాలన్నీ తల్లి పిల్లే చూసుకున్నట్టు భగవంతుడే భక్తుల బాగోగులు చూసుకుంటాడు. భక్తులు భగవంతుని దయకోసం ప్రార్థించాలి. ఆ దయ పొందితే మోక్షం సిద్ధిస్తుంది. దైవం మీద భారం వేసి అతడిని ప్రార్థించమంటుంది తెంగలై శాఖ.
భారతదేశం వ్యాప్తంగా భక్తి ఉద్యమం వివిధ రూపాలలో వ్యాపించింది. పీఠాధిపతుల నాయకత్వంలో సంఘటితంగా అగ్రవర్ణాల ఆధి పత్యంలో అద్వైతం వ్యవస్థీకరించబడింది. దానికి పూర్తి భిన్నంగా ఎక్కడికక్కడ స్థానిక సామాన్య ప్రజల చొరవతో భక్తి ఉద్యమం విస్తరించింది.
దక్షిణాదిన వైష్ణవ మతం విస్తరించినట్టే తూర్పున బెంగాల్‌ ప్రాంతంలో చైతన్యుడు క్రీ.శ.15వ శతాబ్ధంలో భక్తి ఉద్యమకారుడైనాడు. అన్ని కులాల నుండీ, అన్ని మతాల నుండీ శిష్యులను చేర్చుకున్నాడు. మొట్టమొదటగా ముస్లిం మతస్థుడిని శిష్యుడిగా స్వీకరించింది చైతన్యుడే. రాధాకృష్ణ పూజకు చైతన్యుడు ప్రాధాన్యతనిచ్చాడు. ఇతడి ప్రభావంతోటే జయదేవుడు(అష్టపదుల ఫేమ్‌) గీతగోవిందం కావ్యాన్ని రచించాడు. భక్తిని, శృంగార రూపంలో వ్యక్తపరచడం రాధాకృష్ణ పూజ లక్షణం. కాలక్రమంలో ఇది వెర్రి తలలు వేసింది. అయితే ఇటువంటి ధోరణుల కన్నా భక్తి ఉద్యమం నుండి బయలుదేరిన సంస్కరణ ధోరణులే ప్రధానం. 14వ శతాబ్ధానికి చెందిన రామానందుడు కన్యాకుబ్జంలో జీవించాడు. కుల భేదాలపై యుద్ధం ప్రకటించి సహపంక్తి భోజనాలను ప్రోత్సహించాడు. అన్ని కులాల నుండీ, మహమ్మదీయుల నుండీ శిష్యుల్ని చేర్చుకున్నాడు. కృష్ణుడి స్థానే రాముడిని దేముడిగా ముందుకు తెచ్చాడు. రామభక్తి నైతిక ప్రవర్తనతో కలగలిపి ప్రచారం చేశాడు. అప్పటకే దేశంలో ముస్లిం రాజుల పాలన స్థిరపడింది. హిందూ ముస్లింలు సహజీవనం చేయడం అనివార్యం అని, అదే సరైన మార్గమని రామానందుడు ప్రబోధించాడు. మతసహనం, అన్యమత గౌరవం అవసరమని చాటి చెప్పాడు. సంస్కృత భాషను వదిలి హిందీ భాషలో ప్రచారం చేశాడు. ఇతడి శిష్యులలో బ్రాహ్మణులతోబాటు మహమ్మదీయుడైన కబీరు, మంగలి వృత్తినాచరించే సేన, వ్యవసాయం చేసే ధన్నా, దళితుడైన రామదాసు, పద్మావతి అనే స్త్రీ ఉన్నారు. వీరంతా రామానందుని భావాలను విస్తృతంగా ప్రచారం చేశారు.
కబీరు క్రీ.శ.1398-1500 సం|| మధ్య జీవించాడు. రామ్‌-రహీమ్‌ ఒక్కరే అని ప్రచారం చేశాడు. హిందూ, ముస్లిం మత సామరస్యాన్ని ప్రబోధించాడు. ఓ బ్రాహ్మణుడా, వేరొక వ్యక్తి నిన్ను తాకినంత మాత్రానే మైలపడిపోయానని భావించి నువ్వు మళ్లీ స్నానం చేస్తున్నావే. ఎవరో నిన్ను తాకితేనే మైలపడ్డావంటే అతడికంటే నువ్వే బలహీనుడవై ఉన్నావని, తక్కువ స్థాయికి నిన్ను నువ్వు నెట్టుకుంటున్నావని నీకు అర్థం కాలేదా?'' అని ప్రశ్నించాడు కబీరు.
క్రీ.శ.1532లో జన్మించిన తులసీదాసు హిందీ భాషలో సామాన్య జనానికి అర్థం అయ్యే తేలిక పద్ధతిలో రామాయణాన్ని రామచరిత మానస్‌ పేరుతో రచించాడు. మత సామరస్యం, జీవకారుణ్యం, సాత్విక భక్తి వంటి భావాల వ్యాప్తికి తోడ్పడ్డాడు.
మరాఠా ప్రాంతంలో సైతం భక్తి ఉద్యమం విలసిల్లింది. క్రీ.శ.1370లో జన్మించిన నామదేవ్‌ సీతారాముల భక్తి ప్రచారం చేశాడు. విగ్రహారాధననూ, వ్రతాలనూ నిరసించి భూతదయ, సమదృష్టి నిజమైన భక్తి అలవర్చుకోమన్నాడు.
క్రీ.శ.1607లో శూద్ర కుటుంబంలో జన్మించిన తుకారాం భక్తి మార్గాన్ని విశేషంగా ప్రచారం చేశాడు. 'అభంగాలు' పేర మరాఠీ భాషలో భక్తి భావాలను ప్రచారం చేశాడు. ఆచారాలను కట్టుబాట్లను ఎదిరించాడు. మానవసేవే మాధవ సేవ అని ప్రచారం చేశాడు.
తెలుగు నాట భక్తి ఉద్యమం బలంగానే విలసిల్లింది. త్యాగయ్య, అన్నమయ్య తేట తెలుగులో చిరస్మరణీయమైన గేయాలతో అద్భుతమైన సంగీతంతో భక్తి భావాలను ప్రచారం చేశారు. భోగభాగ్యాలను, రాజుల ఆశ్రయాన్ని తిరస్కరించి ప్రజల మధ్య గడిపారు. ''మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి యొకటే, ఛండాలుండేటి సరి భూమి యొకటే'' అన్న అన్నమయ్య కీర్తన లోక ప్రసిద్ధం. అందరికీ శ్రీహరే అంతరాత్మ అన్నాడు అతను. త్యాగయ్య రామ భక్తి గానం చేస్తే అన్నమయ్య వెంకటేశ్వర భక్తి ప్రచారం చేశాడు. క్షేత్రయ్య మువ్వగోపాల పదాలతో కృష్ణ భక్తిని ప్రచారం చేశాడు.
తెలుగులో భాగవతం రచించిన బమ్మెర పోతన తన కవిత్వాన్ని రాజులకు అంకితమిచ్చేందుకు నిరాకరించాడు. తేలికపదాలతో పోతన రచించిన భాగవత పద్యాలు తెలుగునాట తెలుగు వారి నోళ్లల్లో చిరంజీవులుగా ఉన్నాయి.
బ్రహ్మనాయుడు పలనాడులో భక్తి ఉద్యమాన్ని వ్యాపింపజేయడానికి కృషి చేయడమే గాక, అన్ని కులాల వారిని ఒకే తీరున చూడాలని ప్రబోధించాడు. 17వ శతాబ్ధానికి చెందిన యోగి వేమన, కంచర్ల గోపన్న (భక్త రామదాసు) - భక్తి ఉద్యమాన్ని సాంఘిక సంస్కరణలను ప్రచారం చేశారు.
స్త్రీకి పతియే ప్రత్యక్ష దైవం అన్న పురుషాధిక్య ధోరణి మనువాదంలో బలంగా మనకు కనపడుతుంది. భక్తి ఉద్యమం దీనిని బలంగా సవాలు చేసింది. మీరాబాయి 'మొగుడే దేవుడు' అన్న మనువాదాన్ని తిరగ్గొట్టి ''దేవుడే నా మొగుడు'' అని ప్రకటించి కృష్ణుడినే భర్తగా స్వీకరించింది. అది ఆ రోజుల్లో ఒక గొప్ప, అసాధారణ తిరుగుబాటు. సక్కుబాయి ''భర్తే దేవుడి కన్నా మిన్న'' అనే పెత్తందారీ వత్తిడిని తిరస్కరించి ''నాకు దేవుడే భర్త కన్నా గొప్ప'' అని ఎదురుతిరిగింది. మన తెలుగునాట కుమ్మరి కులంలో పుట్టిన మొల్ల రామభక్తి ప్రధానంగా ''మొల్ల రాయాయణం'' రచించింది.
కుల వివక్షతపైన, పురుషాధిక్యతపైన, సాంఘిక దురాచారాలపైన తిరుగుబాటు చేయడం ఈనాటి ఆధునిక యుగంలో సైతం ఎంత కష్ట సాధ్యమో ఆయా ఉద్యమాలలో పాల్గొంటున్న వారందరికీ తెలుసు. ఆధునిక శాస్త్ర విజ్ఞానం, శాస్త్రీయ సోషలిస్టు సిద్థాంతం అండగా ఉన్నప్పటికీ ఇది ఆశించినంత వేగంగా, శక్తివంతంగా సాగడంలేదు. అటువంటి అండ ఏదీ లేని, సాధ్యం కాని మధ్యయుగాల కాలంలో భక్తి ఉద్యమం విస్తరించిన తీరు ఆ ఉద్యమంలోని అభ్యుదయ పార్శ్వానికి అద్దం పడుతుంది. భక్తి ఉద్యమమంతా భావవాదపు చెత్తగా పరిగణించి కొట్టి పారెయ్యడం సరైనది కాదు. అందులోని అభ్యుదయపు పార్శ్వాన్నీ, సంస్కరణ అంశాలనూ ప్రస్తుత కాలపు ప్రగతి వాదులంతా స్వీకరించి ఉద్యమ పురోగమనానికి వాడుకోవాలి.
ప్రపంచీకరణ యుగంలో ప్రజలలో భక్తి మరీ పెరిగిపోవడం భౌతిక వాదులకు ఆందోళన కలిగించే విషయం. అయితే ఇలా ఎందుకు జరుగుతోందో తెలుసుకోవాలి. ప్రపంచీకరణ విధానాల వల్ల సంపద కేంద్రీకరణ జరుగు తోంది. ఇంకోవైపు పేదరికం పెరిగిపోతోంది. మధ్య తరగతిలో సైతం ఆదాయాలు పెరుగుతున్నట్టే కనపడినప్పటికీ, అభద్రతా భావం పెరుగుతోంది. ప్రైవేటు రంగం విస్తరించడం, ఉత్పత్తితో ముడిపడని, చంచలమైన ఫైనాన్సు పెట్టుబడి పాత్ర, స్పెక్యులేషన్‌ పెరిగిపోవడం మధ్యతరగతి అభద్రతకు కారణాలు. అభివృద్ధి ఏమేరకు జరిగినా అది కొన్ని సంపన్న దేశాలకూ, మన దేశంలో కొన్ని నగరాలకూ మాత్రమే పరిమితం అయిపోతోంది. వృద్ధాప్యంలో తోడుగా ఉండవలసిన సంతానం బతుకు తెరువుకోసం విదేశాలకో, దేశంలోని ప్రధాన నగరాలకో తరలిపోతున్నారు. కుటుంబ సంబంధాలపై దీని ప్రభావం తీవ్రంగా పడుతున్నది. పేదల బతుకులెంత నికృష్టంగా తయారవుతున్నాయో అందరికీ తెలుసు. నైరాశ్యం పెరిగి లక్షలాది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటువంటి దశలో ప్రజలను కదిలించే బలమైన ఉద్యమాలు నిర్మింపబడితే, ప్రజలలో విశ్వాసం పాదుకొల్పగలిగితే ఫలితాలు వేరుగా ఉంటాయి. కాని ప్రగతి శీల, కమ్యూనిస్టు ఉద్యమాలకు చారిత్రకంగా ఏర్పడిన బలహీనతలు, పరిమితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తి భావాలు, మూఢ విశ్వాసాలు పెరుగుతున్నాయి.
ప్రపంచీకరణ విధానాలకు సైదోడుగా దేశంలో మత ఛాందసవాదం, మతోన్మాదం, కులతత్వం పెరిగిపోవడం మనకు కనపడుతోంది. బాబరిమసీదు వివాదం మొదలు నేటి వరకు ఎంతటి మారణ హౌమం జరిగిందో మన చూస్తున్నాం. దీనిని లౌకిక ప్రజాస్వామ్యవాదులంతా ఎదిరించి ఓడించాలి. అటువంటి కృషికి మన పూర్వకాలపు భక్తి ఉద్యమంలోని ప్రగతిశీల ధోరణులు ఎంతగానే తోడ్పడతాయి.


Note :Article form THE MARXIST PAPER  Markist Paper

by
M.V.S Sharma